Penci Sport plugin only working with the Soledad theme.

అంతర్జాతీయం - Telugu News Today

Category: అంతర్జాతీయం

  • F1 Visa | అమెరికా F-1 విద్యార్థి వీసా నిబంధనల్లో భారీ మార్పునకు బిల్లు.. భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్..!

    F1 Visa | అమెరికా F-1 విద్యార్థి వీసా నిబంధనల్లో భారీ మార్పునకు బిల్లు.. భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: F1 Visa | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ఆశపడే లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అమెరికా నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించడంలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్న ‘తిరిగి స్వదేశానికి వెళ్లే ఉద్దేశం’ (Intent to Depart) నియమాన్ని పూర్తిగా తొలగించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టారు.

    F1 Visa | ‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో..

    ‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో ఈ చట్ట ప్రతిపాదనను రూపొందించిన శాసనసభ్యులు, చదువు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవాల్సి అవసరం లేదనే విధానాన్ని మార్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూలో కాన్సులర్ అధికారులు “చదువు అయిపోతే వెంటనే దేశం విడిచి వెళ్తారా?” అని ప్రశ్నిస్తున్నారు.. దానికి బలమైన ఆధారాలు లేకపోతే వీసాను నిరాకరిస్తున్నారు. సొంత దేశంలో ఆస్తులు, ఉద్యోగ ఆఫర్లు, కుటుంబ బంధాలు వంటి పత్రాలతో ఈ ఉద్దేశ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్లే గత కొంతకాలంగా, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల ఎఫ్-1 వీసాల తిరస్కార రేటు గణనీయంగా పెరిగింది.

    F1 Visa

    F1 Visa | కొత్త చట్టం అమలయితే..

    కొత్త చట్టం అమలయితే ఇకపై ‘చదువు అయిపోయాక తిరిగి స్వదేశానికి వెళ్తారా..’ ప్రశ్నే రాదు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగ అవకాశాలను వెతకడం, ఆప్ట్ (OPT) లేదా ఇతర వీసా రూట్ల ద్వారా దీర్ఘకాలికంగా ఉండే మార్గం సులువుగా మారనుంది. దీని ఫలితంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని ట్రంప్ పరిపాలన విభాగం భావిస్తోంది.

    F1 Visa | ప్రస్తుతం బిల్లు దశలోనే…

    ప్రస్తుతం ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. కాంగ్రెస్ రెండు సభల్లోనూ ఆమోదం లభించి, అధ్యక్షుడు సంతకం చేస్తేనే ఇది అధికారికంగా అమలులోకి వస్తుంది. అదే సమయంలో, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కూడా ఎఫ్-1 వీసాలకు సంబంధించి ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నుంచి ‘నిర్ణీత కాలపరిమితి’ వ్యవస్థకు మారే ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.

    ఈ రెండు మార్పులూ అమలులోకి వచ్చినట్లయితే అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు చాలా పెద్ద ఊరటగా మారనుంది. రానున్న నెలల్లో ఈ బిల్లు ఏ స్థాయిలో పురోగమిస్తుందని లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇది కూడా చదవండి..: F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: F-35 fighter jets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో సైనికంగా కీలక పరిణామాలు జరుగనున్నాయి. కాగా.. MBS ఏడేళ్ల తర్వాత అమెరికా రాజధాని సందర్శించడం గమనార్హం.

    ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా మా గొప్ప మిత్రదేశం. వాళ్లు F-35 జెట్లు కొనాలని కోరుకుంటున్నారు.. మేం కచ్చితంగా అమ్ముతాం” అని స్పష్టం చేశారు. సౌదీ ఇప్పటికే 48 వరకు F-35 జెట్ల కోసం అభ్యర్థన పెట్టింది. ఇది బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంగా మారనుందని తెలిపారు.

    f-35 fighter jets

    F-35 fighter jets | ఈ ఒప్పందంపై ఆందోళన

    అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లోని కొందరు అధికారులు ఈ అమ్మకానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సౌదీ – చైనా సన్నిహిత సంబంధాలు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది చైనా సౌదీకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. రెండు దేశాలు సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. F-35లోని అత్యంత రహస్య సాంకేతికత చైనా చేతికి చిక్కే ప్రమాదం ఉందని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే కారణంతో గతంలో UAEకి F-35 అమ్మకం కూడా ఆలస్యమైంది.

    F-35 fighter jets | మరో కీలక అంశం ఏమిటంటే..

    ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం (Qualitative Military Edge). అమెరికా చట్టం ప్రకారం ఇజ్రాయెల్‌కు మధ్యప్రాచ్యంలో ఎవరికీ లభించని సైనిక ప్రాధాన్యత ఉండాలి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో F-35లు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే.

    F-35 fighter jets | అబ్రహం ఒడంబడిక విస్తరణపై ట్రంప్ ఆశలు

    ట్రంప్ తన మొదటి టర్మ్‌లో సాధించిన అబ్రహం ఒడంబడికను (Abraham Accords) విస్తరించాలని భావిస్తున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ ద్వారా మధ్యప్రాచ్య శాంతిని సాధించవచ్చని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. “సౌదీ త్వరలోనే అబ్రహం ఒడంబడికలో చేరుతుందని ఆశిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు.

    Source : Indiatvnews.com

    ఇది కూడా చదవండి..: Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Saudi Arabia Bus Crash | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Saudi Arabia Bus Crash) జరిగింది. ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాగా.. మృతులు హైదరాబాద్‌ వాసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

    Saudi Arabia Bus Crash | మక్కాకు వెళ్తుండగా..

    ఉమ్రా యాత్రికులు మక్కా మసీదు అల్‌హరామ్‌లో ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. సౌదీ అధికారులు రక్షణ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు బాధితులను రక్షించేందుకు, మృత దేహాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరణాల సంఖ్య ఇంకా ధ్రువీకరణ కాలేదు. కానీ.. స్థానిక మీడియా ప్రకారం 42 మంది మరణించినట్లు వార్తలు రాస్తున్నాయి. గాయపడినవారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చారని అధికారులు తెలిపారు.

    Saudi Arabia Bus Crash | రంగంలో ఇండియన్​ ఎంబసీ

    రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఇండియన్​ ఎంబసీ వెంటనే దీనిపై దృష్టి పెట్టింది. హజ్​ కమిటీతో పాటు భారతీయ ఎంబసీ.. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాయి. మృత దేహాలను భారత దేశానికి తీసుకురావడానికి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Beaver Supermoon 2025 | ‘నింగికి జాబిలీ అందం.. నేలకు తొలకరి అందం’ అని జాబిలి అందాన్ని వర్ణించాడో కవి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ ఒకప్పుడు అమ్మ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేంది. ఇదంతా ఇప్పడెందుకు అనుకుంటున్నారా.. చందమామ మన గ్రహానికి దగ్గరగా రానున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

    ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని చెబుతున్నారు. దీంతో చందమామ మరింత పెద్దగా, కాంతివంతంగా కనిపించనుందంటున్నారు. అయితే దీనిని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని పేర్కొంటున్నారు. కాగా.. గత డిసెంబర్‌లో సైతం ఒక కోల్డ్ మూన్ కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఫిబ్రవరి 2019 తర్వాత అత్యంత దగ్గరగా వచ్చే పౌర్ణమి కానుందని చెబుతున్నారు.

    Beaver Supermoon 2025

    Beaver Supermoon 2025 | మూడు సూపర్​ మూన్​లలో ఒకటి

    బీవర్ మూన్ 2025లో వచ్చే మూడు సూపర్‌మూన్‌లలో ఇదీ ఒకటి. ఈ ఏడాది వచ్చిన మూడింటిలో ఇది రెండవది. అక్టోబర్‌లో వచ్చిన హార్వెస్ట్ మూన్ తర్వాత.. డిసెంబర్‌లో వచ్చే కోల్డ్ మూన్ కూడా సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తాయి. చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో సూపర్‌మూన్ అనేది సంభవిస్తుంది. అందుకే ఇది కొన్నిసార్లు పౌర్ణమి టైంలో భూమికి దగ్గరగా ఉన్న బిందువుకు చేరుకుంటుంది. నాసా ప్రకారం.. పౌర్ణమి సమయంలో 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

    ఇది కూడా చదవండి.. : Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్’​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

    US Nuclear Testing | ట్రంప్​ ఏమన్నారంటే..

    “ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు అమెరికా వద్దనే ఉన్నాయి. నా తొలి పదవీ కాలంలో దీనిని సాధించాం. అయితే ఈ ఆయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి వల్ల అప్పట్లో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఇందులో రష్యా రెండో స్థానంలో ఉండగా.. చైనా మూడో స్థానంలో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ మూడు దేశాలు సమాన స్థాయికి చేరే ఛాన్స్​ ఉంది. అందుకే మన దేశం తిరిగి అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్​కు ఆదేశాలు జారీ చేశా. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది” అని ట్రంప్‌ తెలిపారు.

    US Nuclear Testing తో ట్రంప్ తాజా​ వ్యాఖ్యలతో అమెరికా–రష్యా–చైనాల మధ్య అణు ఆయుధ పోటీ కొత్త దశకు చేరనున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రష్యా తన అణు సామర్థ్యాలను పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల రష్యా పరీక్షించిన పోసిడాన్ అణు డ్రోన్‌ సబ్‌మెర్సిబుల్‌ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించారు. అదే సమయంలో చైనా కూడా తన అణ్వాయుధాలను విస్తరించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ట్రంప్​ దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే.. ట్రంప్‌ ప్రకటించిన ఈ నిర్ణయంపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది.

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

    Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు ఇజ్రాయిల్​ అత్యున్నత పురస్కారం అందజేయనుంది. గాజా ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. గాజా ఒప్పందం.. బందీల విడుదలకు కృషి చేసినందుకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ (Presidential Medal of Honor)ను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ తెలిపారు. త్వరలో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు ప్రకటింటించారు. డొనాల్డ్​ ట్రంపు ఈ గౌరవాన్ని అందుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత కోసం కృషి తాము ఈ విధంగా గౌరవిస్తున్నట్లు తెలిపారు.

    Donald Trump | గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్​

    ఇజ్రాయిల్ – హ‌మాస్ మ‌ధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం ముగిసింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్ర‌క‌టించారు. గాజా శాంతి ఒప్పందం (Gaza Peace Agreement) కోసం పశ్చిమాసియాకు బయలుదేరిన వేళ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇజ్రాయిల్‌కు వెళ్లే మార్గంలో ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్ప‌టికే అనేక యుద్ధాల‌ను ఆపాన‌ని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను కూడా నిలువ‌రిస్తానంటూ చెప్పుకొచ్చారు.

    Donald Trump | నోబెల్ బహుమతిపై కీలక వ్యాఖ్యలు

    అనేక దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నిలువ‌రించాన‌ని ట్రంప్‌ మ‌రోసారి చెప్పారు. యుద్ధాలు ఆపాడంలో తాను స్పెషలిస్టున‌ని వ్యాఖ్యానించారు. అయినా తనకు నోబెల్ బ‌హుమ‌తి ఎందుకు రాలేదో తెలియ‌ద‌ని పేర్కొన్నారు. అయినా కూడా తమ శాంతి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజా శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతూ.. అన్ని పార్టీలను సంతోషపెట్టామని తెలిపారు. ఈజిప్టును సందర్శించి, మధ్యప్రాచ్య పరిస్థితిపై సైతం చర్చించడానికి ప్రాంతీయ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. ‘మేం అందరినీ సంతోషపెట్టబోతున్నాం.. యూదులు అయినా, ముస్లింలు అయినా, అరబ్ దేశాలైనా..’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ తర్వాత ఈజిప్టు దేశానికి వెళ్తున్నా. శక్తివంతమైన, పెద్ద దేశాలు, ధనిక దేశాలు, నాయకును కలవబోతున్నా వారందరూ ఈ ఒప్పందంలో ఉన్నారు” అని పేర్కొన్నారు.

    Donald Trump | రష్యా రాజీకి రాకపోతే వాటిని రంగంలోకి దించుతాం

    ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై కూడా ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేవారు. ఈ యుద్ధం పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మాస్కో రాజీకి రాకపోతే.. కీవ్‌కు తోమహాక్‌ క్షిపణులను అందజేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఆదివారం ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీతో ట్రంప్‌ మాట్లాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Most expensive coffee | ఈ కాఫీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. గిన్నెస్ రికార్డు సాధించిన అత్యంత ఖరీదైన రోస్టర్స్​ కాఫీ..

    Most expensive coffee | ఈ కాఫీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. గిన్నెస్ రికార్డు సాధించిన అత్యంత ఖరీదైన రోస్టర్స్​ కాఫీ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Most expensive coffee | సాధారణంగా మనం తాగే కాఫీ 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. ఇంకా పెద్ద కెఫేలకు వెళ్తే.. సుమారు రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఈ కాఫీ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెతారు. దీని రేటు అక్షరాలా రూ. 60 వేలు. ధర చూసి ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ మీరు చదివేది నిజమే. దుబాయ్​లోని రోస్టర్స్​ స్పెషాలిటీ కాఫీ హౌస్​ ఈ కాఫీతో గిన్నిస్​ వరల్డ్​ రికార్డు సైతం సాధించింది.

    Most expensive coffee | ఒక కప్పు ధర రూ.2500 దిర్హమ్స్​

    దుబాయ్ ‘రోస్టర్స్ స్పెషాల్టీ కాఫీ హౌస్’లో (Roasters Specialty Coffee House) లభించే ఈ కాఫీ అత్యంత ఖరీదైనదిగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Records) చోటు సాధించింది. ఒక్క కప్ ధర ఏకంగా 2,500 దిర్హామ్స్​ అంటే 680 యూఎస్​ డాలర్లు. ఇక మన కరెన్సీలో రూ. 60వేలకు పైమాటే. ఎందుకింత రేటు అనుకుంటున్నారు. ఈ కాఫీలో వాడే బీన్స్​ ధర కిలోకు రూ. లక్షల్లో ఉంటుంది.

    Most expensive coffee | దుబాయ్ కాఫీ కల్చర్‌కు కొత్త ఒరవడి

    రోస్టర్స్ స్పెషాల్టీ కాఫీ హౌస్ యూఏఈలో 15 ఔట్‌లెట్లను నడుపుతోంది. అంతేకాకుండా దుబాయ్‌లో నాలుగు బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఈ రికార్డు దుబాయ్‌లోని స్పెషాలిటీ కాఫీ సంస్కృతికి కొత్త ఒరవడి తెచ్చిన్లయ్యింది.

    Most expensive coffee | ఈ కాఫీ ఎందుకు ప్రత్యేకమంటే..

    ఈ కప్ కాఫీ కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. ఇది ఒక లగ్జరీ అనుభూతి.. గెయిషా బీన్స్‌ను V60 టెక్నిక్‌తో బ్రూయింగ్ చేస్తారు. ఎడో కిరికో గ్లాస్‌లో సర్వ్ చేస్తారు. దీని తయారీలో ప్రతి దశలో శ్రద్ధ వహిస్తారు.

    Most expensive coffee | మీకూ టేస్ట్​ చేయాలనుందా..!

    గిన్నిస్​ రికార్డును సాధించిన ఈ కాఫీని మీరు టేస్ట్​ చేయాలనుకునే దుబాయ్‌లోని రోస్టర్స్ ఔట్‌లెట్‌లకు సందర్శించాల్సిందే.. ‘ఈ కప్పు కాఫీతో పెద్ద దావత్​ చేసుకోవచ్చు.. ఇంత లగ్జరీ మనకెందుకులే బాసు’ అనుకుంటున్నారా.. అయితే మన దగ్గర మాంచీ టేస్ట్​తో పాటు మన బడ్జెట్​లో దొరికే కేఫ్​లున్నాయి.. అక్కడికి వెళ్లి తాగేద్దాం పదండి..

  • Crypto Market | ఎంత పనిచేవయ్యా​ ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్​ క్రాష్​ చేశావ్​గా..!

    Crypto Market | ఎంత పనిచేవయ్యా​ ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్​ క్రాష్​ చేశావ్​గా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Crypto Market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన క్రిప్టో కరెన్సీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. చైనాపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తానంటూ ఆయన ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ భారీగా క్రాష్ అయింది. బ్లూమ్‌బెర్గ్ (Bloom berg) నివేదిక ప్రకారం.. క్రిప్టో ట్రేడర్లు రూ.68 లక్షల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాయిన్​ గ్లాస్​ డేటా ఆధారంగా.. కేవలం గత 24 గంటల్లో 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్ అయినట్లు నివేదిక తెలిపింది. అనగా.. వారి ఇన్వెస్ట్​మెంట్లు ఆటోమేటిక్‌గా అమ్ముడైపోవడంతో నష్టపోయారు. అతిపెద్ద క్రిప్టో మార్కెట్​ క్రాష్​లలో ఇదీ ఒకటిగా మారింది.

    Crypto Market | బిట్‌కాయిన్, ఈథర్ నేల చూపులు

    క్రిప్టో మార్కెట్​లోని దాదాపు అన్ని కరెన్సీలు పడిపోయాయి. బిట్‌కాయిన్ (Bit coin) రూ.1,22,000 నుంచి రూ.1,07,000కు పడిపోయింది. ఇథేరియం (ethereum) రూ.3,700 కంటే దిగువకు వచ్చిఒంది. ఎక్స్​ఆర్​పీ (XRP), సొలన (Solana), డిజీ కాయిన్​ (Dogecoin) 20-30 శాతం వరకు క్షీణించాయి.

    Crypto Market | ట్రంప్​ ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు..

    చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు క్రిప్టో మార్కెట్​ కుంగేలా చేశాయి. అలాగే 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్​ అయ్యాయి. ఇది కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. బిట్​ కాయిన్​ సైతం ఆల్​ టైం హైకి చేరుకోవడం వలన ప్రాఫిట్​ బుకింగ్​ చేసుకోవడం కూడా క్రిప్టో క్రాష్​కు కారణమైంది.

  • Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

    Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Trump tariffs on china | రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన డిసిషన్​ తీసుకున్నారు. ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై వంద శాతం టారిఫ్​లు (Trump tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు తన సోషల్​ మీడియా వేదిక ట్రూత్​లో పోస్టు చేశారు. ఇది ప్రస్తుత్తం విధిస్తున్న టారిఫ్​లకు అదనం.

    అంతేకాకుండా అమెరికాలో తయారైన కీలకమైన సాఫ్ట్​వేర్​లపై కఠినమైన ఎగుమతి నియంత్రణ అమలు చేస్తామంటూ పేర్కొన్నారు. ట్రంపు తాజా నిర్ణయంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరీ తీవ్రంగా మారే అవకాశం నెలకొంది.

    Trump tariffs on china | అందుకేనా ఈ నిర్ణయం..

    చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో (International trade) అసాధారణంగా దూసుకొస్తుందంటూ ట్రంప్​ పేర్కొన్నారు. “చైనా వాణిజ్యంలో అసాధారణంగా దూకుడుతో పాటు ప్రపంచానికి శత్రుత్వపూరితమైన లేఖ రాసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు వారు తయారు చేయని వాటిపై కూడా నవంబర్ నుంచి భారీగా ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ విధిస్తున్నారు. దీనికి ప్రతిస్పందంగానే అమెరికా ఆ దేశంపై 100 శాతం టారిఫ్ విధిస్తుంది. ఇవి ప్రస్తుతం అమలవుతున్న టారిఫ్‌లకు అదనం. అంతేకాకుండా అన్ని క్రిటికల్ సాఫ్ట్‌వేర్స్​పై ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ అమలు చేస్తాం.” అంటూ రాసుకొచ్చారు. చైనా తన రేర్​ ఎర్త్​ మినరల్స్​పై ఎగుమతి నియంత్రణలను పెంచడం సైతం ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైందని తెలుస్తోంది. తాజా టారిఫ్​లతో ఎలక్ట్రానిక్స్​ నుంచి ఎలక్ట్రిక్​ వాహనాల దాకా చాలా రంగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

    Trump tariffs on china | రేర్ ఎర్త్ మినరల్స్‌పై చైనా ఆంక్షలు

    చైనాలో లభించే రేర్​ ఎర్త్ మినరల్స్​ (), కీలక ఖనిజాల ఎక్స్‌పోర్ట్‌లపై కొత్త నియంత్రణలు ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలో ఉత్పత్తి చేసిన లేదా చైనా టెక్నాలజీతో తయారు చేసిన 0.1 శాతం కన్నా ఎక్కువ రేర్ ఎర్త్‌ మినరల్స్​ ఉన్న ఉత్పత్తుల ఎగుమతి కోసం విదేశీ సంస్థలకు లైసెన్స్ తప్పనిసరి చేసింది. ప్రపంచంలో 70 శాతం రేర్ ఎర్త్‌ మినరల్స్​ చైనా నియంత్రణలోనే ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రాడార్ సిస్టమ్‌లు, జెట్ ఇంజన్‌ల తయారీలో కీలకం. వీటిపై నియంత్రణ విధించడంతో అమెరికా ఈ చర్యకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

    Trump tariffs on china | వాణిజ్య యుద్ధం..

    అమెరికా – చైనా (US – China) మధ్య కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోసారి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభింస్తుందనే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సగటు టారిఫ్ రేటు 40 శాతంగా ఉంది. ఈ అదనపు టారిఫ్‌తో మొత్తం 140 శాతానికి చేరవచ్చు.

    కాగా.. ఈ పరిణామంతో ట్రంప్, జిన్‌పింగ్‌ మధ్య ఈ నెల చివరలో దక్షిణ కొరియాలో జరిగే ఏపెక్ సమ్మిట్​కు ముందు జరిగే సమావేశం రద్దు కావొచ్చనే సూచనలు వెలువడుతున్నాయి.