Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

Category: తాజా వార్తలు

  • X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్​ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​కు షాక్​ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్​కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు.

    X Chat | వాట్సప్​, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా..

    ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X Chatను లాంచ్ చేయనున్నారు. ఇందులో ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫాం.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​తో పాటు అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్స్​ కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ అలాంటి స్పెషల్​ ఫీచర్స్​ ఉండడం దీని ప్రత్యేకత.

    X Chat

    త్వరలోనే లాంఛ్​..

    ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌, ఆడియో, వీడియో కాల్స్​ వంటి ఫీచర్స్​తో కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎక్స్’ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే ఉద్దేశంలో ఉన్న మస్క్​.. త్వరలో ‘ఎక్స్ మనీ’ (X Money) కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. X Chatలో పంపిన మెసేజ్​లు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​ సౌకర్యం ఉంటుందని వివరించారు. కేవలం వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని పేర్కొన్నారు.

    ఎడిటింగ్​ ఆప్షన్​

    త్వరలో లాంఛ్​ చేయనున్న ఈ మెసేజింగ్ యాప్​లో యూజర్లు తాము పంపిన మెసేజ్​లను తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చు, లేదంటే డిలిట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని యాప్​ కల్పించనుంది. అవసరం అనుకుంటే డిసప్పియర్ చేసే వెసలుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్‌లో ఏదైనా సమాచారాన్ని డిలిట్ చేసినట్లయితే This Message was Deleted.. అని కనిపిస్తుంటుంది. కానీ ఎక్స్ చాట్​లో డిలిట్ చేసినట్లయితే ఇలా కనిపించదు.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: AI Jobs in India | ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ (AI) వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుండగా.. మన దేశంలోనూ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ ఒకప్పుడు ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు ఏఐ జాబ్స్ విషయంలో వెనుకబడుతోంది. బెంగళూరు లాంటి సిటీలు దూసుకెళ్తుండగా.. హైదరాబాద్​ వెనుకబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

    AI Jobs in India | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్..

    ప్రపంచంలో ఏఐ రాక ఒక విప్లవం. ఈ టెక్నాలజీతో కంపెనీలు ఆటోమేషన్‌ ద్వార ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో కొత్త స్కిల్స్ ఉన్నవాళ్లకు డోర్లు తెరుచుకుంటున్నాయి. భారత్‌లో AI Jobs in India 2025లో మరింత పెరిగాయి. మార్కెట్ $20 బిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్‌లో బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఎప్పుడూ ముందుండేవి. కానీ ఏఐ విషయంలో డైనమిక్స్ మారాయి. స్టార్టప్‌లు, ఆర్&డీ సెంటర్లు ఇక్కడే పుట్టుకొస్తుండగా.. డిస్ట్రిబ్యూషన్ అసమానంగా ఉన్నాయి.

    AI Jobs in India | టాప్‌లో ఉన్న నగరాలు ఏమిటంటే..

    తాజా రిపోర్టుల ప్రకారం.. AI Jobsలో బెంగళూరు 26 శాతం షేర్‌తో ముందుంది. ఇక్కడ వేలాది ఏఐ స్టార్టప్‌లు, ఎంఎల్ ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి. ఇక పుణె 17 శాతంతో రెండో స్థానం, ముంబై 13 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కేవలం 10 శాతంతో నాలుగో స్థానం నిలిచింది. అలాగే చెన్నై 7శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఆ తర్వాత ప్లేస్​లలో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో బలంగా ఉన్నా.. ఏఐ స్పెసిఫిక్ జాబ్స్‌లో మాత్రం వెనుకబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    AI Jobs in India

    AI Jobs in India | కొత్త పెట్టుబడులు

    విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్నట్లు అక్టోబర్​లో గూగుల్​ ప్రకటించింది. ఈ నిధులతో ఏఐ డేటా సెంటర్ స్థాపించనుంది. ఇది 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చనే అంచనాలున్నాయి. అదానీ గ్రూప్ కూడా పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీతో కలిసి పనిచేస్తోంది. హైదరాబాద్‌లో కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి ఉన్నాయి. కానీ ఏఐ ఫోకస్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. టైర్-2 సిటీలు ఇప్పుడు 14-16 శాతం ఏఐ హైరింగ్ చేస్తున్నాయి.

    హైదరాబాద్ పుంజుకుంటుందా..

    ఏఐ జాబ్స్​లో హైదరాబాద్ ప్రస్తుతం వెనుకబడినా.. వేగంగా పెరిగేందుకు అవకాశం ఉంది. టి-హబ్ లాంటి ఇన్‌క్యుబేటర్లు ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఓవరాల్ AI Jobs in Indiaను పెంచుతుంది. యువత ఏఐపై స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే.. హైదరాబాద్ తిరిగి టాప్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: sabarimala temple | శబరిమల అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. మండల-మకరవిళక్కు సీజన్​లో భాగంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు. కానీ సోమవారం తెల్లవారు జాము నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

    sabarimala temple | నేటి నుంచి భక్తులకు అనుమతి

    ఆలయ ప్రధాన పూజారి ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను నిర్వహించారు. పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్ల వద్ద అధి(పవిత్ర మంట)ని వెలిగించారు. కాగా.. ఆదివారమే ఆలయాన్ని తెరిచినా.. సోమవారం తెల్లవారుజామున అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరిచి తీర్థయాత్ర సీజన్​ను ప్రారంభించారు. నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తున్నారు. కాగా.. తీర్థయాత్ర సీజన్​కు సంబంధించిన ఏర్పాట్లను ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) పరిపాలనా కమిటీ పర్యవేక్షిస్తోంది.

    sabarimala temple | అందుబాటులో స్పాట్ బుకింగ్ కేంద్రాలు!

    ఆన్​లైన్​లో టికెట్లను బుక్ చేసుకుని ప్రతిరోజూ 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చు. పంబ, నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం, చెంగన్నూర్​లలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి ఆన్​లైన్ బుకింగ్ తప్పనిసరి చేశారు. దర్శన టికెట్లను sabarimalaonline.org వెబ్​సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక అయ్యప్ప ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

    sabarimala temple

    sabarimala temple | భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

    శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించారు. చిన్నారులు, మహిళల కోసం స్పెషల్​ క్యూ వ్యవస్థను తెచ్చారు. మాలికప్పురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలా ఏర్పాట్లు చేశారు.

    sabarimala temple | డిసెంబర్​ 27వ తేదీ వరకు..

    41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగియనుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు.

    ఇది కూడా చదవండి..: Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: vivo x300 | ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వివో తన “ఫ్లాగ్‌షిప్ X300” సిరీస్‌ను త్వరలో భారత్​లో లాంఛ్​ చేయనుంది. ఈ విషయాన్ని “X” వేదికగా సంస్థ ప్రకటన చేసింది. చైనాలో గత అక్టోబర్​లో రీలీజ్​ చేసిన ఈ సిరీస్​లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో “వివో X300″తో పాటు “X300 ప్రో” తీసుకొచ్చింది. అయితే త్వరలోనే భారత్​లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మోడళ్లకు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు వెల్లడించింది.

    vivo x300 | సూపర్​ ఫీచర్లతో..

    వివో “X300” సిరీస్​లో కీలక ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, V3+ ఇమేజింగ్ చిప్, ZEISSతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లతో భారత్​లో లాంఛ్​ చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ “X300” మోడల్​ను స్పెషల్​గా రెడ్ కలర్​లో తీసుకు రానున్నామని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ రెండు మోడల్స్​ డిసెంబర్ 2న భారతదేశంలో విడుదల కానున్నాయి.

    vivo x300

    vivo x300 | ప్రాసెసర్, పనితీరు..

    వివో తీసుకురానున్న రెండు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (3nm) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది V3+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. “ప్రో” మోడల్‌లో అదనపు “ప్రో ఇమేజింగ్ చిప్ VS1” సైతం ఉండనుంది. 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బాగుంటుంది. ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6పై రన్ అవుతంది.

    vivo x300 | కెమెరా ప్రత్యేకం..

    ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో కంపెనీ ఈ సిరీస్​లోని కెమెరా సిస్టమ్​ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. వివో “X300 ప్రో” మోడల్​లో 50MP (f/1.57) సోనీ LYT-828 మెయిన్ (ZEISS గింబాల్ – గ్రేడ్), 50MP (f/2.0) శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్, 200MP (f/2.67) HPB APO టెలిఫొటో ఫీచర్​తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇక స్టాండర్డ్ “X300” మోడల్​లో 200MP (f/1.68) HPB మెయిన్ (OISతో), 50MP (f/2.57) సోనీ LYT-602 టెలిఫొటో (OISతో), 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఈ రెండు మెడళ్లలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం 50MP (f/2.0) శాంసంగ్ JN1 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్​లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​ మూవీ టీం మహేశ్ పోస్టర్​తో పాటు టైటిల్, గ్లింప్స్​ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్​ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. నందీశ్వరుడిపై మహేశ్​ బాబు విజువల్స్​ అదరగొట్టాయి.

    Varanasi Movie | నందీశ్వరుడిపై మహేశ్​ ఎంట్రీ

    ఈవెంట్​లో స్టేజ్​పైకి మహేశ్ ఎంట్రీ నెక్ట్స్ లెవెల్​గా నిలిచింది. ఆయన సినిమా క్యాస్టూమ్ ధరించి నందీశ్వ‌రుడిపై కూర్చుని ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 50 ఫీట్ల ఎత్తులో క్రేన్​పై నిల్చుని అభిమానుల‌కు అభివాదం చేశారు. భారీ పబ్లిక్ ఈవెంట్​లో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఏ హీరోకైనా గ్రేట్ అచీవ్​మెంట్ అనే చెప్పాలి.

    Varanasi Movie

    Varanasi Movie | నా డ్రీమ్​ ప్రాజెక్టు

    గ్లోబ్​ ట్రాటర్​ ఈవెంట్​కు హాజరైన మహేశ్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇది ఒక నటుడికి లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ లాంటిందని పేర్కొన్నారు. ‘మీ అందర్నీ (ఫ్యాన్స్​) కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడకు నార్మల్​గానే వస్తానని చెప్పాను. కానీ, రాజమౌళి కుదరదని చెప్పి నాతో ఇలా స్పెషల్​గా చేయించారు. నన్ను పౌరాణిక సినిమా చేయ‌మ‌ని నాన్న‌గారు చాలాసార్లు అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు. ఈ సినిమా కోసం ఎంత కావాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అంద‌రూ గర్వించేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళి గారిని’ అని మహేశ్​ పేర్కొన్నారు.

    ‘వార‌ణాసి విడుద‌లైన అనంతరం దేశం మొత్తం గ‌ర్వంగా ఫీల‌వుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే. మున్ముందు ఎలా ఉండ‌బోతోందనేది మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా. మీ మద్దతు ఎల్లపుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌ అనేది చాలా చిన్న మాటే. మీ అభిమానం మాటల్లో చెప్పలేను. ఈవెంట్‌ సజావుగా సాగడానికి సహకరించిన పోలీసు శాఖకు నా ధన్యవాదాలు’ అని మహేశ్ అన్నారు.

    Varanasi Movie

    Varanasi Movie | రాముడిగా మహేశ్‌..: రాజమౌళి

    దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ప్రారంభించే ముందు ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా విశేషాలు చెబుతాను. అయితే, అన్నింటికీ చెప్పలేదు. కథకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా అది జరుగుతుంది. ఈ మూవీ గురించి మాటల్లో చెప్పలేం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక మాట చెప్పకుండా వీడియో చేద్దామని భావించాం. మార్చిలో ఈవెంట్‌ నిర్వహించి విడుదల చేద్దామని అనుకున్నా కుదరలేదు. జూన్‌, జులై నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు నవంబరు 15న మీ ముందుకు ఈ వీడియోను తెచ్చాం’ అని అన్నారు.

    ‘‘చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం నాకు అంతగా తెలియదు. ఎక్కువగా ఎన్టీఆర్‌ సినిమాలు చూస్తుండేవాడిని చూసేవాడిని. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే కృష్ణగారి గురించి అర్థమైంది. ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల వల్లనే పరిచయమైంది. మనం తీసే సినిమాలను స్కోప్​లో తీసి.. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు బ్లో అప్‌ చేస్తాం. కానీ అది నిజమైన ఐమ్యాక్స్‌ కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను అసలైన ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈవెంట్‌ కోసం మా టీం ఎంతో కష్టపడింది. మేం విడుదల చేసే వీడియో చూసి, ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలవ్వాలని అనుకున్నాం.’

    ‘ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. సినిమాలో మహేశ్‌బాబు పాత్ర.. ఇందుకు ఆయన పడిన కష్టం గురించి ప్రస్తుతం మాట్లాడను. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతా.. మహేశ్​ నుంచి నేర్చుకునే లక్షణం ఒకటి ఉంది. మనం సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేం. కానీ, మహేశ్‌బాబు షూటింగ్‌కు వస్తే.. అస్సలు మొబైల్​ చూడరు. కారులోనే ఫోన్‌ను పెట్టేసి వస్తారు. ఏడెనిమిది గంటలైనా దాని జోలికి పోరు. నేను కూడా అలా ఉండేందుకు ప్రయత్నిస్తా. అది కచ్చితంగా నేర్చుకుంటా’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

    ఇది కూడా చదవండి..: Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

    Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Prashant kishor | ప్రశాంత్​ కిషోర్​.. దేశ రాజకీయాల్లో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని అనేక పార్టీలను గెలుపు తీరాలకు చేర్చారు. దేశంలో చాలా పార్టీలు ఆయనతో పనిచేసేందుకు ఆరాటపడుతుండేవి. అయితే తాజాగా ఆయన పరిస్థితి ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లు’గా మారింది. ఎందుకంటే ఆయన స్థాపించిన జన్​ సురాజ్​ పార్టీ బీహార్​ డకౌట్​ అయ్యింది. 238 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది.

    Prashant kishor | బొక్కబోర్లా పడ్డ జన్​సురాజ్​ పార్టీ

    బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకుమించి ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. 200లకు పైగా సీట్లు దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్​ బంధన్​ కూటమి 35 సీట్లకే పరిమితమైంది. ఇక ప్రశాంత్​ కిషోర్ (Prashant kishor)​ పార్టీ ఖాతా కూడా తెరవకుండా బొక్కబోర్లా పడింది. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీతో (I-PAC) వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలను అధికారంలో తీసుకురావడంలో పీకే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.

    Prashant kishor | ఐ-ప్యాక్‌‌తో ఫేమస్..

    ప్రశాంత్ కిషోర్ గతంలో ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) స్థాపించారు. వివిధ దేశాల ఎన్నికల్లో అనుసరించే ప్రచార శైలిని భారత్‌లో తీసుకువచ్చారు. దశాబ్ద కాలానికి పైగా వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. సమాచార విశ్లేషణ ఆధారిత విధానాలు అవలంభించడం, బూత్‌ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అస్త్రాలతో పార్టీలను విజయ తీరాలకు చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పని చేసిన పీకే.. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, బీహార్ నీతీశ్‌ కుమార్‌ గెలుపునకు పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్‌లో అమరీందర్ సింగ్, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పనిచేసి.. ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.

    Prashant kishor

    Prashant kishor | వ్యూహాలు విఫలం

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి విజయ ఢంకా మోగించింది. ఎన్నికల ముందు ఎన్డీఏ, మహాగఠ్​ బంధన్​ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని భావించారు. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ కూడా గణనీయమైన మార్పుకు కారణం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తాజా ఫలితాల్లో జన్‌సురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. తన వ్యూహ చతురతతో దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలకు గెలుపు అందించిన ప్రశాంత్ కిషోర్ పాచికలు.. స్వరాష్ట్రంలో పారలేదు.

    Prashant kishor | సొంత రాష్ట్రంలో పారని పాచికలు

    ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తన సొంత రాష్ట్రంలో రివర్స్ అయ్యాయి. రాష్ట్రంలో వలసలు తగ్గించి, నిరుద్యోగం లేకుండా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అభివృద్ధిలో వెనకబడిపోయిన రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అయినా కూడా బీహారీలు ఆయన వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన ప్రయోగించే అస్త్రాలైన సమాచార ఆధారిత ప్రచారం, సోషల్ మీడియా, బూత్ స్థాయి నిర్వహణ ఇవేవీ పనిచేయలేదు. ఎన్నికలకు రెండు, మూడేళ్ల నుంచే సన్నద్ధం అయినా ఓటర్లలో నమ్మకం కల్పించడంలో విఫలమయ్యారు.

    ఇది కూడా చదవండి..: Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

  • WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: WhatsApp New Feature | మెటా మేసేజింగ్​ యాప్​ వాట్సాప్ ఒక సంచలన ఫీచర్‌ను (WhatsApp New Feature) తీసుకురాబోతోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్‌తోనే గుర్తింపు ఇచ్చే వాట్సాప్.. ఇక నుంచి మీ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌ను కూడా అందులో వాడుకోవడానికి అవకాశం కల్పించనుంది. ఈ కొత్త యూజర్‌నేమ్ సిస్టమ్ మెటా ఖాతాలతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. అంటే, ఒకే యూజర్‌నేమ్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మూడింటా లాగిన్ కావొచ్చు..

    ఈ ఫీచర్ గురించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ దీనిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం.. వినియోగదారులు తమ ఇన్‌స్టా లేదా ఎఫ్‌బీ యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లోనూ రిజిస్టర్ చేసుకునే సౌలభ్యం త్వరలోనే వస్తుంది.

    WhatsApp New Feature

    WhatsApp New Feature | యూజర్‌నేమ్ ఫీచర్ అంటే ఏమిటి..?

    వాట్సాప్‌లో ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాళ్ల ఫోన్ నంబర్ తప్పనిసరి. కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) లాగా ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ (@username) సృష్టించుకోవచ్చు. దీంతో ఎవరికైనా చాట్ ప్రారంభించడానికి నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కేవలం యూజర్‌నేమ్ చూపిస్తే చాలు!

    WhatsApp New Feature | ఇలా పనిచేయనుందంటే..

    వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.34.3లో ఈ ఫంక్షన్‌ను టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగిస్తున్న యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ దీనికి తప్పనిసరిగా ‘వెరిఫికేషన్’ చేయించుకోవాల్సి ఉంటుంది.

    WhatsApp New Feature

    WhatsApp New Feature | వెరిఫికేషన్ ప్రాసెస్ ఇలా..

    • మెటా అకౌంట్ సెంటర్ ద్వారా మీ యూజర్‌నేమ్‌ను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
    • వాట్సాప్ యాప్‌లో యూజర్‌నేమ్ ఎంచుకున్నప్పుడు ఆటోమాటిక్‌గా వెరిఫై అవసరమని అడుగుతుంది.
    • వెరిఫికేషన్ పూర్తయితే, ఆ యూజర్‌నేమ్ వాట్సాప్‌లో శాశ్వతంగా ఫిక్స్​ చేస్తుంది. దీంతో మరెవరూ ఈ యూజర్​ నేమ్​ను క్లెయిమ్ చేయలేరు.

    ఇది కూడా చదవండి..: Ola EV car | టాటా, ఎంజీలకు షాక్​.. చౌకైన ధరలో కారును అందుబాటులోకి తేనున్న ఓలా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి.

    Delhi Car Blast |సాయంత్రం సమయంలో..

    పేలుడు సాయంత్రం 6:55 గంటల సమయంలో అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేశాయి. పేలుడు ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ఈ-రిక్షాలు, ఆటోరిక్షాలు కాలి బూడిదయ్యాయి. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి.

    కాగా.. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్, క్లూస్ టీంలతో పాటు ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం కావడంతో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటాయి. దీంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సింఘు, టిక్రీ, బదర్‌పూర్ వంటి కీలక పాయింట్లలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఇతర సున్నిత ప్రదేశాల్లో నిఘా పెంచారు.

    Delhi Car Blast |ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కేంద్ర హొం మంత్రి అమిత్​ షా చేరుకున్నారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

    Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Ande Sri | నేలకొరిగిన సాహితీ శిఖరం.. ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత

    Ande Sri | నేలకొరిగిన సాహితీ శిఖరం.. ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Ande Sri | సాహితీ శిఖరం నేలకొరిగింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీ (64) (Ande sri) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7.25 గంటలకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

    Ande Sri | అందెశ్రీ ప్రస్థానం

    అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో పుట్టారు. గొర్రెల కాపరిగా తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్న వాడు..’ గీతంతో పేరు తెచ్చుకున్నారు. కాకతీయ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర గీతంగా గుర్తించింది. అంతే కాకుండా ఇటీవల ఆయనకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.

    Ande Sri | దక్కిన పురస్కారాలు

    అందెశ్రీ దిట్ట 2006 సంవత్సరంలో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం దక్కింది. ఇక 2014లో అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం వరించింది. అలాగే రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం దక్కించుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ లోక్‌నాయక్‌ పురస్కారాన్ని పొందారు.

    Ande Sri | దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్​రెడ్డి

    అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచించిన అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన గేయం కోట్ల మంది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. అందెశ్రీకి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహింంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

    ఇది కూడా చదవండి..: Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • credit card payment | క్రెడిట్ కార్డు బిల్‌లో మినిమమ్ డ్యూ కడుతున్నారా.. ఇలా చేయడం మంచిదేనా? సిబిల్ స్కోర్ పడిపోతుందా..!

    credit card payment | క్రెడిట్ కార్డు బిల్‌లో మినిమమ్ డ్యూ కడుతున్నారా.. ఇలా చేయడం మంచిదేనా? సిబిల్ స్కోర్ పడిపోతుందా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: credit card payment | ప్రస్తుత కాలంలో క్రెడిట్​ కార్డుల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. మాల్స్​, షోరూంలు, సూపర్​ మార్కెట్స్​ ఎక్కడికి వెళ్లినా క్రెడిట్​ కార్డుల ద్వారానే ప్రజలు బిల్లులు చెల్లింపులు చేస్తున్నారు. అయితే బిల్లు జనరేట్​ అయ్యాక చాలా మంది ఫుల్​ పేమెంట్​ చేస్తున్నా.. కొందరు మినిమమ్ డ్యూ కడుతుంటారు. అయితే ఇలా మినిమమ్ డ్యూ కట్టడం మంచిదేనా? దీని వలన సిబిల్ స్కోర్ పడిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం..

    నేటి కాలంలో చేతిలో డబ్బులు లేకపోయినా క్రెడిట్​ కార్డు ఉండడంతో ఏ వస్తువులైనా కొనుగోలు చేస్తున్నాయి. అయితే చాలా మంది సకాలంలో బిల్ పేమంట్ చేయలేక మినిమమ్ డ్యూ చెల్లిస్తుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల క్రెడిట్​ స్కోర్​ దెబ్బతింటుందని, అలాగే మీరు కట్టే అమౌంట్​ ఇంట్రస్ట్​ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్​ కార్డు బిల్ పేమెంట్స్​​ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    credit card payment | మినిమమ్ డ్యూ అంటే..

    క్రెడిట్ కార్డు బిల్ పూర్తి పేమెంట్ చేయలేని వారికి వివిధ పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. మినిమమ్ పేమెంట్, పూర్తి అమౌంట్ కట్టడం, అదర్ అమౌంట్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. అయితే సకాలంలో బిల్ పే చేయలేని వారు మినిమమ్ డ్యూ కడుతుంటారు. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అసలు బిల్లులో 5 శాతాన్ని, మినిమమ్ డ్యూ గా చెల్లించేందుకు అనుమతిస్తాయి. బ్యాంకును బట్టి వీటిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

    credit card payment | లేట్​ ఫీ, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట

    క్రెడిట్ కార్డు యూజర్లు కొందరు మినిమమ్ డ్యూ కట్టడం వల్ల ఏ ఇబ్బంది ఉండదని భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. మినిమమ్ అమౌంట్​ పేమెంట్ చేయడం వలన కేవలం లేట్ ఫీజు, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట కలుగుతుంది. అయితే మీరు చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీని పడుతుంది.

    credit card payment | సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా?

    మినిమమ్ డ్యూ ఎక్కువ సార్లు పేమెంట్​ చేయడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అధిక వడ్డీలు, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా మీ అప్పు అనేది కూడా పెరిగిపోతుంది. అందుకే మినిమమ్ డ్యూ కట్టకపోవడం మంచిదంటులున్నారు. అదనపు ఛార్జీలు పడకుండా ఉండాలంటే మొత్తం బిల్ ఒకేసారి చెల్లించడం సరైందని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా ఉండడం మూలంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోపై ప్రభావం చూపింది. దీని వలన సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉంటుంది. మినిమమ్ డ్యూ చాలా కాలంగా ఉంచడం వల్ల అప్పు పెరగడం, అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. దీంతో సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది.

    ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. 

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai