Penci Sport plugin only working with the Soledad theme.

telugu news today - Telugu News Today

Tag: telugu news today

  • sweet corn benefits | చలికాలంలో వేడివేడి స్వీట్ కార్న్.. రుచితో పాటు ఆరోగ్యం..

    sweet corn benefits | చలికాలంలో వేడివేడి స్వీట్ కార్న్.. రుచితో పాటు ఆరోగ్యం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: sweet corn benefits | చలికాలం వచ్చిందంటే చాలు… బయట రోడ్ల పక్కన బొగ్గుల మీద కాల్చిన మక్క కంకులు (Sweet corn) కనిపిస్తుంటాయి. వేడివేడి స్వీట్ కార్న్‌కు కొద్దిగా నిమ్మరసం, ఉప్పు రాసుకుని తింటే ఆ రుచి అమోఘం. ఈ టేస్టీ స్వీట్ కార్న్ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధం లాంటిది. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి కావలసిన వేడి, శక్తి, రోగనిరోధక శక్తిని అందించడంలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది.

    స్వీట్ కార్న్‌ను ఉడికించి, కాల్చి, సూప్‌గా, సలాడ్‌గా, స్నాక్‌గా ఎలా తిన్నా.. రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

    sweet corn benefits | రోగనిరోధక శక్తిని పెంచుతుంది

    చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు సాధారణం. స్వీట్ కార్న్‌లో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీంతో పాటు యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తట్టుకుని, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

    sweet corn benefits

    sweet corn benefits | జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

    స్వీట్ కార్న్‌లో గణనీయమైన మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజూ ఒక కప్పు స్వీట్ కార్న్ తింటే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు దరిచేరవు.

    sweet corn benefits | గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

    ఇందులో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

    sweet corn benefits | కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

    స్వీట్ కార్న్‌లో ల్యూటిన్, జియాగ్జాంథిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు మీద పడుతున్న కంటి సమస్యలు (మాక్యులర్ డిజెనరేషన్, కంటి లెంస్ మందం) నుంచి రక్షణ కల్పిస్తాయి.

    రక్తహీనతను దూరం చేస్తుంది

    ఐరన్, ఫోలేట్ (విటమిన్ B9), విటమిన్ B1 పుష్కలంగా లభించడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే రక్తహీనత సమస్యకు ఇది సహజ పరిష్కారం.

    sweet corn benefits

    బరువు నియంత్రణలో సహాయపడుతుంది

    క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కావడంతో తిన్నాక కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి, ఆరోగ్యకరమైన లాభం కోరుకునేవారికి ఇది అద్భుతమైన స్నాక్.

    డయాబెటిస్ ఉన్నవారికి కూడా సురక్షితం

    స్వీట్ కార్న్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. డయాబెటిస్ రోగులు కూడా మితంగా తీసుకోవచ్చు.

    గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఉత్తమ ఎంపిక

    స్వీట్ కార్న్ సహజంగానే గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ సెంసిటివిటీ లేదా సీలియాక్ వ్యాధి ఉన్నవారు ఎటువంటి భయం లేకుండా దీన్ని ఆస్వాదించవచ్చు.

    గమనిక: మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ కథనం ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. వీటిని తీసుకునేముందు మీ వ్యక్తిగత వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

    ఇది కూడా చదవండి..: soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: soft chapatis all day | చపాతీలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే.. అవి చేసినప్పుడు మెత్తగా వచ్చినా కొద్దిసేపటికే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడి చేసినా పాత మెత్తదనం రాదు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఉదయం తయారు చేసిన చపాతీలు రాత్రి వరకూ కూడా రెండు వేళ్లతో సులువుగా మడతపెట్టేంత మెత్తగా ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక పదార్థాలు లేకుండా, ఇంట్లో ఉన్నవాటితోనే ఇలా చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..

    soft chapatis all day

    soft chapatis all day | పిండి కలిపే సమయంలో ఇలా చేయండి..

    • సాధారణంగా గోధుమ పిండిని నీళ్లతోనే కలుపుతాం. కానీ మెత్తదనం కోసం ఒక చిన్న మార్పు చేయండి.
    • నీటిలో కొంత భాగం (సుమారు 25–౩౦ శాతం) పాలతో భర్తీ చేయండి. పాలలోని కొవ్వు, ప్రోటీన్ పిండిని తేమగా ఉంచుతాయి.
    • పాలు వాడకపోయినట్లయితే రెండు టీస్పూన్ల నూనె లేదా నెయ్యి కలిపి కలపండి. ఇలా చేయడంతో పిండి మరింత మృదువుగా మారుతుంది. మరియు చపాతీలు గట్టిపడకుండా ఉంటాయి.
    • పిండి మెత్తగా, మెరిసేలా కలిసే వరకూ బాగా పిసకండి
    • కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టండ
    • పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకండి. కనీసం 20–౩౦ నిమిషాల పాటు పక్కన పెట్టండి. తడిగా ఉన్న పత్తి గుడ్డతో లేదా మూత పెట్టిన గిన్నెలో ఉంచండి. ఈ విశ్రాంతి సమయంలో గ్లూటెన్ సడలి, తేమ సమానంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా చపాతీలు బాగా పొంగుతాయి. ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి.

    soft chapatis all day | సరైన మంటపై కాల్చండి..

    • చపాతీలు త్వరగా గట్టిపడిపోకుండా ఉండాలంటే పెనం (తవా) బాగా వేడిగా ఉండాలి
    • మీడియం–హై మంట మీద పెనం వేడి చేయండి (నీటి చుక్క వేస్తే తక్షణం ఆవిరైపోవాలి).
    • చపాతీని రెండు వైపులా కొద్దిసేపు కాల్చి, ఆ తర్వాత నేరుగా అగ్నిమీదికి తీసుకెళ్లి లేదా గుడ్డతో నొక్కుతూ పూరి లాగా పొంగేలా చేయండి.
    • తక్కువ మంట మీద నెమ్మదిగా కాల్చితే తేమ అంతా పోయి చపాతీలు త్వరగా గట్టిపడతాయి.
    • కాల్చేటప్పుడు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తే రుచి, మెత్తదనం రెట్టింపవుతాయి.

    soft chapatis all day

    soft chapatis all day | నిల్వ చేసే విధానం..

    • ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. చాలా మంది ఈ దశలోనే తప్పు చేస్తారు
    • వేడి వేడి చపాతీలను నేరుగా స్టీల్ డబ్బా లేదా క్యాస్రోల్‌లో పెట్టొద్దు
    • ఆవిరి వల్ల మొదట తడిగా, తర్వాత రబ్బరు లాగా అవుతాయి.
    • శుభ్రమైన, పొడి కాటన్​ క్లాత్​ను డబ్బాలో వేయండి ప్రతి చపాతీని ఆ గుడ్డలో మడతపెట్టి పెట్టండి. మూత మూసిన తర్వాత గాలి ప్రవేశించదు. అదనపు తేమను గుడ్డ పీల్చేస్తుంది.
    • ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే మీ చపాతీలు ఎప్పుడూ దూదిలా మెత్తగా ఉంటాయి.

    గమనిక: ఈ కథనం ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.

    ఇది కూడా చదవండి..: Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • New Labour Codes | అమలులోకి కొత్త కార్మిక చట్టాలు.. ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..!

    New Labour Codes | అమలులోకి కొత్త కార్మిక చట్టాలు.. ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: New Labour Codes | ఉద్యోగుల హక్కులు, భద్రత, సంక్షేయం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తీసుకొచ్చింది. అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణల ద్వారా సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లను కూడా సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థలో చేర్చారు. అందరు ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో పాటు, పారదర్శకత మరియు స్థిరమైన ఉపాధికి లిఖిత హామీ లభిస్తుంది. అన్ని రంగాల్లో కనీస వేతనాలు, లింగ వివక్ష లేకుండా సమాన వేతనం, సకాలంలో వేతన చెల్లింపులు వంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఇకపై కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం పాత 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ తయారు చేసిన నాలుగు కొత్త కోడ్‌లు తీసుకొచ్చింది. ఇందులో వేతనాల కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, సామాజిక భద్రత కోడ్-2020, వృత్తిపర భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్-2020 అమలులోకి వచ్చాయి. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళల సాధికారతతో పాటు గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లకు ప్రత్యేక రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలుస్తాయి. అన్ని ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో ఉపాధి స్థిరత్వం మరియు పారదర్శకతకు బలమైన హామీ లభిస్తుంది.

    New Labour Codes | గిగ్​ వర్కర్లకు పీఎప్​ సౌకర్యం

    గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లతో సహా అందరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF), ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC), బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయి. ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధి (FTE) ఉద్యోగులకు కూడా స్థిర ఉద్యోగులతో సమానంగా సెలవులు, వైద్య సౌకర్యాలు, సామాజిక భద్రత లభిస్తుంది. ఇకపై FTE ఉద్యోగులు ఐదేళ్ల బదులు కేవలం ఒక్క ఏడాది సర్వీసు పూర్తి చేసిన తర్వాత నుంచే గ్రాట్యుటీకి అర్హులవుతారు. అన్ని కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధ హక్కుగా మారింది. వేతనాలు సకాలంలో చెల్లించని యజమానులపై జరిమానాలు విధిస్తారు. ఐటీ రంగ ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోపు వేతనం అందేలా నిబంధనలు ఉన్నాయి.

    New Labour Codes | అసంఘటిత రంగ కార్మికుల కోసం..

    బీడీ పరిశ్రమ, సిగరెట్ తయారీ, మైనింగ్ వంటి రంగాల్లో 8 నుంచి 12 గంటల వరకు పని చేసే సౌలభ్యం కల్పించారు. అయితే వారానికి 48 గంటలు మించకూడదు. 40 ఏళ్లు దాటిన అందరు ఉద్యోగులకు యజమానులు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. సమాన పనికి లింగ భేదం లేకుండా సమాన వేతనం తప్పనిసరి. సాధారణ పని గంటలు మించితే రెట్టింపు వేతనం చెల్లించాలి. రాత్రి షిఫ్టులు, అండర్‌గ్రౌండ్ మైనింగ్ వంటి పనుల్లో మహిళలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దానికి తగిన భద్రతా చర్యలు యజమానులు తీసుకోవాలి.

    గిగ్ వర్క్, ప్లాట్‌ఫాం వర్క్, అగ్రిగేటర్లను (ఉదా: ఉబర్, స్విగ్గీ వంటి కంపెనీలు) చట్టంలో మొదటిసారి నిర్వచించారు. ఈ అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం సామాజిక భద్రతా నిధికి కేటాయించాలి. ఆధార్ ఆధారిత సామాజిక భద్రతా ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉంటాయి. జర్నలిస్టులు, డిజిటల్ మీడియా కార్మికులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, స్టంట్ ఆర్టిస్టులు సహా అందరూ పూర్తి సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు.

    New Labour Codes | ప్రతి కార్మికుడికి గౌరవం – మోదీ ప్రభుత్వ హామీ

    “ప్రతి కార్మికుడికి గౌరవం” అనేది మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రమాదకర రంగాల్లో వంద శాతం ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సంస్కరణలు ఆత్మనిర్భర భారత్‌కు బలమైన అడుగుగా నిలుస్తాయని, వికసిత భారత్ లక్ష్యానికి కొత్త ఊపిరి పోస్తాయని మంత్రి వివరించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్మిక కోడ్‌ల అమలును స్వాగతిస్తూ “శ్రమేవ జయతే” అని పోస్టు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక సంస్కరణలు ఇవే అని ఆయన అభివర్ణించారు. ఈ చట్టాలు కార్మికులకు శక్తినిస్తాయని, హక్కులను కాపాడుతూనే దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Loan rejection | మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా.. లోన్ రావడం లేదా.. ఈ కారణాలు ఉండొచ్చు..

    Loan rejection | మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా.. లోన్ రావడం లేదా.. ఈ కారణాలు ఉండొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Loan rejection | మీ క్రెడిట్​ స్కోర్​ బాగుందా.. అయినా మీరు లోన్​కు అప్లయ్​ చేసినా రావడం లేదా.. మంచి క్రెడిట్​ స్కోర్​ ఉన్నా రుణం ఎందుకు రావడం లేదని ఆలోచిస్తున్నారా.. బ్యాంకులు లోన్​ మంజూరు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. లోన్​ ఇచ్చే టైంలో బ్యాంకర్లు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.. రుణం విషయంలో అవి ఎలా ప్రభావం చూపుతాయనే విషయం తెలుసుకుందాం..

    చాలా మంది క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలు.. లోన్ తప్పకుండా వచ్చేస్తుందని భావిస్తారు. కానీ వాస్తవంగా అలా జరగదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్ మంజూరు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవు. అది కేవలం ఒక భాగం మాత్రమే. దరఖాస్తుదారుడి మొత్తం ఆర్థిక చిత్రాన్ని సమగ్రంగా పరిశీలిస్తారు. అందుకే 750–800 పైన స్కోర్ ఉన్నవారికి కూడా కొన్నిసార్లు లోన్ తిరస్కరణకు గురవుతుంటుంది. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలివే..

    Loan rejection | స్థిరమైన ఆదాయం మరియు ఉద్యోగ స్థిరత్వం

    మీ జీతం ఎంత స్థిరంగా వస్తోంది? గత రెండు-మూడేళ్లలో ఉద్యోగాలు తరచూ మార్చారా? కంపెనీ మారినప్పుడు జీతంలో పెద్ద తేడా వచ్చిందా? ఇలాంటి అస్థిరత ఉంటే బ్యాంకులు “ఈ వ్యక్తి నెలవారీ EMI చెల్లించగలడా?” అని సందేహపడతాయి.

    Loan rejection | డెట్-టు-ఇన్‌కమ్ రేషియో (DTI)

    మీ నెలవారీ ఆదాయంలో ఎంత శాతం ఇప్పటికే ఉన్న అప్పుల EMIలకు వెళ్తోంది? సాధారణంగా 40–50% పైన వెళ్తే బ్యాంకులు కొత్త లోన్ ఇవ్వడానికి జంకుతుంటాయి. ఎందుకంటే మిగిలిన డబ్బుతో జీవన ఖర్చులు తీర్చుకోవడం కష్టమవుతుందని వారి అంచనా వేస్తాయి.

    Loan rejection | ఇప్పటికే ఉన్న రుణ భారం

    బహుళ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కారు లోన్, ఇల్లు లోన్ – ఇవన్నీ కలిపి చాలా ఎక్కువగా ఉంటే, మంచి స్కోర్ ఉన్నా కొత్త లోన్ ఆమోదం రాకపోవచ్చు. బ్యాంకులు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటాయి.

    Loan rejection | ఇటీవలి క్రెడిట్ ఎంక్వైయిరీలు

    చివరి 6–12 నెలల్లో ఎన్ని క్రెడిట్ కార్డులు, లోన్ల కోసం దరఖాస్తు చేశారు? ఎక్కువ దరఖాస్తులు ఉంటే “ఈ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడేమో” అని బ్యాంకులు అనుమానిస్తాయి. అందుకే రుణం ఇచ్చే విషయంలో ఆలోచిస్తాయి.

    Loan rejection | చెల్లింపు చరిత్రలో చిన్న లోపాలు

    ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లు 29 రోజులకు బదులు 31వ రోజు చెల్లించినా, లేదా ఒక్క రోజు ఆలస్యమైనా కొన్ని బ్యాంకులు దాన్ని పెద్ద లోపంగా భావిస్తాయి. ఈఎంఐలు, బిల్లు చెల్లింపులు ఆలస్యం చేయడం కూడా ప్రభావం చూపిస్తాయి.

    వయస్సు, రిటైర్మెంట్ దూరం

    ఉద్యోగి రిటైర్​మెంట్​కు 5 నుంచి 7 ఏళ్లలోపు ఉన్నవారికి పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. ఎందుకంటే రిటైర్​మెంట్​ తర్వాత ఆదాయం తగ్గే అవకాశం ఉంది. దీంతో డబ్బులు తిరిగి చెల్లిస్తారో లేదోనని సందేహిస్తాయి.

    క్రెడిట్ హిస్టరీ

    క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉండడం కూడా రుణం ఇవ్వకపోవడంపై ప్రభావం చూపిస్తుంది. తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉన్నట్లయితే మీరు లోన్​ తీసుకున్న తర్వాత చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేది బ్యాంకులు అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి క్రెడిట్​ కార్డులు రద్దు చేసుకుని విషయం కూడా ఒక సారి ఆలోచించాలి. క్రెడిట్​ కార్డులను రద్దు చేసుకోవడం వల్ల క్రెడిట్​ హిస్టరీ పోతుంది.

    డాక్యుమెంటేషన్ లోపాలు

    డాక్యుమెంటేషన్​లో లోపాలు కూడా రుణ మంజూరులో కీలకమే. ఫారంలో చిన్న స్పెల్లింగ్ తప్పులు, సంతకం సరిగ్గా సరిపోకపోవడం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అసంపూర్ణంగా ఉండడం ఇవన్నీ కూడా తిరస్కరణకు కారణమవుతాయి.

    క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక ఆరోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. జ్వరం లేదని చెప్పగలుగుతుంది. కానీ.. పూర్తి వ్యాధి నిర్ధారణ చేయలేదు. లోన్ మంజూరు కావాలంటే స్థిరమైన ఆదాయం, తక్కువ రుణ భారం, చెల్లింపు క్రమశిక్షణ, తగినంత క్రెడిట్ హిస్టరీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే నమ్ముకుని లోన్​లకు దరఖాస్తు చేయవద్దు.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai


  • Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

    Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Karthika Amavasya | పవిత్రమైన కార్తీక మాసం అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అయితే కార్తీక వ్రతం పూణ్య ఫలం దక్కాలంటే చివరి రోజైన అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు.. తిథి, శుభముహూర్తం వంటి విషయాలను తెలుసుకుందామా..

    ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి యేటా ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. పితృపూజకు కార్తీక అమావాస్యను అత్యంత పవిత్రమైందిగా భావిస్తుంటారు. ఈ రోజు నదీ స్నానాలు ఆచరిస్తారు. అంతే కాకుండా దానధర్మాలు చేస్తుంటారు. కార్తీక అమావాస్య రోజు శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారు.

    Karthika Amavasya | అమావాస్య తిథి..

    హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి నవంబర్‌ 19న ఉదయం 9:44 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు ముగియనుంది. అయితే అయితే సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నవంబర్‌ 20న కార్తీక అమావాస్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

    Karthika Amavasya | అమావాస్య ప్రాముఖ్యత

    కార్తీక అమావాస్య విశేషమైందిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు ఈ రోజున పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగిందుకు పితృ పూజలు, తిలా తర్పణం, పిండ దానం చేస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు శక్తికొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.

    Karthika Amavasya

    Karthika Amavasya | దీపారాధన

    కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంటని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత.. నువ్వుల నూనెతో ఇంటి ముందు, దేవుడి వద్ద, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శ్రీమహావిష్ణువుకు తులసి మాలను సమర్పించడం విశిష్టమైందిగా చెబుతారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

    Karthika Amavasya | ఉపవాస దీక్ష

    అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అందుకే ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే కార్తీక మాసమంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక అమావాస్య నియమాలను శాస్త్రయుక్తంగా ఆచరిద్దాం.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    ఇది కూడా చదవండి..: Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: F-35 fighter jets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో సైనికంగా కీలక పరిణామాలు జరుగనున్నాయి. కాగా.. MBS ఏడేళ్ల తర్వాత అమెరికా రాజధాని సందర్శించడం గమనార్హం.

    ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా మా గొప్ప మిత్రదేశం. వాళ్లు F-35 జెట్లు కొనాలని కోరుకుంటున్నారు.. మేం కచ్చితంగా అమ్ముతాం” అని స్పష్టం చేశారు. సౌదీ ఇప్పటికే 48 వరకు F-35 జెట్ల కోసం అభ్యర్థన పెట్టింది. ఇది బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంగా మారనుందని తెలిపారు.

    f-35 fighter jets

    F-35 fighter jets | ఈ ఒప్పందంపై ఆందోళన

    అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లోని కొందరు అధికారులు ఈ అమ్మకానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సౌదీ – చైనా సన్నిహిత సంబంధాలు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది చైనా సౌదీకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. రెండు దేశాలు సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. F-35లోని అత్యంత రహస్య సాంకేతికత చైనా చేతికి చిక్కే ప్రమాదం ఉందని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే కారణంతో గతంలో UAEకి F-35 అమ్మకం కూడా ఆలస్యమైంది.

    F-35 fighter jets | మరో కీలక అంశం ఏమిటంటే..

    ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం (Qualitative Military Edge). అమెరికా చట్టం ప్రకారం ఇజ్రాయెల్‌కు మధ్యప్రాచ్యంలో ఎవరికీ లభించని సైనిక ప్రాధాన్యత ఉండాలి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో F-35లు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే.

    F-35 fighter jets | అబ్రహం ఒడంబడిక విస్తరణపై ట్రంప్ ఆశలు

    ట్రంప్ తన మొదటి టర్మ్‌లో సాధించిన అబ్రహం ఒడంబడికను (Abraham Accords) విస్తరించాలని భావిస్తున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ ద్వారా మధ్యప్రాచ్య శాంతిని సాధించవచ్చని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. “సౌదీ త్వరలోనే అబ్రహం ఒడంబడికలో చేరుతుందని ఆశిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు.

    Source : Indiatvnews.com

    ఇది కూడా చదవండి..: Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్​ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​కు షాక్​ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్​కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు.

    X Chat | వాట్సప్​, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా..

    ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X Chatను లాంచ్ చేయనున్నారు. ఇందులో ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫాం.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​తో పాటు అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్స్​ కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ అలాంటి స్పెషల్​ ఫీచర్స్​ ఉండడం దీని ప్రత్యేకత.

    X Chat

    త్వరలోనే లాంఛ్​..

    ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌, ఆడియో, వీడియో కాల్స్​ వంటి ఫీచర్స్​తో కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎక్స్’ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే ఉద్దేశంలో ఉన్న మస్క్​.. త్వరలో ‘ఎక్స్ మనీ’ (X Money) కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. X Chatలో పంపిన మెసేజ్​లు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​ సౌకర్యం ఉంటుందని వివరించారు. కేవలం వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని పేర్కొన్నారు.

    ఎడిటింగ్​ ఆప్షన్​

    త్వరలో లాంఛ్​ చేయనున్న ఈ మెసేజింగ్ యాప్​లో యూజర్లు తాము పంపిన మెసేజ్​లను తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చు, లేదంటే డిలిట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని యాప్​ కల్పించనుంది. అవసరం అనుకుంటే డిసప్పియర్ చేసే వెసలుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్‌లో ఏదైనా సమాచారాన్ని డిలిట్ చేసినట్లయితే This Message was Deleted.. అని కనిపిస్తుంటుంది. కానీ ఎక్స్ చాట్​లో డిలిట్ చేసినట్లయితే ఇలా కనిపించదు.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Telangana Orange Alert |తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త

    Telangana Orange Alert |తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Telangana Orange Alert తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయితే రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

    Telangana Orange Alert |అత్యల్పంగా ఆసిఫాబాద్​

    రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం అర్ధరాత్రి అత్యల్పంగా ఆసిఫాబాద్​లో 7 డిగ్రీలు, సంగారెడ్డిలో 7.1, ఆదిలాబాద్​ 7.7 డిగ్రీలు నమోదైంది. ఆ తర్వాత వికారాబాద్​ 8.1, రంగారెడ్డి 8.2, సిరిసిల్ల 8.4, కామారెడ్డి 8.5, నిజామాబాద్​ 8.9, జిగిత్యాల 9, మెదక్​ 9.3, నిర్మల్​ 9.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.

    Telangana Orange Alert |హైదరాబాద్​లోనూ గణనీయంగా చలితీవ్రత

    రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. హెచ్‌సీయూ శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాబోయే రెండు రోజుల పాటు నగరంలో 8-10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    Telangana Orange Alert |వణికిపోతున్న ప్రజలు

    చలి తీవ్రత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. స్వెట్టర్లు లేనిది ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కాగా.. రానున్న రోజుల్లో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    Telangana Orange Alert | పలు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​

    రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.రాబోయే రెండు రోజుల పాటు అత్యంత తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉన్నందుని పేర్కొంది. 10 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6- 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, భూపాలపల్లి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా చలి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారు తప్పనిసరిగా వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలని చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Saudi Arabia Bus Crash | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Saudi Arabia Bus Crash) జరిగింది. ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాగా.. మృతులు హైదరాబాద్‌ వాసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

    Saudi Arabia Bus Crash | మక్కాకు వెళ్తుండగా..

    ఉమ్రా యాత్రికులు మక్కా మసీదు అల్‌హరామ్‌లో ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. సౌదీ అధికారులు రక్షణ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు బాధితులను రక్షించేందుకు, మృత దేహాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరణాల సంఖ్య ఇంకా ధ్రువీకరణ కాలేదు. కానీ.. స్థానిక మీడియా ప్రకారం 42 మంది మరణించినట్లు వార్తలు రాస్తున్నాయి. గాయపడినవారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చారని అధికారులు తెలిపారు.

    Saudi Arabia Bus Crash | రంగంలో ఇండియన్​ ఎంబసీ

    రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఇండియన్​ ఎంబసీ వెంటనే దీనిపై దృష్టి పెట్టింది. హజ్​ కమిటీతో పాటు భారతీయ ఎంబసీ.. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాయి. మృత దేహాలను భారత దేశానికి తీసుకురావడానికి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: AI Jobs in India | ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ (AI) వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుండగా.. మన దేశంలోనూ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ ఒకప్పుడు ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు ఏఐ జాబ్స్ విషయంలో వెనుకబడుతోంది. బెంగళూరు లాంటి సిటీలు దూసుకెళ్తుండగా.. హైదరాబాద్​ వెనుకబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

    AI Jobs in India | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్..

    ప్రపంచంలో ఏఐ రాక ఒక విప్లవం. ఈ టెక్నాలజీతో కంపెనీలు ఆటోమేషన్‌ ద్వార ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో కొత్త స్కిల్స్ ఉన్నవాళ్లకు డోర్లు తెరుచుకుంటున్నాయి. భారత్‌లో AI Jobs in India 2025లో మరింత పెరిగాయి. మార్కెట్ $20 బిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్‌లో బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఎప్పుడూ ముందుండేవి. కానీ ఏఐ విషయంలో డైనమిక్స్ మారాయి. స్టార్టప్‌లు, ఆర్&డీ సెంటర్లు ఇక్కడే పుట్టుకొస్తుండగా.. డిస్ట్రిబ్యూషన్ అసమానంగా ఉన్నాయి.

    AI Jobs in India | టాప్‌లో ఉన్న నగరాలు ఏమిటంటే..

    తాజా రిపోర్టుల ప్రకారం.. AI Jobsలో బెంగళూరు 26 శాతం షేర్‌తో ముందుంది. ఇక్కడ వేలాది ఏఐ స్టార్టప్‌లు, ఎంఎల్ ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి. ఇక పుణె 17 శాతంతో రెండో స్థానం, ముంబై 13 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కేవలం 10 శాతంతో నాలుగో స్థానం నిలిచింది. అలాగే చెన్నై 7శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఆ తర్వాత ప్లేస్​లలో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో బలంగా ఉన్నా.. ఏఐ స్పెసిఫిక్ జాబ్స్‌లో మాత్రం వెనుకబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    AI Jobs in India

    AI Jobs in India | కొత్త పెట్టుబడులు

    విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్నట్లు అక్టోబర్​లో గూగుల్​ ప్రకటించింది. ఈ నిధులతో ఏఐ డేటా సెంటర్ స్థాపించనుంది. ఇది 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చనే అంచనాలున్నాయి. అదానీ గ్రూప్ కూడా పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీతో కలిసి పనిచేస్తోంది. హైదరాబాద్‌లో కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి ఉన్నాయి. కానీ ఏఐ ఫోకస్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. టైర్-2 సిటీలు ఇప్పుడు 14-16 శాతం ఏఐ హైరింగ్ చేస్తున్నాయి.

    హైదరాబాద్ పుంజుకుంటుందా..

    ఏఐ జాబ్స్​లో హైదరాబాద్ ప్రస్తుతం వెనుకబడినా.. వేగంగా పెరిగేందుకు అవకాశం ఉంది. టి-హబ్ లాంటి ఇన్‌క్యుబేటర్లు ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఓవరాల్ AI Jobs in Indiaను పెంచుతుంది. యువత ఏఐపై స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే.. హైదరాబాద్ తిరిగి టాప్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai