Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 4 of 13

Author: Harsha Vardhan

  • Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్​ లింక్​ హోం ప్లాన్​.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!

    Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్​ లింక్​ హోం ప్లాన్​.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Starlink Home Plan India | ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ (Starlink).. భారత్‌లో తన ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘రెసిడెన్షియల్ హోమ్ ప్లాన్’ వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. సేవల ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరం చేస్తోంది.

    ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి వాణిజ్య స్థాయి అనుమతులు ఇంకా రాకపోయినా, స్టార్‌లింక్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి భద్రతా పరీక్షలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హోమ్ ప్లాన్ వివరాలను ప్రకటించడం ద్వారా, అనుమతులు లభించిన వెంటనే సేవలు అందుబాటులోకి తెచ్చే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

    Starlink Home Plan India | హోమ్ ప్లాన్ ముఖ్యాంశాలు

    • నెలవారి ఛార్జీ: రూ. 8,600 (పన్నులు అదనం కావచ్చు)
    • హార్డ్‌వేర్ విలువ: సుమారు రూ. 34,000ల డిష్, రూటర్, ఇతర పరికరాలు పూర్తిగా ఉచితం
    • ట్రయల్ సౌకర్యం: 30 రోజుల మనీ-బ్యాక్ గ్యారెంటీతో రిస్క్ ఫ్రీ ట్రయల్
    • డేటా పరిమితి: అపరిమిత డేటా (నో డేటా క్యాప్)
    • వాతావరణ నిరోధకత: ఏ వాతావరణ పరిస్థితుల్లోనూ స్థిరమైన పనితీరు
    • ప్రస్తుతం భారత్‌లో కేవలం రెసిడెన్షియల్ (హోమ్) ప్లాన్ వివరాలు మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. బిజినెస్ మరియు ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌ల వివరాలు తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

    Starlink Home Plan India | స్టార్‌లింక్​తో ఎయిర్​టెల్​, జియో చర్చలు

    గత కొన్ని నెలలుగా భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలతో స్టార్‌లింక్ చర్చలు జరుపుతోంది. రెండు టెలికాం దిగ్గజాలు స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ఆసక్తి చూపినప్పటికీ.. నిబంధనల కారణంగా అధికారిక ఒప్పందాలు ఇంకా ప్రకటించబడలేదు. అయితే తాజా పరిణామాలు అనుమతులు స్థిరీకరణ దిశగా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

    Starlink Home Plan India | స్టార్‌లింక్ ప్రత్యేకతలు

    సాధారణ ఫైబర్ లేదా కేబుల్ ఇంటర్నెట్‌కు భిన్నంగా, స్టార్‌లింక్ భూమికి దగ్గరలో (లో ఎర్త్ ఆర్బిట్) తిరుగుతున్న వేలాది చిన్న ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా సేవలు అందిస్తుంది. దీని వల్ల మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. తక్కువ లేటెన్సీ (జాప్యం తక్కువ) ఉంటుంది. వర్షం, మంచు, తుఫాను వంటి ప్రతికూల వాతావరణంలోనూ స్థిరమైన డేటా వస్తుంది. ప్రస్తుతం భూమి చుట్టూ 7,000కు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    Starlink Home Plan India | ఇంటర్నెట్ వేగం

    అంతర్జాతీయంగా 2024 చివరి త్రైమాసిక గణాంకాల ప్రకారం.. స్టార్‌లింక్ డౌన్‌లోడ్ వేగం సగటున 100 నుంచి 200 Mbps మధ్య ఉంటోంది. భారత్‌లో భౌగోళిక పరిస్థితులు, ఉపగ్రహ కవరేజ్ ఆధారంగా ఈ వేగం మారవచ్చు. అయితే పట్టణాలతో పోలిస్తే మారుమూల ప్రాంతాల్లో ఇది గణనీయమైన మెరుగుదలనిస్తుందనే అంచనా విశ్లేషకులది.

    భారత్‌లో డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కవరేజ్ పెంచడానికి స్టార్‌లింక్ వంటి శాటిలైట్ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. అనుమతులు లభించిన వెంటనే దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

    ఇది కూడా చదవండి..: Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Machine Guns | ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) తమ ఉత్పత్తులైన లైట్ మెషిన్ గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 40,000 ఎల్‌ఎంజీల తొలి బ్యాచ్ భారత్ చేరుకునే అవకాశం ఉందని సంస్థ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపారు. గతేడాది కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ సరఫరా జరగనుంది. కాగా ఇందుకు సంబంధించి అన్ని పరీక్షలు, నాణ్యతా తనిఖీలు పూర్తయ్యాయి. ఉత్పత్తి అనుమతులు కూడా లభించిన నేపథ్యంలో తొలి బ్యాచ్‌ను వచ్చే ఏటి మొదటి త్రైమాసికంలో అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

    Machine Guns | త్వరలోనే ఒప్పందం

    అదే సమయంలో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్‌ల కొనుగోలుకు సంబంధించిన మరో భారీ ఒప్పందం కూడా ఖరారు దశలో ఉంది. సుమారు 1.70 లక్షల కార్బైన్‌ల సరఫరాకు భారత్ ఫోర్జ్ ప్రధాన భాగస్వామిగా, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ద్వితీయ భాగస్వామిగా ఒప్పందం కుదరనుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2026 మొదట్లోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.

    Machine Guns | 60 శాతం స్థానికంగా..

    ఈ కార్బైన్‌లలో 60 శాతం భారత్ ఫోర్జ్ ద్వారా స్థానికంగా తయారు చేయనుండగా.. మిగిలిన 40 శాతం (సుమారు 1.70 లక్షలు) అదానీ గ్రూప్‌కు చెందిన పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో పాటు పిస్టల్స్, అసాల్ట్ రైఫిల్స్, ఇతర చిన్న తరహా ఆయుధాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాలకు సరఫరా చేయడం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు షుకి స్క్వాట్జ్ తెలిపారు.

    Machine Guns | ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ‘అర్బెల్’

    ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ భారత్‌కు అందించబోయే మరో అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ‘అర్బెల్ టెక్నాలజీ’. ఇది ప్రపంచంలోనే తొలి పూర్తి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌గా పరిగణించబడుతోంది. అత్యంత కచ్చితమైన లక్ష్య సాధన, రియల్ టైమ్ బాలిస్టిక్ కాలిక్యులేషన్, అధునాతన సెన్సార్ల సాయంతో యుద్ధక్షేత్రంలో సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని సంస్థ పేర్కొంటోంది.

    ఇది కూడా చదవండి..: RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.

    Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు

    సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన నిర్మాణ సంస్థ.. “అఖండ-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేం మా వంతు అన్నీ ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఊహించని రీతిలో పరిస్థితులు మారిపోతాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీను గారికి మా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.

    Akhanda 2 release update

    Akhanda 2 release update | ఎన్నో పుకార్లు..

    ముందుగా డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేసిన ఈ చిత్రం, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఆలస్యం చుట్టూ ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవలే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వదంతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను సద్దుమణిగేందుకు చొరవ తీసుకున్న వారిలో ఆయన కూడా ఒకరని సమాచారం.

    Akhanda 2 release update | నిర్మాత పోస్ట్​

    ప్రస్తుతం చిత్ర బృందం అన్ని అడ్డంకులను అధిగమించి, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని నిర్మాత రామ్​ ఆచంట సైతం ట్విట్టర్​లో స్పష్టం చేశారు.

  • This Week OTT Release | ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​  కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఇవే..

    This Week OTT Release | ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఇవే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: This Week OTT Release | ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఈ వారం ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్​ కానున్నాయి. ప్రేమ, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, హరర్ నేపథ్యాలతో రూపొందిన సినిమాలు ఆద్యంతం టెన్షన్‌ను నింపుతూ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి.

    This Week OTT Release
    This Week OTT Release

    This Week OTT Release | ది గర్ల్‌ఫ్రెండ్..

    షరతులు లేని ప్రేమికుల మధ్య ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను అత్యంత భావోద్వేగంగా చిత్రం ఈ చిత్రం. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి కథానాయకులుగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమాన్యుయేల్ మరో ముఖ్య పాత్రలో కనిపించించారు. ఇటీవల థియేటర్లలో విడుదలై యువతను ఎంతగానో ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

    This Week OTT Release | స్టీఫెన్..

    ఒకే సీజన్‌లో తొమ్మిది మంది మహిళలను దారుణంగా హతమార్చేసిన సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఉత్కంఠ రగిలిస్తుంది. ‘గార్గి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గోమతి శంకర్ హీరోగా నటించగా, మిథున్ బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ రోజు (డిసెంబర్ 5) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

    This Week OTT Release | జటాధర..

    సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. శిల్పా శిరోద్కర్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అభిషేక్ జైశ్వాల్, వెంకట్ కల్యాణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

    This Week OTT Release | డీయస్ ఈరే..

    మలయాళ సూపర్‌స్టార్ ప్రణవ్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్. ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ వంటి విజయవంతమైన చిత్రాలిచ్చిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

    రణం అరం తవరేల్ (తెలుగులో ‘ది హంటర్: చాప్టర్-1’)..

    వైభవ్ హీరోగా నటించిన తమిళ థ్రిల్లర్ ఇది. నందితా శ్వేత, తాన్యా హోప్ కథానాయికలు. షెరీఫ్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది.

    ఇతర ప్లాట్‌ఫాంలలో విడుదల కానున్న చిత్రాలు..

    నెట్‌ఫ్లిక్స్

    • ది అబాండన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
    • ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
    • ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ 2 (ఇంగ్లీష్ మూవీ)
    • న్యూయార్క్ ఎట్ 100 (ఇంగ్లీష్ మూవీ)
    • జేకెల్లీ (ఇంగ్లీష్ మూవీ)

    ఆహా

    • ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు వెబ్ సిరీస్)

    అమెజాన్ ప్రైమ్ వీడియో

    • షూర్లీ టుమారో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
    • మ్యాన్ ఫైండ్స్ టేప్ (ఇంగ్లీష్ మూవీ – రెంటల్)

    ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలు, వెబ్​సిరీస్​లు థ్రిల్లర్ అభిమానులను ఎంట్రటైన్​ చేయనున్నాయి. మీకు నచ్చిన చిత్రం ఏదైనా ఎంచుకుని ఆస్వాదించండి.

    ఇది కూడా చదవండి..: Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 postponed Reason | ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై తొలిసారి నోరు విప్పారు. హీరో శ్రీనందు నటించిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రం వాయిదా గురించి స్పష్టత ఇచ్చారు.

    “నేను కూడా ఉదయం నుంచి అఖండ 2కి సంబంధించిన ఆర్థిక ఇష్యూను క్లియర్ చేయడానికే బయట తిరిగాను. అందుకే ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చాను” చెప్పారు.

    Akhanda 2 release postponed

    Akhanda 2 postponed Reason | ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు..

    “అఖండ 2 సమస్య కేవలం కొన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవే. అవి బయటకు చెప్పకూడని విషయాలు. కానీ ఇప్పుడు ఎవరి మనసు వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు.. ఇది చాలా దురదృష్టకరం. ‘ఎన్ని కోట్లు ఇవ్వలేదు’, ‘ఎవరికి డబ్బులు ఆపారు’ అని రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. అవన్నీ పూర్తిగా అనవసరమైన, పుకార్లు మాత్రమే. ప్రేక్షకులు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. Akhanda 2 postponed Reason త్వరలోనే ఈ ఆటంకం తొలగిపోతుంది, చిత్రం రిలీజ్ అవుతుంది. గతంలో కూడా అనేక సినిమాలు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని విజయవంతంగా విడుదలయ్యాయి” అని ఆయన చెప్పారు.

    డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సిన నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: ది తాండవం’ చిత్రం ఆఖరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత సురేశ్ బాబు ఇచ్చిన ఈ హామీ అభిమానులకు కొంత ఊరటనిచ్చే వార్తగా నిలుస్తోంది. త్వరలోనే అధికారిక కొత్త రిలీజ్ తేదీ ప్రకటన రానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.

    RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి..

    ఈ ఏడాది ఇప్పటివరకు ఇది నాలుగో రేటు కోత కావడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. ప్రస్తుతం మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో మొత్తం 1.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్లయింది. ఈ నిరంతర కోతలతో హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఈఎంఐ భారం నుంచి మరింత ఉపశమనం లభించనుంది.

    గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రూపాయి మారకం విలువలో కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా గతంలో లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఆర్థిక వృద్ధి ఊపందుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు” అని వివరించారు.

    RBI interest Rates | సమీక్షలో ప్రకటించిన మరిన్ని ముఖ్య అంశాలు..

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి భారీగా పెంచుతూ ఆర్‌బీఐ ఆశాజనక సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, వినియోగం పెరుగుదల కారణంగా రెండో త్రైమాసికంలోనే 8.2 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది.
    • ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2.0 శాతానికి తగ్గించారు. ఇది సామాన్య ప్రజలకు మరింత ధరల స్థిరత్వాన్ని సూచిస్తుంది.
    • ద్రవ్యత పెంచేందుకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
    • ఇక దేశీయ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నట్లు గవర్నర్ చెప్పారు.

    RBI interest Rates | రుణగ్రహీతలకు ఊరట

    వరుసగా వడ్డీ రేటులో కోత విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత పెరిగి, పెట్టుబడులు, వినిమయం ఊపందుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా ఈ తగ్గింపును తమ లోన్ రేట్లకు త్వరగా అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ ఒత్తిడి తెస్తోంది. సామాన్య రుణగ్రహీతలకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది.

    ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    Akhanda 2 release postponed | సోషల్​ మీడియాలో పోస్ట్​

    ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేసింది. “అనివార్యమైన కారణాల వల్ల అఖండ 2ని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నామని తీవ్ర బాధతో తెలియజేస్తున్నాం. ఈ క్షణం మాకు అత్యంత వేదననిచ్చింది. ప్రతి బాలయ్య అభిమాని, సినీ ప్రేమికుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం” అని పేర్కొంది. అలాగే వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించి సానుకూల వార్తతో మళ్లీ వస్తామని పేర్కొంది.

    ఈ ఆకస్మిక వాయిదాకు ఆర్థికపరమైన చిక్కులే కారణమని ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి ప్రీమియర్ షోలను రద్దు చేయడం, ఆ తర్వాత విడుదలను వాయిదా వేయడం చర్చకు దారి తీసింది.

    Akhanda 2 release postponed | కొత్త తేదీ​ ఎప్పుడో..

    కొత్త రిలీజ్ తేదీ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం లేదా వీకెండ్‌లోపు స్పష్టమైన ప్రకటన రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రూపొందిన ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరగా మరో సారి శక్తివంతమైన పాత్రలో తెరపై అఖండ తాండవం చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

    ఇది కూడా చదవండి..: Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

    Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Rohit Sharma | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న రోహిత్.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20 జెర్సీ ధరించనున్నాడు. అయితే ఇది అంతర్జాతీయ టీ20 కాదు.. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడే అవకాశం ఉందని సమాచారం.

    Rohit Sharma | అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు.. కానీ..

    2024 టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశవాళీ టోర్నమెంట్లలో ఆడడానికి ఆయనకు అభ్యంతరం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

    Rohit Sharma | నాకౌట్ దశలోనే రంగంలోకి దిగే అవకాశం

    టోర్నమెంట్‌లో లీగ్ దశ ఇప్పటికే జోరుగా సాగుతోంది. అయితే రోహిత్ షెడ్యూల్ దృష్ట్యా లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. బదులుగా డిసెంబర్ 12, 14, 16 తేదీల్లో ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే నాకౌట్ (ప్రీ-క్వార్టర్, క్వార్టర్, సెమీ-ఫైనల్) మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

    Rohit Sharma | ముంబై జట్టు ఫామ్ అద్భుతం

    ఎలైట్ గ్రూప్-ఎలో ఆడుతున్న ముంబై జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లో ఐదింట్లో విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. కేరళతో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఈ ఫామ్‌తో నాకౌట్ దశకు అడుగుపెట్టిన ముంబైకి రోహిత్ శర్మ జాయిన్ కావడం జట్టుకు భారీ బూస్ట్‌గా మారనుంది.

    ఇది కూడా చదవండి..: Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Eye health tips | కళ్లు మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగం. కళ్ల ద్వారానే మనం ప్రపంచాన్ని గ్రహిస్తాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లతో గడిపే సమయం గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా హ్రస్వదృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం వంటి సమస్యలు చిన్న వయసులోనే ప్రారంభమవుతున్నాయి. దీంతో కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు రోజువారీ జీవితంలో అనివార్యమైపోయాయి. అయితే ఈ కళ్లద్దాలను రోజంతా ధరించడం వల్ల చూపు మరింత దెబ్బతింటుందని, కళ్లు వాటికి బానిసైపోతాయని చాలామంది భయపడుతుంటారు. ఇది నిజమేనా? నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం..

    కంటి వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పవర్‌తో తయారైన కళ్లద్దాలను ఎంతసేపు ధరించినా చూపు తగ్గదు, కళ్లు బలహీనం కావు. బదులుగా సరైన దిద్దుబాటు లెన్సులు ధరించడం వల్ల కంటిపై పడే అనవసర ఒత్తిడి తగ్గుతుంది. తలనొప్పి, కళ్ల అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. చూపులో మార్పు రావడానికి ప్రధాన కారణాలు వయసు పెరగడం, మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు వంటి వ్యాధులు లేదా జన్యుపరమైన అంశాలే కానీ కళ్లద్దాలు కాదు.

    Eye health tips | కంప్యూటర్ ముందు గంటలకొద్దీ కూర్చుంటే..

    స్క్రీన్ వైపు ఎక్కువ సమయం చూడటం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (డిజిటల్ ఐ స్ట్రెయిన్) వస్తుంది. దీని లక్షణాలు.. కళ్లు ఎండిపోవడం, ఎర్రబడటం, తలనొప్పి, మెడ నొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ ఇవి శాశ్వతంగా చూపును దెబ్బతీసే సమస్యలు కావు. సరైన అలవాట్లు పాటిస్తే ఈ ఇబ్బందులు తగ్గుతాయి.

    Eye health tips | వీటిని పాటిస్తే మేలు..

    • ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. ఇది కళ్లకు విశ్రాంతినిస్తుంది.
    • స్క్రీన్‌ను కంటి స్థాయి కంటే కొంచెం కింద ఉంచండి.
    • గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి (ఎక్కువ చీకటి లేదా ఎక్కువ కాంతి రెండూ హానికరమే).
    • ప్రతి గంటకు ఒకసారి కళ్లు మూసుకొని 30 సెకన్లు విశ్రాంతి తీసుకోండి.
    • ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వాడకం గురించి డాక్టర్‌ను అడగండి.

    Eye health tips | కంటి ఆరోగ్యం కోసం ఆహారం

    విటమిన్ A, లుటీన్, జియాజాంథిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్, పాలకూర, బ్రకోలీ, కాలే, గుడ్లు, చేపలు, బత్తాయి, నారింజ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

    సరైన పవర్ కళ్లద్దాలను రోజంతా ధరించడం ఎటువంటి హాని కలిగించదు. బదులుగా కళ్లకు సౌకర్యాన్ని, స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. అపోహలకు భయపడకుండా, నిపుణుల సలహా మేరకు కంటి సంరక్షణ చర్యలు తీసుకుంటే చూపు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Greater Hyderabad expansion | మరింత విస్తరించిన మహా నగరం.. 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనం

    Greater Hyderabad expansion | మరింత విస్తరించిన మహా నగరం.. 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనం

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్:  Greater Hyderabad expansion | హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో సమ్మిళితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. నవంబర్ 25న మంత్రివర్గం ఈ విస్తరణకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా జీహెచ్ఎంసీ చట్టం మరియు తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణలకు గవర్నర్ సమ్మతి తెలపడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెంటనే నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 2 నుంచి ఈ 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో భాగమైనట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు.

    Greater Hyderabad expansion | విలీన ప్రక్రియకు ఆదేశాలు

    గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా విలీన ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానమైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమీప జోనల్ కమిషనర్లకు ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.

    అంతేకాకుండా.. ఈ 27 సంస్థల ఖాతాలను తక్షణమే స్తంభింపజేసి, నిధులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదలాయించాలని ఆదేశించారు. అదనంగా, 9 రకాల ప్రొఫార్మాలను సిద్ధం చేయించారు. ఉద్యోగుల వివరాలు, స్థిర మరియు చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, కొనసాగుతున్న పనులు, చెల్లింపులు, గత మూడు సంవత్సరాల్లో భవనాలు మరియు లేఔట్లకు ఇచ్చిన అనుమతులు వంటి సమాచారాన్ని ఈ ప్రొఫార్మాల్లో నమోదు చేసి, మరుసటి రోజు నాటికి సమర్పించాలని కమిషనర్​ ఆదేశాలు ఇచ్చారు.

    ఇది కూడా చదవండి..: India Q2 GDP | దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. అంచనాలను మించిన జీడీపీ గణాంకాలు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai