Penci Sport plugin only working with the Soledad theme.

telugu news today - Telugu News Today

Tag: telugu news today

  • Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్​ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం గేయం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరిస్తారు. స్మారక తపాలా బిల్ల, స్మారక నాణేలను కూడా విడుదల చేయనున్నారు.

    Vande Mataram 150 years celebrations

    Vande Mataram 150 years celebrations | దేశ వ్యాప్తంగా వేడుకలు

    వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.50 గంటలకు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా ‘వందేమాతరం’ గేయాలాపన జరగనుంది. అలాగే స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న ప్రతిజ్ఞ చేయనున్నారు.

    Vande Mataram 150 years celebrations | 150 ఏళ్ల మహోన్నత చరిత్ర..

    వందేమాతరం గేయానికి మహోన్నత చరిత్ర ఉంది. దీనిని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా రచించినట్లు చెబుతారు. ఆయన రచించిన నవల ‘ఆనందమఠ్’లో తొలుత ఈ గేయం కనిపించింది. ఈ నవల అప్పట్లో ‘బంగదర్శన్’ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. అనంతరం 1882లో ప్రత్యేక పుస్తకంగా వెలువడింది. ఈ గేయం నాడు ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్పూర్తి నింపింది. అంతేకాకుండా జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటించారు. దీనికి జాతీయ గీతం జనగణమనతో సమాన గౌరవం ఇచ్చారు.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    తెలుగున్యూస్​టుడే, ఇంర్నెట్​డెస్క్​: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్​ఫోన్​ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉండాల్సిందే. అయితే వీటిలోని ఉండే అనేక ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇందులో ‘ఫైట్​ మోడ్’​ కూడా ఒకటి. దీని గురించి కొందరికి తెలిసినా.. దీంతో ఉండే చాలా ఉపయోగాలు పూర్తిగా తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా..

    మనం మామూలుగా విమానంలో ప్రయాణించే సమయంలో, నెట్‌వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తారని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఈ ఫ్లైట్ మోడ్‌ ద్వారా మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి.

    Smartphone Flight Mode Uses : బ్యాటరీ లైఫ్ పెరుగుదల

    ఫ్లైట్ మోడ్‌ ఆన్ చేయడం వల్ల ఫోన్ నెట్‌వర్క్ సెర్చ్ చేయడం ఆపేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా Wi-Fi, మొబైల్ డేటా, బ్లూటూత్‌, జీపీఎస్​ లాంటి ఫీచర్లు డిసెబుల్ అవుతాయి. దీనివల్ల బ్యాటరీ 20-30 శాతం వరకు ఎక్కువ సేపు పనిచేస్తుంది. బ్యాటరీ తక్కువ ఉన్న సమయంలో తాత్కాలికంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం వల్ల పవర్‌ సేవ్ చేసుకోవచ్చు.

    Smartphone Flight Mode Uses : ఛార్జింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు..

    ఫైట్​ మోడ్​ ఆన్​ చేసి ఛార్జింగ్​ పెట్టడం వల్ల వేగంగా అవుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇలా చేయడం ద్వారా ఫోన్ మూడు నుంచి నాలు రెట్లు ఫాస్ట్​గా ఛార్జ్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్, Wi-Fi, నోటిఫికేషన్స్​ పనిచేయవు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయి ఛార్జింగ్ వేగం పెరుగుతుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఫ్లైట్ మోడ్‌ ఆన్​ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు.

    నెట్‌వర్క్ రీసెట్‌ కోసం..
    కొన్నిసార్లు మన ఫోన్​లో సిగ్నల్ పోయి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో ఫ్లైట్ మోడ్‌ను 10 సెకన్ల పాటు ఆన్ చేసి తిరిగి ఆఫ్ చేయాలి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ అనేది ఆటోమేటిక్‌గా రీఫ్రెష్ అవుతుంది. అప్పుడు సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.

    Smartphone Flight Mode Uses : నిద్రపోయే సమయంలో..
    రాత్రి నిద్రకు ఉపక్రమించిన సమయంలో అత్యవసరం లేకపోతే ఫైట్​మోడ్​ ఆన్​ చేసుకోవచ్చు. ఫోన్​ దగ్గరగా పెట్టుకుని పడుకున్నట్లయితే సిగ్నల్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల రేడియేషన్ ఎమిషన్ తగ్గిపోతుంది. దీంతో నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

    Smartphone Flight Mode Uses : యాడ్స్​ రాకుండా గేమ్స్ ఆడొచ్చు..
    ఫైట్​ మోడ్​ ఆన్​ చేయడం వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. దీంతో ఆన్‌లైన్ యాడ్స్ రావు. కాబట్టి ఫ్లైట్ మోడ్‌లో గేమ్స్ ఆడితే యాడ్ డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల క్లియర్ గేమింగ్ అనుభవం పొందవచ్చు. అలాగే ఫైట్​ మోడ్​ ఫీచర్​ ద్వారా డేటా సేవింగ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆ తర్వాత కేవలం Wi-Fi మాత్రమే ఆన్ చేయాలి. దీంతో మొబైల్ డేటా పూర్తిగా సేవ్ అవుతుంది. ఇలా ఈ ఫైట్​ మోడ్​ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

    ఇది కూడా చదవండి.. Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్​పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా?

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం అరట్టై యాప్ డౌన్​లోడ్స్​లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్​కు ఎన్​క్రిప్షన్​ అందుబాటులో ఉండగా.. చాట్​ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్‌ల కోసం వాట్సాప్ లాంటి ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్​ వెంబు తెలిపారు.‌

    Arattai End-to-End Chat Encryptionచివరి ఫీచర్​ టెస్టింగ్​!

    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్​ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ చివరి పరీక్ష దశలో ఉన్నట్లు సమాచారం. దీనిని వినియోగదారుల కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అందుబాటులోకి వచ్చినట్లయితే అరట్టై యాప్ వాట్సాప్‌కు మరింత బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వినియోగదారుల చాట్​లను లేదా డేటాను గోప్యంగా ఉంచుతుంది.‌

    ‌Arattai End-to-End Chat Encryption త్వరలో జోహో పే..!
    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు, UPI-ఆధారిత చెల్లింపు వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జోహో పేను ప్లాట్‌ఫామ్‌లోకి ఇంటిగ్రేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులు యాప్‌లోనే డబ్బు పంపడం, స్వీకరించడం తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఇది మనం వాట్సాప్‌ లాగే.. మల్టీ-యుటిలిటీ కమ్యూనికేషన్ సాధనంగా మారనుంది.

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్’​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

    US Nuclear Testing | ట్రంప్​ ఏమన్నారంటే..

    “ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు అమెరికా వద్దనే ఉన్నాయి. నా తొలి పదవీ కాలంలో దీనిని సాధించాం. అయితే ఈ ఆయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి వల్ల అప్పట్లో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఇందులో రష్యా రెండో స్థానంలో ఉండగా.. చైనా మూడో స్థానంలో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ మూడు దేశాలు సమాన స్థాయికి చేరే ఛాన్స్​ ఉంది. అందుకే మన దేశం తిరిగి అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్​కు ఆదేశాలు జారీ చేశా. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది” అని ట్రంప్‌ తెలిపారు.

    US Nuclear Testing తో ట్రంప్ తాజా​ వ్యాఖ్యలతో అమెరికా–రష్యా–చైనాల మధ్య అణు ఆయుధ పోటీ కొత్త దశకు చేరనున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రష్యా తన అణు సామర్థ్యాలను పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల రష్యా పరీక్షించిన పోసిడాన్ అణు డ్రోన్‌ సబ్‌మెర్సిబుల్‌ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించారు. అదే సమయంలో చైనా కూడా తన అణ్వాయుధాలను విస్తరించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ట్రంప్​ దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే.. ట్రంప్‌ ప్రకటించిన ఈ నిర్ణయంపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది.

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. బెస్ట్​ మైలేజ్​ ఇచ్చే వెహికిల్స్​పై ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. బెస్ట్​ మైలేజ్​ ఇచ్చే వెహికిల్స్​పై ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Budget Cars |కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సవరించడం కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కారు కొనాలనే కల నెరవేర్చుకుంటున్నారు. జీఎస్టీ తగ్గులతో ఇప్పటికే ఎంతో మంది కొత్త కార్లు కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది కొనుగోలుకు ప్లాన్​ చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉండడంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజీని అందించే కార్లపై ఓ లుక్కేయండి..

    ఎక్కువ మైలేజ్​ ఇచ్చే బెస్ట్ కార్లు ఇవే..

    చిన్న కార్లు చిన్న కుటుంబాలతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా సిటీ డ్రైవింగ్​కు కూడా అనువుగా ఉంటాయి. అందుకే పెద్ద కార్లతో పోలిస్తే వీటి సేల్స్​ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్​ ధరలో లభించడంతో పాటు అత్యధిక మైలేజ్​ ఇచ్చే కార్ల గురించి తెలుసుకుందాం.

    మారుతీ ఆల్టో K10

    రెనాల్ట్ క్విడ్

    దేశీయ మార్కెట్​లో అతి తక్కువ ధర కలిగిన కారు రెనాల్ట్ క్విడ్. సరసమైన కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూం ధర రూ. 4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ 999 సీసీ ఇంజిన్‌ ఉంటుంది. ఇది లీటర్‌కు 22.3 కిలోమీటర్ల మైలేజ్​ అందిస్తుంది. స్టైలిష్ లుక్, మంచి మైలేజీ, తక్కువ బడ్జెట్​లో లభించే బడ్జెట్ కారు.

    మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో

    మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనేది ఈ కంపెనీ అందిస్తున్న రెండో చౌకైన కారు. రూ. 5 లక్షల లోపు కారు కొనాలని భావించే వారికి మంచి ఛాయిస్​. Budget Cars లో ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూం ప్రైస్​ వచ్చేసి రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 998 సీసీ ఇంజిన్‌తో శక్తిని ఇస్తుంది. లీటర్​కు 25.3 కి.మీ. మైలేజ్​ అందిస్తుంది.

    బడ్జెట్​ ధరల్లో కారు కొనాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక అవుతాయి. అయితే కొనుగోలు చేసే ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకోని ముందుకు వెళ్లడం ఉత్తమం. ఇక మరో విషయం ఏమిటంటే.. ప్రాంతాల ఆధారంగా ఎక్స్‌ షోరూం ప్రైస్​ ధర, ఆన్ రోడ్ ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా వివిధ మోడల్స్‌, వేరియంట్లను బట్టి రేట్లు ఛేంజ్​ అవుతుంటాయి. అందుకే పూర్తి సమాచారం కోసం మీ సమీపంలోని షో రూంను సంప్రదించడం మంచిది.

    ఒకసారి ఈ క్రింది ఇంస్టాగ్రామ్ కొత్త ఫీచర్ గురించి కూడా తెలుసుకోండి.

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

    Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా ఏమైనా అని ఆలోచించారా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..

    ఆకాశంలో విమానాలు వెళ్తున్న సమయంలో తెల్లని గీతలు ఏర్పడుతుంటాయి. అయితే వీటిని “కాంట్రైల్స్” (Contrails) లేదా “కండెన్సేషన్ ట్రైల్స్” (Condensation Trails) అంటారని నిపుణులు చెబుతున్నారు. విమానాలు ఎగిరే ఎత్తు చాలా ఎక్కువగా ఉండడం వల్ల.. వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంటుందట. కానీ విమానం ఇంజన్లు మాత్రం అత్యంత వేడిగా.. 500 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి. అయితే Contrails ఈ వేడి వాయువులు చల్లని గాలిని తాకినసమయంలో వాటిలోని నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే చిన్న మంచు కణాలు కలసి తెల్లని చారలు రూపంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ తెల్లని గీతలనే వాస్తవానికి మంచు స్ఫటికాల సమాహారం. పొగ లేదా కాలుష్యం కావు.

    Contrails అన్ని విమానాల్లో ఇలాగే జరుగుతుందా..


    అన్ని విమానాలు ఇలాంటి కాంట్రైల్స్‌ను సృష్టించవని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రధానంగా.. విమానం ఎగురుతున్న ఎత్తు, ఇంజిన్ నుంచి వెలువడే వేడి, గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలు సరిగ్గా కలిసినప్పుడు సమయంలో మాత్రమే కండెన్సేషన్ ట్రైల్స్ ఏర్పడతాయట. అయితే విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరినా.. లేదంటే పొడి వాతావరణంలో ఉన్నా కూడా ఈ గీతలు కనిపించవని చెబుతున్నారు.

    ఇక నుంచి ఎప్పుడైనా విమానం వెళ్తున్న సమయంలో గీతలు కనిపిస్తే దానిని కాలుష్యం అనుకోకండి. అది కేవలం ఘనీభవించిన నీటి ఆవిరి మాత్రమే. తెలుసుకున్నారుగా సైన్స్​ ఎంత ఆశ్చరమైనదో.. గొప్పదో అని..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ సోషల్​మీడియా యాప్​ ఇన్​స్టాగ్రాం నయా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్​కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్​స్టా తీసుకున్న వచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఈ సమస్యకు చెక్​ పెట్టనుంది. ‘వాచ్​ హిస్టరీ’ ఫీచర్​ ద్వారా మనం గతంలో చూసి రీల్​ను మళ్లీ చూసేయవచ్చు. దీని గురించి తెలుసుకుందామా..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం. సామాన్య వినియోగదారుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. కొందరైతే గంటల కొద్దీ స్క్రోల్​ చేస్తూ గడిపేస్తున్నారు. అయితే, ఒకసారి స్క్రోల్ చేసిన తర్వాత ఆ రీల్‌ను మళ్లీ చూడాలనుకుంటే పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఇన్‌స్టా కొత్త ఫీచర్​ను లాంఛ్​ చేసింది. ఇది తన వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం ఉపయోగపడనుంది.

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఏమన్నారంటే..

    ఈ కొత్త ఫీచర్​పై ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సేరి ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో ఏమన్నారంటే.. “ఇకపై మీరు గతంలో చూసిన రీల్స్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఈ ఫీచర్‌ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

    ఎలా యాక్సెస్ చేయాలంటే..

    Instagram History Feature ఇన్​స్టా గ్రాం తీసుకున్న వచ్చిన కొత్త ఫీచర్​ను ఉపయోగించడం ఎంతో సులభం. ఈ స్టెప్స్​ ఫాలో అయితే గత రీల్స్​ జాబితాను చూసేయవచ్చు.

    • ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్​ చేయండి
    • సెట్టింగ్స్​లోకి (Settings) వెళ్లండి.
    • తర్వాత Your Activity ఎంపికను ఎంచుకోండి.
    • అక్కడ ‘వాచ్ హిస్టరీ’ (Watch History) అనే ఆప్షన్​ ఎంపిక కనిపిస్తుంది.
    • ఈ విభాగంలోకి వెళ్లాక.. మీరు గతంలో చూసిన రీల్స్ చేసేయవచ్చు.

    ఈ ఫీచర్ ఎందుకంటే..

    ఎంతో మంది వినియోగదారులు రీల్ చూస్తున్న టైం ఫోన్ కాల్ వచ్చినా లేదా యాప్‌ను రిఫ్రెష్ చేసినా.. ఆ రీల్‌ను తిరిగి దొరకక నిరాశకు గురవుతుండేవారు. ఈ సమస్యపై యూజర్స్​ నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇన్‌స్టా ఈ ఫీచర్​ను డెవలప్​ చేసింది. మీరు కూడా ఈ కొత్త ఫీచర్‌ను ట్రై చేయండి.. మీకు నచ్చిన రీల్స్‌ను సులభంగా తిరిగి చూసేయండి..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai