Penci Sport plugin only working with the Soledad theme.

జాతీయం - Telugu News Today

Category: జాతీయం

  • IRCTC ticket booking new rules | టికెట్ల బుకింగ్​లో కొత్త అప్డేట్.. నేటి నుంచి అమలులోకి వచ్చిన IRCTC కొత్త రూల్స్​ ఇవే..

    IRCTC ticket booking new rules | టికెట్ల బుకింగ్​లో కొత్త అప్డేట్.. నేటి నుంచి అమలులోకి వచ్చిన IRCTC కొత్త రూల్స్​ ఇవే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: IRCTC ticket booking new rules | భారతదేశంలో రైలు ప్రయాణాలకు ఉన్న ఆదరణ ఎంతటిదో అందరికీ తెలిసిందే. దూరప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక స్థలాలు – ఎక్కడికైనా సరే, ఎక్కువ మంది రైల్వేను ఎంచుకుంటారు. టికెట్ ధరలు సరసమైనవి కావడంతో పాటు, ప్రయాణం సురక్షితమనే నమ్మకం కూడా దీనికి కారణం. అయితే, రైళ్లలో రద్దీ కూడా తక్కువేమీ కాదు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిని గమనించి, చాలా మంది ముందుగానే – నెలల ముందు – టికెట్లను రిజర్వ్ చేసుకుంటారు. రైల్వే విభాగం కూడా టికెట్ బుకింగ్ వ్యవస్థలో నిరంతరం మార్పులు (IRCTC New Rules) చేస్తూ వస్తోంది. ఇటీవలే టికెట్లకు సంబంధించి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..

    రైలు టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో స్పష్టతను పెంచడానికి, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి భారతీయ రైల్వేలు సమయానుసారం కొత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా, అక్టోబర్ 1 నుంచి సాధారణ టికెట్ రిజర్వేషన్‌కు సంబంధించిన నియమాల్లో మార్పులు (IRCTC ticket booking new rules) చేశారు. టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణ అనివార్యం చేశారు. అప్పటి నుంచి, IRCTCతో ఆధార్ లింక్ చేసిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లను రిజర్వ్ చేయగలరు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు)లో బుకింగ్‌కు సంబంధించి రైల్వేలు మరిన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి.

    IRCTC ticket booking new rules

    IRCTC ticket booking new rules | 15 నిమిషాల నుంచి 4 గంటల వరకు సమయ విస్తరణ

    ప్రస్తుతం, సాధారణ రిజర్వేషన్ విండో తెరిచిన వెంటనే IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో మొదటి 15 నిమిషాల్లో ఆధార్ ధ్రువీకరణ ఉన్న వినియోగదారులకు మాత్రమే రిజర్వేషన్ అవకాశం లభిస్తుంది. ఈ సమయాన్ని డిసెంబర్ 29, 2025 నుంచి నాలుగు గంటలకు విస్తరించారు. అంటే, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ బుకింగ్ చేయాలంటే ఆధార్ ధ్రువీకృత ఖాతాలు మాత్రమే అర్హత కలిగి ఉంటాయి. టికెట్ల దుర్వినియోగం లేదా మోసపూరిత బుకింగ్‌లను నియంత్రించడానికి ఆధార్ ధ్రువీకరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని IRCTC అభిప్రాయపడుతోంది. అందుకే ఈ సమయాన్ని 15 నిమిషాల నుంచి 4 గంటలకు పెంచారు. ఆధార్ ధ్రువీకరణ లేని వినియోగదారులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే టికెట్లను రిజర్వ్ చేయవచ్చు.

    అయితే, ఈ సమయ పరిమితులను జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆ తర్వాత జనవరి 12 నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు మరింత విస్తరించనున్నారు. అంటే, ఈ సమయాల్లో కేవలం ఆధార్ ధ్రువీకృత వినియోగదారులు మాత్రమే టికెట్లను బుక్ చేయగలరు. ఇలాంటి చర్యలతో టికెట్ అక్రమాలను అరికట్టాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

    IRCTC ticket booking new rules | తత్కాల్ టికెట్లకు కూడా ఆధార్ లింక్ అనివార్యం

    తత్కాల్ టికెట్ల (ఆన్‌లైన్)కు సంబంధించి 2025, జులై 1 నుంచి ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. 2025, జులై 15 నుంచి PRS కౌంటర్లు లేదా ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసినప్పుడు కూడా OTP ధ్రువీకరణ అవసరం ఉంటుంది. ఈ కొత్త నియమాలు అన్నీ ఆన్‌లైన్ బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయి. PRS కౌంటర్ల ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకునే వారికి ఇవి వర్తించవు.

    IRCTC ticket booking new rules | IRCTC ఖాతాతో ఆధార్ లింక్ చేయడం ఎలా..

    • IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వండి.
    • My Accounts విభాగంలోకి వెళ్లి, Link Your Aadhaar ఎంపికను ఎంచుకోండి.
    • ఆధార్ నంబర్ లేదా వర్చువల్ IDని నమోదు చేయండి. ఆధార్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం వంటివి సరిపోతున్నాయో పరిశీలించండి.
    • వివరాలను ధ్రువీకరించి, OTPపై క్లిక్ చేయండి.
    • మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి సబ్మిట్ చేస్తే, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత టికెట్లు సులభంగా బుక్ చేయవచ్చు.

    ఇది కూడా చదవండి..: Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్​లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!

  • Indian Rupee Hits |ఆల్​టైం కనిష్టానికి రూపాయి.. రికార్డు స్థాయిలో పడిపోయిన వైనం

    Indian Rupee Hits |ఆల్​టైం కనిష్టానికి రూపాయి.. రికార్డు స్థాయిలో పడిపోయిన వైనం

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Indian Rupee Hits :అంతర్జాతీయ ద్రవ్య మారక మార్కెట్‌లో భారతీయ రూపాయి విలువ గణనీయంగా క్షీణిస్తోంది. ఇటీవలి రోజుల్లో ఈ పతనం మరింత పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి మారకం రేటు గణనీయంగా పడిపోయి.. డాలర్‌కు 90.83 స్థాయిని చేరుకుంది. ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా నిపుణులు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఆలస్యం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణలను పేర్కొంటున్నారు.

    Indian Rupee Hits
    Indian Rupee Hits

    భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడంతో పెట్టుబడిదారుల మనోభావాలు ప్రతికూలంగా మారాయి. అదనంగా, మార్కెట్‌లో ఒడిదొడుకులు, డాలర్‌కు డిమాండ్ పెరగడం వంటి అంశాలు రూపాయి బలహీనతపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని.. ఇలాగే కొనసాగితే త్వరలో 91 స్థాయిని కూడా తాకవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Indian Rupee Hits :స్టాక్ మార్కెట్‌లు కూడా నష్టాల్లో..

    దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు కూడా ఈ ప్రతికూల పరిణామాల నుంచి తప్పించుకోలేదు. మంగళవారం సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా క్షీణించగా.. నిఫ్టీ సూచీ 25,900 స్థాయి వద్ద ఒడిదొడుకులకు లోనైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సుమారు 359 పాయింట్లు పడిపోయి 84,854 స్థాయికి, నిఫ్టీ 105 పాయింట్ల నష్టంతో 25,921 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, పెట్టుబడిదారుల జాగ్రత్త వైఖరి సూచీలపై ఒత్తిడి తెచ్చాయి.

    రూపాయి బలహీనతపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందన

    రూపాయి విలువలో ఈ క్షీణతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పందించారు. రూపాయి తన స్థాయిని స్వయంగా నిర్ణయించుకుంటుందని, దీన్ని రాజకీయంగా చర్చించవద్దని ఆమె సూచించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధిక ద్రవ్యోల్బణం మరియు బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా రూపాయి పతనం మరింత ఆందోళనకరంగా ఉండేదని.. ప్రస్తుతం ఆర్థిక పునాదులు బలోపేతమై ఉన్నాయని ఆమె చెప్పారు.

    Indian Rupee Hits :రూపాయి క్షీణత ప్రభావాలు

    రూపాయి బలహీనత వల్ల దిగుమతుల ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది కాబట్టి.. ఇది ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. మనం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఎరువులు, వంట నూనెలు వంటి అవసరాలకు కూడా విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతున్నాం. దిగుమతి బిల్లులు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ కావచ్చు. దీని ఫలితంగా రవాణా ఖర్చులు మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.

    విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థులపై కూడా ఈ పరిణామం భారం మోపుతుంది. గతేడాదితో పోలిస్తే వార్షిక ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది. విద్యా రుణాలపై కూడా అదనపు వడ్డీ భారం 12-13 శాతం వరకు పెరగవచ్చు.

    అయితే, గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత రూపాయి సంక్షోభం కొంత భిన్నంగా కనిపిస్తోంది. 2022 తర్వాత ఇది రూపాయికి మరింత సవాలుతో కూడిన కాలంగా మారుతోంది. అప్పట్లో డాలర్ బలోపేతం కారణంగా అనేక దేశాల కరెన్సీలు పడిపోయాయి. కానీ ఇప్పుడు డాలర్ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి మాత్రమే బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సుమారు 690 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి.

    Indian Rupee Hits
    Indian Rupee Hits

    Indian Rupee Hits :ఇది గత చమురు ధరల పెరుగుదల సమయంతో పోలిస్తే బలమైన స్థితిని సూచిస్తుంది.

    ప్రవాసులకు, Indian Rupee Hits, ఎగుమతి రంగానికి లాభం

    రూపాయి బలహీనత అందరికీ నష్టమే కాదు. కొందరికి లాభదాయకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రెమిటెన్స్‌లు భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులకు ఇది శుభవార్త. నెలకు 500 డాలర్లు పంపేవారికి గతంలో రూ.40,000 వచ్చేది. కాగా.. ప్రస్తుతతం రూ.45,000 వరకు వస్తాయి. అలాగే, డాలర్‌లో ఆదాయం ఆర్జిస్తున్న ఐటీ మరియు ఫార్మా సంస్థలకు కూడా ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.

    RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి..

    ఈ ఏడాది ఇప్పటివరకు ఇది నాలుగో రేటు కోత కావడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. ప్రస్తుతం మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో మొత్తం 1.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్లయింది. ఈ నిరంతర కోతలతో హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఈఎంఐ భారం నుంచి మరింత ఉపశమనం లభించనుంది.

    గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రూపాయి మారకం విలువలో కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా గతంలో లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఆర్థిక వృద్ధి ఊపందుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు” అని వివరించారు.

    RBI interest Rates | సమీక్షలో ప్రకటించిన మరిన్ని ముఖ్య అంశాలు..

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి భారీగా పెంచుతూ ఆర్‌బీఐ ఆశాజనక సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, వినియోగం పెరుగుదల కారణంగా రెండో త్రైమాసికంలోనే 8.2 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది.
    • ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2.0 శాతానికి తగ్గించారు. ఇది సామాన్య ప్రజలకు మరింత ధరల స్థిరత్వాన్ని సూచిస్తుంది.
    • ద్రవ్యత పెంచేందుకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
    • ఇక దేశీయ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నట్లు గవర్నర్ చెప్పారు.

    RBI interest Rates | రుణగ్రహీతలకు ఊరట

    వరుసగా వడ్డీ రేటులో కోత విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత పెరిగి, పెట్టుబడులు, వినిమయం ఊపందుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా ఈ తగ్గింపును తమ లోన్ రేట్లకు త్వరగా అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ ఒత్తిడి తెస్తోంది. సామాన్య రుణగ్రహీతలకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది.

    ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • 2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల.. మొత్తం ఎన్ని రోజులు హాలీడేస్​ అంటే..!

    2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల.. మొత్తం ఎన్ని రోజులు హాలీడేస్​ అంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: 2026 Holidays List | కొత్త సంవత్సరంలో కొన్ని రోజుల్లో అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు వర్తించే 2026 సంవత్సరం సెలవుల జాబితాను (2026 Holidays List) అధికారికంగా ప్రకటించింది. ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాలు లేదా వ్యక్తిగత పనుల కోసం ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ క్యాలెండర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 2025తో పోల్చితే 2026లో సెలవుల గణనీయంగా పెరగడం ఉద్యోగులు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది.

    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం 2026లో మొత్తం 14 తప్పనిసరి (గెజిటెడ్) సెలవులు, 12 ఐచ్ఛిక (రెస్ట్రిక్టెడ్) సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి నెలలోని రెండో శనివారాలు (12 రోజులు), అన్ని ఆదివారాలు (52 రోజులు) కూడా సెలవులుగానే పరిగణించబడతాయి.

    2026 Holidays List

    2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల

    సెలవుల వివరాలు

    • జనవరి 1 – నూతన సంవత్సర దినోత్సవం
    • జనవరి 14 – మకర సంక్రాంతి / పొంగల్
    • జనవరి 23 – వసంత పంచమి
    • జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
    • ఫిబ్రవరి 1 – గురు రవిదాస్ జయంతి
    • ఫిబ్రవరి 15 – మహా శివరాత్రి
    • ఫిబ్రవరి 19 – ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
    • మార్చి 4 – హోలీ
    • మార్చి 19 – తెలుగు ఉగాది
    • మార్చి 21 – ఈదుల్ ఫితర్ (రంజాన్)
    • మార్చి 26 – శ్రీరామ నవమి
    • మార్చి 31 – మహావీర్ జయంతి
    • ఏప్రిల్ 3 – గుడ్ ఫ్రైడే
    • ఏప్రిల్ 5 – ఈస్టర్ సండే
    • ఏప్రిల్ 14 – డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
    • మే 1 – బుద్ధ పౌర్ణమి
    • మే 27 – బక్రీద్
    • జూన్ 26 – మొహర్రం
    • ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
    • ఆగస్టు 26 – మిలాద్-ఉన్-నబీ, ఓణం
    • ఆగస్టు 28 – రక్షా బంధన్
    • సెప్టెంబర్ 4 – శ్రీ కృష్ణ జన్మాష్టమి
    • సెప్టెంబర్ 14 – వినాయక చతుర్థి
    • అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి
    • అక్టోబర్ 18, 19, 20 – దసరా సెలవులు (విజయదశమి సహా)
    • నవంబర్ 8 – దీపావళి
    • నవంబర్ 15 – ఛత్ పూజ
    • నవంబర్ 24 – గురు నానక్ జయంతి
    • డిసెంబర్ 25 – క్రిస్మస్

    పాఠశాలల విషయానికి వస్తే దసరా సెలవులు సాధారణంగా ఒక వారం నుంచి పది రోజుల వరకు ఉంటాయి. అలాగే వేసవి సెలవులు, ఇతర స్థానిక సెలవులు కలుపుకుంటే విద్యార్థులకు సంవత్సరానికి సుమారు 100 రోజులకు పైగా సెలవులు లభించే అవకాశం ఉంది.

    ఈ కొత్త సెలవుల క్యాలెండర్‌తో ఉద్యోగులు, తల్లిదండ్రులు ముందుగానే తమ వార్షిక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘ కాల సెలవులు (లాంగ్ వీకెండ్స్) వచ్చే తేదీలను గమనించి ప్రయాణాలు ప్లాన్​ చేసుకోవచ్చు.

    ఇది కూడా చదవండి..: Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

    EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్​వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్​, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్​బుక్​లు అప్​డేట్​ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా ఖాతాలో మాత్రమే ఇలా జరిగిందా?” అని ఆందోళన చెందుతూ ఈపీఎఫ్‌వోను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

    ఈ విషయంపై అధికారిక స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. ఈ సమస్య వల్ల ఎవరి డబ్బు కోల్పోలేదని, ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల వచ్చిన తాత్కాలిక ఇబ్బందేనని పేర్కొంది. ప్రస్తుతం కొత్తగా పునర్నిర్మించిన ఈసీఆర్ (ECR) లెడ్జర్‌లో డేటా పోస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల జమల వివరాలు పాస్‌బుక్‌లో ప్రతిబింబించడం ఆలస్యమవుతోంది. త్వరలోనే ఈ డేటా పూర్తిగా అప్‌డేట్ అయి సభ్యుల ఖాతాల్లో కనిపిస్తుందని ఈపీఎఫ్‌వో హామీ ఇచ్చింది. అందువల్ల సభ్యులు అనవసర ఆందోళన చెందాల్సిన పని లేదని, కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

    EPFO Passbook | పాస్​బుక్​ లైట్​

    ఇదే సమయంలో సభ్యుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్‌వో ఇటీవల ‘పాస్‌బుక్ లైట్’ అనే కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రతిసారీ ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లోనే ‘పాస్‌బుక్ లైట్’ ఆప్షన్ ద్వారా ప్రస్తుత బ్యాలెన్స్, జమ, విత్‌డ్రా వివరాలు సులభంగా చూసుకోవచ్చు.

    ప్రస్తుతం పాస్‌బుక్‌లో రెండు నెలల జమ కనిపించకపోయినా, ఇది కేవలం సాంకేతిక అప్‌డేషన్ ప్రక్రియలో భాగమే తప్ప ఎటువంటి నష్టం జరగలేదు. త్వరలోనే అప్​డేట్​ అయ్యే అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి..: Loan rejection | మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా.. లోన్ రావడం లేదా.. ఈ కారణాలు ఉండొచ్చు..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • New Labour Codes | అమలులోకి కొత్త కార్మిక చట్టాలు.. ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..!

    New Labour Codes | అమలులోకి కొత్త కార్మిక చట్టాలు.. ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: New Labour Codes | ఉద్యోగుల హక్కులు, భద్రత, సంక్షేయం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తీసుకొచ్చింది. అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణల ద్వారా సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లను కూడా సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థలో చేర్చారు. అందరు ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో పాటు, పారదర్శకత మరియు స్థిరమైన ఉపాధికి లిఖిత హామీ లభిస్తుంది. అన్ని రంగాల్లో కనీస వేతనాలు, లింగ వివక్ష లేకుండా సమాన వేతనం, సకాలంలో వేతన చెల్లింపులు వంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఇకపై కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం పాత 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ తయారు చేసిన నాలుగు కొత్త కోడ్‌లు తీసుకొచ్చింది. ఇందులో వేతనాల కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, సామాజిక భద్రత కోడ్-2020, వృత్తిపర భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్-2020 అమలులోకి వచ్చాయి. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళల సాధికారతతో పాటు గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లకు ప్రత్యేక రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలుస్తాయి. అన్ని ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో ఉపాధి స్థిరత్వం మరియు పారదర్శకతకు బలమైన హామీ లభిస్తుంది.

    New Labour Codes | గిగ్​ వర్కర్లకు పీఎప్​ సౌకర్యం

    గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లతో సహా అందరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF), ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC), బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయి. ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధి (FTE) ఉద్యోగులకు కూడా స్థిర ఉద్యోగులతో సమానంగా సెలవులు, వైద్య సౌకర్యాలు, సామాజిక భద్రత లభిస్తుంది. ఇకపై FTE ఉద్యోగులు ఐదేళ్ల బదులు కేవలం ఒక్క ఏడాది సర్వీసు పూర్తి చేసిన తర్వాత నుంచే గ్రాట్యుటీకి అర్హులవుతారు. అన్ని కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధ హక్కుగా మారింది. వేతనాలు సకాలంలో చెల్లించని యజమానులపై జరిమానాలు విధిస్తారు. ఐటీ రంగ ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోపు వేతనం అందేలా నిబంధనలు ఉన్నాయి.

    New Labour Codes | అసంఘటిత రంగ కార్మికుల కోసం..

    బీడీ పరిశ్రమ, సిగరెట్ తయారీ, మైనింగ్ వంటి రంగాల్లో 8 నుంచి 12 గంటల వరకు పని చేసే సౌలభ్యం కల్పించారు. అయితే వారానికి 48 గంటలు మించకూడదు. 40 ఏళ్లు దాటిన అందరు ఉద్యోగులకు యజమానులు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. సమాన పనికి లింగ భేదం లేకుండా సమాన వేతనం తప్పనిసరి. సాధారణ పని గంటలు మించితే రెట్టింపు వేతనం చెల్లించాలి. రాత్రి షిఫ్టులు, అండర్‌గ్రౌండ్ మైనింగ్ వంటి పనుల్లో మహిళలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దానికి తగిన భద్రతా చర్యలు యజమానులు తీసుకోవాలి.

    గిగ్ వర్క్, ప్లాట్‌ఫాం వర్క్, అగ్రిగేటర్లను (ఉదా: ఉబర్, స్విగ్గీ వంటి కంపెనీలు) చట్టంలో మొదటిసారి నిర్వచించారు. ఈ అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం సామాజిక భద్రతా నిధికి కేటాయించాలి. ఆధార్ ఆధారిత సామాజిక భద్రతా ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉంటాయి. జర్నలిస్టులు, డిజిటల్ మీడియా కార్మికులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, స్టంట్ ఆర్టిస్టులు సహా అందరూ పూర్తి సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు.

    New Labour Codes | ప్రతి కార్మికుడికి గౌరవం – మోదీ ప్రభుత్వ హామీ

    “ప్రతి కార్మికుడికి గౌరవం” అనేది మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రమాదకర రంగాల్లో వంద శాతం ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సంస్కరణలు ఆత్మనిర్భర భారత్‌కు బలమైన అడుగుగా నిలుస్తాయని, వికసిత భారత్ లక్ష్యానికి కొత్త ఊపిరి పోస్తాయని మంత్రి వివరించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్మిక కోడ్‌ల అమలును స్వాగతిస్తూ “శ్రమేవ జయతే” అని పోస్టు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక సంస్కరణలు ఇవే అని ఆయన అభివర్ణించారు. ఈ చట్టాలు కార్మికులకు శక్తినిస్తాయని, హక్కులను కాపాడుతూనే దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Saudi Arabia Bus Crash | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Saudi Arabia Bus Crash) జరిగింది. ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాగా.. మృతులు హైదరాబాద్‌ వాసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

    Saudi Arabia Bus Crash | మక్కాకు వెళ్తుండగా..

    ఉమ్రా యాత్రికులు మక్కా మసీదు అల్‌హరామ్‌లో ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. సౌదీ అధికారులు రక్షణ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు బాధితులను రక్షించేందుకు, మృత దేహాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరణాల సంఖ్య ఇంకా ధ్రువీకరణ కాలేదు. కానీ.. స్థానిక మీడియా ప్రకారం 42 మంది మరణించినట్లు వార్తలు రాస్తున్నాయి. గాయపడినవారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చారని అధికారులు తెలిపారు.

    Saudi Arabia Bus Crash | రంగంలో ఇండియన్​ ఎంబసీ

    రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఇండియన్​ ఎంబసీ వెంటనే దీనిపై దృష్టి పెట్టింది. హజ్​ కమిటీతో పాటు భారతీయ ఎంబసీ.. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాయి. మృత దేహాలను భారత దేశానికి తీసుకురావడానికి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: sabarimala temple | శబరిమల అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. మండల-మకరవిళక్కు సీజన్​లో భాగంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు. కానీ సోమవారం తెల్లవారు జాము నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

    sabarimala temple | నేటి నుంచి భక్తులకు అనుమతి

    ఆలయ ప్రధాన పూజారి ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను నిర్వహించారు. పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్ల వద్ద అధి(పవిత్ర మంట)ని వెలిగించారు. కాగా.. ఆదివారమే ఆలయాన్ని తెరిచినా.. సోమవారం తెల్లవారుజామున అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరిచి తీర్థయాత్ర సీజన్​ను ప్రారంభించారు. నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తున్నారు. కాగా.. తీర్థయాత్ర సీజన్​కు సంబంధించిన ఏర్పాట్లను ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) పరిపాలనా కమిటీ పర్యవేక్షిస్తోంది.

    sabarimala temple | అందుబాటులో స్పాట్ బుకింగ్ కేంద్రాలు!

    ఆన్​లైన్​లో టికెట్లను బుక్ చేసుకుని ప్రతిరోజూ 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చు. పంబ, నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం, చెంగన్నూర్​లలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి ఆన్​లైన్ బుకింగ్ తప్పనిసరి చేశారు. దర్శన టికెట్లను sabarimalaonline.org వెబ్​సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక అయ్యప్ప ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

    sabarimala temple

    sabarimala temple | భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

    శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించారు. చిన్నారులు, మహిళల కోసం స్పెషల్​ క్యూ వ్యవస్థను తెచ్చారు. మాలికప్పురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలా ఏర్పాట్లు చేశారు.

    sabarimala temple | డిసెంబర్​ 27వ తేదీ వరకు..

    41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగియనుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు.

    ఇది కూడా చదవండి..: Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

    Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Prashant kishor | ప్రశాంత్​ కిషోర్​.. దేశ రాజకీయాల్లో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని అనేక పార్టీలను గెలుపు తీరాలకు చేర్చారు. దేశంలో చాలా పార్టీలు ఆయనతో పనిచేసేందుకు ఆరాటపడుతుండేవి. అయితే తాజాగా ఆయన పరిస్థితి ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లు’గా మారింది. ఎందుకంటే ఆయన స్థాపించిన జన్​ సురాజ్​ పార్టీ బీహార్​ డకౌట్​ అయ్యింది. 238 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది.

    Prashant kishor | బొక్కబోర్లా పడ్డ జన్​సురాజ్​ పార్టీ

    బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకుమించి ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. 200లకు పైగా సీట్లు దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్​ బంధన్​ కూటమి 35 సీట్లకే పరిమితమైంది. ఇక ప్రశాంత్​ కిషోర్ (Prashant kishor)​ పార్టీ ఖాతా కూడా తెరవకుండా బొక్కబోర్లా పడింది. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీతో (I-PAC) వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలను అధికారంలో తీసుకురావడంలో పీకే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.

    Prashant kishor | ఐ-ప్యాక్‌‌తో ఫేమస్..

    ప్రశాంత్ కిషోర్ గతంలో ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) స్థాపించారు. వివిధ దేశాల ఎన్నికల్లో అనుసరించే ప్రచార శైలిని భారత్‌లో తీసుకువచ్చారు. దశాబ్ద కాలానికి పైగా వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. సమాచార విశ్లేషణ ఆధారిత విధానాలు అవలంభించడం, బూత్‌ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అస్త్రాలతో పార్టీలను విజయ తీరాలకు చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పని చేసిన పీకే.. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, బీహార్ నీతీశ్‌ కుమార్‌ గెలుపునకు పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్‌లో అమరీందర్ సింగ్, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పనిచేసి.. ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.

    Prashant kishor

    Prashant kishor | వ్యూహాలు విఫలం

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి విజయ ఢంకా మోగించింది. ఎన్నికల ముందు ఎన్డీఏ, మహాగఠ్​ బంధన్​ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని భావించారు. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ కూడా గణనీయమైన మార్పుకు కారణం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తాజా ఫలితాల్లో జన్‌సురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. తన వ్యూహ చతురతతో దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలకు గెలుపు అందించిన ప్రశాంత్ కిషోర్ పాచికలు.. స్వరాష్ట్రంలో పారలేదు.

    Prashant kishor | సొంత రాష్ట్రంలో పారని పాచికలు

    ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తన సొంత రాష్ట్రంలో రివర్స్ అయ్యాయి. రాష్ట్రంలో వలసలు తగ్గించి, నిరుద్యోగం లేకుండా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అభివృద్ధిలో వెనకబడిపోయిన రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అయినా కూడా బీహారీలు ఆయన వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన ప్రయోగించే అస్త్రాలైన సమాచార ఆధారిత ప్రచారం, సోషల్ మీడియా, బూత్ స్థాయి నిర్వహణ ఇవేవీ పనిచేయలేదు. ఎన్నికలకు రెండు, మూడేళ్ల నుంచే సన్నద్ధం అయినా ఓటర్లలో నమ్మకం కల్పించడంలో విఫలమయ్యారు.

    ఇది కూడా చదవండి..: Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

  • Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి.

    Delhi Car Blast |సాయంత్రం సమయంలో..

    పేలుడు సాయంత్రం 6:55 గంటల సమయంలో అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేశాయి. పేలుడు ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ఈ-రిక్షాలు, ఆటోరిక్షాలు కాలి బూడిదయ్యాయి. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి.

    కాగా.. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్, క్లూస్ టీంలతో పాటు ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం కావడంతో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటాయి. దీంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సింఘు, టిక్రీ, బదర్‌పూర్ వంటి కీలక పాయింట్లలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఇతర సున్నిత ప్రదేశాల్లో నిఘా పెంచారు.

    Delhi Car Blast |ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కేంద్ర హొం మంత్రి అమిత్​ షా చేరుకున్నారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

    Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai