తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Saudi Arabia Bus Crash | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Saudi Arabia Bus Crash) జరిగింది. ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాగా.. మృతులు హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
Saudi Arabia Bus Crash | మక్కాకు వెళ్తుండగా..
ఉమ్రా యాత్రికులు మక్కా మసీదు అల్హరామ్లో ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. సౌదీ అధికారులు రక్షణ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు బాధితులను రక్షించేందుకు, మృత దేహాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరణాల సంఖ్య ఇంకా ధ్రువీకరణ కాలేదు. కానీ.. స్థానిక మీడియా ప్రకారం 42 మంది మరణించినట్లు వార్తలు రాస్తున్నాయి. గాయపడినవారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చారని అధికారులు తెలిపారు.
Saudi Arabia Bus Crash | రంగంలో ఇండియన్ ఎంబసీ
రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఇండియన్ ఎంబసీ వెంటనే దీనిపై దృష్టి పెట్టింది. హజ్ కమిటీతో పాటు భారతీయ ఎంబసీ.. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాయి. మృత దేహాలను భారత దేశానికి తీసుకురావడానికి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

1 comment
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://www.binance.info/ru-UA/register?ref=JVDCDCK4