Penci Sport plugin only working with the Soledad theme.

జాతీయం - Telugu News Today

Category: జాతీయం

  • Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..

    Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్​న్యూస్​ చెప్పింది. రెగ్యులర్​ రైళ్ల బుకింగ్స్​ ఫుల్​ కావడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్​ ట్రెయిన్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ, నాందేడ్​, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి.

    Sabarimala special Trains | కొనసాగుతున్న బుకింగ్స్​

    ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లకు దక్షిణ మధ్య రైల్వే శనివారం నుంచి అవకాశం కల్పించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 20 వరకు రాకపోకలు సాగించనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కేరళలోని కొల్లాం, కొట్టాయం వైపు మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్ నుంచి ట్రైన్ అందుబాటులో ఉండనుంది.

    Sabarimala special Trains | చర్లపల్లి – కొల్లాం స్పెషల్​ రైలు (ట్రైన్ నెంబర్ 07113/07114)

    చర్లపల్లి – కొల్లాం (07113) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 13వ తేదీ వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి స్టేషన్‌ నుంచి వెళ్లనుంది. కొల్లాం – చర్లపల్లి (07114) ట్రైన్​ నవంబర్ 20 నుంచి జనవరి 15 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఈ రైలు సేవలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల భక్తులకు ఉపయోగకరం కానున్నాయి.

    Sabarimala special Trains | కాకినాడ టౌన్ – కొట్టాయం రైలు ( ట్రైన్ నంబర్ 07109/07110)

    సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలో కాకినాడ టౌన్ – కొట్టాయం (07109) ట్రైన్​ నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 19 వరకు ప్రతి సోమవారం నడవనుంది. అలాగే కొట్టాయం – కాకినాడ టౌన్ (07110) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 20 వరకు ప్రతి మంగళవారం తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.

    Sabarimala special Trains | నాందేడ్ – కొల్లాం రైలు ( ట్రైన్ నంబర్ 07111/07112)

    భక్తుల రద్దీ దృష్ట్యా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కూడా స్పెషల్​ ట్రైన్​ను ప్రకటించారు. హజర్​ సాహెబ్​ నాందేడ్‌ – కొల్లాం (07111), కొల్లాం-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (07112) మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఈ రైళ్లు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంత భక్తులకు సౌకర్యంగా మారనున్నాయి.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్​ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం గేయం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరిస్తారు. స్మారక తపాలా బిల్ల, స్మారక నాణేలను కూడా విడుదల చేయనున్నారు.

    Vande Mataram 150 years celebrations

    Vande Mataram 150 years celebrations | దేశ వ్యాప్తంగా వేడుకలు

    వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.50 గంటలకు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా ‘వందేమాతరం’ గేయాలాపన జరగనుంది. అలాగే స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న ప్రతిజ్ఞ చేయనున్నారు.

    Vande Mataram 150 years celebrations | 150 ఏళ్ల మహోన్నత చరిత్ర..

    వందేమాతరం గేయానికి మహోన్నత చరిత్ర ఉంది. దీనిని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా రచించినట్లు చెబుతారు. ఆయన రచించిన నవల ‘ఆనందమఠ్’లో తొలుత ఈ గేయం కనిపించింది. ఈ నవల అప్పట్లో ‘బంగదర్శన్’ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. అనంతరం 1882లో ప్రత్యేక పుస్తకంగా వెలువడింది. ఈ గేయం నాడు ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్పూర్తి నింపింది. అంతేకాకుండా జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటించారు. దీనికి జాతీయ గీతం జనగణమనతో సమాన గౌరవం ఇచ్చారు.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.

    డీజీసీఏ ప్రతిపాదించిన ప్రకారం.. ఇక నుంచి మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. కాగా.. ఇప్పటి వరకు విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, లేదంటే మార్పు కోసం భారీగా ఛార్జీలను వసూలు చేసేవి. తాజాగా.. DGCA తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యకు చెక్​పడనుంది.

    డీజీసీఏ ప్రతిపాదనలు అమలులోకి వస్తే.. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు క్యాన్సిల్​ చేసుకోవడం లేదంటే తేదీ మార్చుకోవడం ఈజీగా మారనుంది. ఈ సమయంలో కాన్సిలేషన్​ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి. అయితే కొత్త టికెట్ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే.. ప్రయాణికుడు ధర తేడాను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అనేది డొమెస్టిక్​ విమాన టిక్కెట్లకు ఐదు రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తిస్తుంది. ఇక ఇంటర్నేషనల్​ టిక్కెట్లకు 15 రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తించనుంది. బుకింగ్ చేసిన వెంటనే మార్పు అవసరం వచ్చినా.. ఇకపై ఎయిర్‌లైన్స్​ అదనపు ఛార్జీలు వసూలు చేయబోవు.

    Flight Ticket Cancellation

    Flight Ticket Cancellation | రీఫండ్​ బాధ్యత ఎయిర్​లైన్స్​దే..

    డీజీసీఏ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. టిక్కెట్లను ఏజెంట్, ట్రావెల్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినా.. రీఫండ్ బాధ్యత అనేది ఎయిర్‌లైన్‌దేనని స్పష్టం చేసింది. ఏజెంట్లను ఎయిర్‌లైన్స్​ అధికార ప్రతినిధులుగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతో ఇకపై టికెట్ రద్దు చేసిన తర్వాత రీఫండ్ ఆలస్యం అయినా.. అందకపోయినా ప్రయాణికుడు ఎయిర్‌లైన్‌ను నేరుగా సంప్రదించవచ్చు.

    కాగా.. ఇటీవల కాలంలో టికెట్ రద్దు ఛార్జీలు, రీఫండ్‌లు, ఏజెంట్ సమస్యలు వంటి అంశాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో DGCA ఈ చర్య తీసుకుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే.. భారతదేశంలో విమాన ప్రయాణం ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారనుంది.

    ఇది కూడా చదవండి : Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..

    Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్​ రిలీఫ్​ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్​ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. కేవైవీ (Know Your Vehicle) ప్రక్రియ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలను వెంటనే నిలిపివేయబోరు. ఈ పక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులకు సమయం ఇవ్వనున్నారు. ఫాస్టాగ్ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    Fastag kyv Process |కేవైవీ పూర్తి చేయకపోతే..

    కేవైవీ ప్రక్రియ కంప్లీట్​ చేయని వాహనదారుల ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుందని కేంద్రం ఇదివరకు చెప్పింది. దీంతో వారు టోల్‌ ఫీజులను క్యాష్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా.. తాజాగా ప్రక్రియను సరళీకృతం చేయడం ద్వారా కేవైవీ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఊరట లభించింది.

    కేవైవీ నిబంధనల ప్రకారం.. కార్లు, జీపులు, వ్యాన్ల సైడ్ ఫొటోలు ఇకపై అవసరం ఉండదు. నంబర్ ప్లేట్, FASTag కనిపిస్తున్న ముందు చిత్రాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి. వాహనదారులు వెహికిల్, ఛాసిస్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసినప్పుడు ‘వాహన్’ పోర్టల్ నుంచి ఆర్​సీ వివరాలు ఆటోమేటిక్‌గా పొందుతారు. ఒకే మొబైల్ నంబర్‌కు మీద ఎక్కువ వాహనాలు రిజస్టర్ అయి ఉన్నట్లయితే వినియోగదారులు ఏ వాహనాన్ని కేవైవీ పూర్తి చేయాలని భావిస్తే దానిని సెలెక్ట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

    Fastag kyv Process | ఏదైనా సమస్య వస్తే..

    కేవైవీ ప్రక్రియలో భాగంగా ఏవైనా సర్టిఫికెట్లు అప్​లోడ్​ చేయడంలో ఇబ్బందులు తలెత్తితే ఫస్టాగ్ జారీచేసే బ్యాంక్ కస్టమర్‌ను సంప్రదించాలి. వెంటనే డిస్‌కనెక్ట్ చేయకుండా కేవైవీ విధానం పూర్తి చేయడంలో సహాయం చేయాలి. వినియోగదారులు 1033లో నేషనల్ హైవే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే బ్యాంకును సంప్రదించవచ్చు.

    Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • The Family Man-3 | ఫ్యామిలీ మ్యాన్-3 వచేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్​ కానుందంటే..

    The Family Man-3 | ఫ్యామిలీ మ్యాన్-3 వచేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్​ కానుందంటే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్: The Family Man-3 | ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన వెబ్​సిరీస్​ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. క్లాసిక్‌ స్పై యాక్షన్ సిరీస్‌గా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో చాలా మంది సిరీస్‌లు చూడడం ప్రారంభించింది ‘ది ఫ్యామిలీ మ్యాన్​’తోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సిరీస్​. తాజాగా ఈ సిరీస్​కు సంబంధించి కీలక అప్​డేట్​ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్-3కి సంబంధించి రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ చేసింది రాజ్​ డీకే టీం.
    మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే. తొలి సీజన్​ సూపర్​ హిట్​గా నిలించింది. అనంతరం రెండో సీజన్ రిలీజ్ చేయగా ఇంకా పెద్ద హిట్ అయింది. ఈ పార్ట్‌లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సెకండ్​ సీజన్ ఎండింగ్​లో థర్డ్​ సీజన్ గురించి హింట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇతర కమిట్మెంట్స్​ వల్ల రాజ్-డీకే టీం థర్డ్​ సీజన్​కు కొంచెం గ్యాప్​ తీసుకున్నారు. గతేడాది షూట్​ను పట్టాలెక్కించి ఇటీవలే పూర్తి చేశారు. ఎట్టకేలకు మూడో సిరీస్​ డేట్​ ఫిక్స్​ చేశారు.

    The Family Man-3 | స్ట్రీమింగ్​ ఎప్పటి నుంచంటే..

    ‘ఫ్యామిలీ మ్యాన్-3’ని అమెజాన్ ప్రైమ్​లో నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్​ చేయబోతున్నట్లు యూనిట్​ అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్‌ వివరాలను పంచుకుంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘టాస్క్’ సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్‌పేయి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సీజన్‌లో యాక్షన్, థ్రిల్, సస్పెన్స్​, ఎమోషన్ కలిపి ఒక పీక్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా అందించనున్నట్లు తెలుస్తోంది.

    The Family Man-3 | సిరీస్​లో నటీనటులు వీరే..

    శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) ప్రధాన పాత్రతో పాటు, తల్పాడే (షరీబ్‌ హష్మి), సుచిత్ర తివారీ (ప్రియమణి) ఉన్నారు. ధృతి తివారీ (ఆశ్లేష ఠాకూర్‌), అరవింద్‌ (శరద్‌ ఖేల్కర్‌) మేజర్‌ విక్రమ్‌ (సందీప్‌ కిషన్‌) పాత్రలు మరోసారి తెరపై కనిపించనున్నాయి. ఇక తాజా సీజన్‌లో మరికొంత మంది కీలక పాత్రల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది.

    ఈ ఆర్టికల్​ కూడా చదవండి..: Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • IRCTC Package |ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. సౌత్ ఇండియాలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు 10 రోజుల్లో చుట్టేయవచ్చు..

    IRCTC Package |ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. సౌత్ ఇండియాలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు 10 రోజుల్లో చుట్టేయవచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: IRCTC Package |ప్రయాణికుల సౌకర్యార్థ్యం ఇండియన్ రైల్వే కేటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) ప్రత్యేక టూర్​ ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో ప్యాకేజీని అందుబాటులో తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా 10 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు ఆధ్యాతిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. శ్రీ రామేశ్వరం – తిరుపతి దక్షిణ యాత్ర పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్​ కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించింది. దీని ద్వారా సౌత్​ ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. తిరుపతి నుంచి రామనాథస్వామి ఆలయం వరకు సందర్శించవచ్చు.

    IRCTC Package |టూర్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే..!

    ఈ టూర్​ మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు ఉండనుంది. ఈ టూర్​ ప్యాకేజీ నవంబర్‌ నెలలో ఉంటుంది. నవంబర్ 7 – నవంబర్ 16 యాత్ర సాగనుంది.

    IRCTC Package |దర్శించుకునే ప్రాంతాలివే..

    నవంబర్ 7న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉంటుంది. అనంతరం పద్మావతి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత రామేశ్వరంలో రంగనాథ స్వామి ఆలయం, ధనుష్కోడిలోని కోదండ రామాలయం దర్శనం కల్పిస్తారు. అనంతరం మధురై చేరుకున్న తర్వాత మీనాక్షి అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి దేవాలయం, గాంధీ మండపం సందర్శిస్తారు. ఇక చివరగా తిరువనంతపురం చేరుకుని అక్కడ పద్మనాభ స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే కోవాలమ్ బీచ్​ను చూడవచ్చు.

    IRCTC | ప్యాకేజీ వివరాలివే..
    పెద్దలు: రూ. 18,040 (స్లీపర్ క్లాస్), రూ. 30,370 (3 AC), రూ. 40,240 (2 AC) ఉంటుంది.
    పిల్లలు (5–11 సంవత్సరాలు) : రూ. 16,890 (స్లీపర్), రూ. 29,010 (3 AC), రూ. 38,610 (2 AC) ఉంటుంది.

    IRCTC | బస, భోజనం వివరాలివే..
    ప్రయాణికులు బడ్జెట్ హోటల్స్, ఏసీ-నాన్ ఏసీ రూంలలో ఉండవచ్చు. కేవలం శాఖాహార భోజనం మాత్రమే అందిస్తారు.

    Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై బుకింగ్ అయిన టికెట్ తేదీలనూ మార్చుకోవచ్చు..

    Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై బుకింగ్ అయిన టికెట్ తేదీలనూ మార్చుకోవచ్చు..

    తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Railway tickets | రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. మీరు బుకింగ్ చేసుకున్న టికెట్ తేదీలనూ మార్చుకునే వెసులుబాటును కల్పించనుంది.

    Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

    రైల్వే ప్రయాణికులు ఇప్పటి వరకు జర్నీ కోసం ముందస్తు రిజర్వేషన్ బుక్ చేసుకుంటే.. అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే టికెట్ కాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత మళ్లీ మరో తేదీన బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను గుర్తించిన రైల్వే శాఖ ఈ విధానానికి స్వస్తి పలకనుంది. ఇకపై కన్ఫామ్డ్ ట్రెయిన్ టిక్కెట్ల ప్రయాణ తేదీని ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకునే అవకాశం కల్పించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే జనవరి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
    Railway tickets | ప్రస్తుత నిబంధనలు..

    ప్రస్తుతం ముందస్తుగా బుక్ చేసుకున్న రైల్వే టిక్కెట్లకు సంబంధించిన జర్నీ డేట్ను మార్చుకోవడానికి అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణాన్ని కాన్సిల్ చేసుకోవాల్సి వస్తే టికెట్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఛార్జీలను ప్రయాణ తేదీ, టికెట్ కాన్సిల్ చేసుకునే సమయం ఆధారంగా భరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం డబ్బులను కట్ చేసుకున్న తర్వాతే మిగతా అమౌంట్ను రీఫండ్ అవుతుంది.
    Railway tickets | ఏం మార్చారంటే..
    ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రయాణికుల ప్రయోజనాలు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అందుకే వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానాన్ని అమలుఓకి తేనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానంలో కన్ఫామ్డ్ టికెట్ల తేదీలను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే మార్చుకోవచ్చునని తెలిపారు. ప్రయాణిలు జర్నీ తేదీని మార్చుకునే సౌకర్యం కల్పించనున్నామని వివరించారు.