UIDAI | రెండు కోట్ల ఆధార్ కార్డులు డియాక్టివేట్.. మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: UIDAI | దేశంలో సుమారు రెండు కోట్ల మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు UIDAI వెల్లడించింది. చనిపోయిన వ్యక్తుల ఆధార్ను ఎవరైనా దుర్వినియోగం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర సేవలను అక్రమంగా పొందకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆధార్ డేటాబేస్లోని అదనపు వివరాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సుమారు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. […]