Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

Category: తాజా వార్తలు

  • Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

    Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Custard Apple | చలికాలం వచ్చిందంటే.. సీతాఫలాలు విరివిరిగా లభ్యమవుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. గుల్లలు గుల్లలు తెచ్చుకుని ఇంట్లో మగ్గబెట్టుకుని పొద్దునా, సాయంత్రం తినేవాళ్లం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండును లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటిని చూస్తే తినాలని మనసు ఇట్టే లాగేస్తుందంటే అతిశయోక్తి కాదు. వీటి రుచి అలా ఉంటుంది మరి. రుచి ఒకటే కాదు.. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి.

    Custard Apple | ఒత్తిడి దూరం..

    సీతాఫలాన్ని ఒక్కోచోట ఒక్కోలా పలుకుతారు.. చిత్తలపండు, చిత్తలకాయ, చిత్పలకాయ ఇలా ఎవరు ఎలా పిలిచినా.. దీని రుచి మాత్రం అమోఘం. వీటిని తినడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు సైతం దరి చేరకుండా ఉంటాయి. అలాగే గాయాలు కూడా త్వరగా మానుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా మలబద్ధం సైతం తగ్గుతుంది. ఇవి ఒంటికి చలవ చేస్తాయి. అందుకే సీజన్​లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. వీటి వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. కండరాలు, నరాల బలహీనత తగ్గడానికి సైతం సీతాఫలం తోడ్పడుతుంది.

    Custard Apple

    Custard Apple | పోషకాలు అధికం..

    సీతాఫలంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కస్టర్డ్ యాపిల్ (Custard Apple) అని పిలిచే ఈ ఫలంలో ఐరన్, మెగ్రీషియం, పాస్ఫరస్​లతో పాటు విటమిన్-సి (Vitamin-C) సైతం సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల సీతాఫలంలో 68.6 గ్రాముల తేమ, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.6 గ్రాముల కొవ్వు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

    Custard Apple | డయాబెటిస్​ ఉన్న వాళ్లూ తినొచ్చు..

    మధుమేహం (Diabetes) ఉన్నవాళ్లు మితంగా ఈ పండుని తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇన్‌ ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తుందంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, విటమిన్‌-ఏ, సీ (Vitamin A) ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే సీతాఫలం తినడం ద్వారా జలుబు చేస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు.

    Custard Apple | అనారోగ్య సమస్యలుంటే దూరం ఉండడం మంచిది..

    ఈ పండును కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు దీనిని తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు సీతాఫలం తినొద్దని పేర్కొంటున్నారు.

    ఇక సీతాఫలంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వైద్యులు రక్తహీనతతో బాధపడుతున్న దీనిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇది అలసటను సైతం దూరం చేస్తుంది. సీతాఫలంలోని పీచు పదార్థం టాక్సిన్స్​ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాక ఎసిడిటీ లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకేం.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఈ సీతాఫలాన్ని ఈ సీజన్​లో ఆస్వాదిద్దాం మరి..

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

    Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు ఇజ్రాయిల్​ అత్యున్నత పురస్కారం అందజేయనుంది. గాజా ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. గాజా ఒప్పందం.. బందీల విడుదలకు కృషి చేసినందుకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ (Presidential Medal of Honor)ను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ తెలిపారు. త్వరలో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు ప్రకటింటించారు. డొనాల్డ్​ ట్రంపు ఈ గౌరవాన్ని అందుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత కోసం కృషి తాము ఈ విధంగా గౌరవిస్తున్నట్లు తెలిపారు.

    Donald Trump | గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్​

    ఇజ్రాయిల్ – హ‌మాస్ మ‌ధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం ముగిసింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్ర‌క‌టించారు. గాజా శాంతి ఒప్పందం (Gaza Peace Agreement) కోసం పశ్చిమాసియాకు బయలుదేరిన వేళ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇజ్రాయిల్‌కు వెళ్లే మార్గంలో ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్ప‌టికే అనేక యుద్ధాల‌ను ఆపాన‌ని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను కూడా నిలువ‌రిస్తానంటూ చెప్పుకొచ్చారు.

    Donald Trump | నోబెల్ బహుమతిపై కీలక వ్యాఖ్యలు

    అనేక దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నిలువ‌రించాన‌ని ట్రంప్‌ మ‌రోసారి చెప్పారు. యుద్ధాలు ఆపాడంలో తాను స్పెషలిస్టున‌ని వ్యాఖ్యానించారు. అయినా తనకు నోబెల్ బ‌హుమ‌తి ఎందుకు రాలేదో తెలియ‌ద‌ని పేర్కొన్నారు. అయినా కూడా తమ శాంతి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజా శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతూ.. అన్ని పార్టీలను సంతోషపెట్టామని తెలిపారు. ఈజిప్టును సందర్శించి, మధ్యప్రాచ్య పరిస్థితిపై సైతం చర్చించడానికి ప్రాంతీయ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. ‘మేం అందరినీ సంతోషపెట్టబోతున్నాం.. యూదులు అయినా, ముస్లింలు అయినా, అరబ్ దేశాలైనా..’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ తర్వాత ఈజిప్టు దేశానికి వెళ్తున్నా. శక్తివంతమైన, పెద్ద దేశాలు, ధనిక దేశాలు, నాయకును కలవబోతున్నా వారందరూ ఈ ఒప్పందంలో ఉన్నారు” అని పేర్కొన్నారు.

    Donald Trump | రష్యా రాజీకి రాకపోతే వాటిని రంగంలోకి దించుతాం

    ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై కూడా ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేవారు. ఈ యుద్ధం పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మాస్కో రాజీకి రాకపోతే.. కీవ్‌కు తోమహాక్‌ క్షిపణులను అందజేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఆదివారం ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీతో ట్రంప్‌ మాట్లాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Green chilli | పచ్చి మిర్చి ఘాటుగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

    Green chilli | పచ్చి మిర్చి ఘాటుగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​​డెస్క్​: Green chilli | భారతీయ సంప్రదాయంలో పచ్చిమిర్చి (Green chilli) లేకుండా వంట అసంపూర్ణమే అని చెప్పారు. ఎందుకు దాదాపు అన్ని వంటకాల్లో పచ్చిమిర్చి వాడుతుంటాం. అయితే పచ్చి మిరపకాయలు రుచికి కారంగానే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయనే విషయం తెలుసుకోవాలి. పచ్చి మిరపకాయలను ఆహారంలో తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా కలిగే తెలుసుకుందాం!

    Green chilli | విటమిన్లు ఇవే..

    ఒక కప్పు పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి (52.76 శాతం), సోడియం (36.80 శాతం), ఇనుము (23.13 శాతం), విటమిన్ బి9 (18.29 శాతం), విటమిన్ బి6 (12.85 శాతం) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదనంగా, ఇందులో విటమిన్లు A, B, C, E, P, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

    పచ్చిమిర్చిలో విటమిన్ సితో పాటు క్యాప్సైసిన్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె, రక్తపోటును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయని, కంటి చూపును మెరుగుపరుస్తాయని అంటున్నారు నిపుణులు.

    Green-chilli

    Green chilli | పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు..

    పచ్చి మిర్చిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ (Flavonoids), కెరోటినాయిడ్స్ (carotenoids) తదితర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయట. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. వీటిలో విటమిన్​ ఎ, బి2, బి3, బి6, బి9, సి, ఇ ఉంటాయని పేర్కొంటున్నారు. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడంతో.. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ను (Free radicals) నుంచి రక్షణ కల్పిస్తుందని National Library of Medicine అధ్యయనంలో తేలింది.

    Green chilli | వెయిట్​ తగ్గేందుకు దోహదం..

    పచ్చి మిర్చి అనేది జీవక్రియను వేగవంతం చేసి, ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ కొవ్వును కరిగించడంతో పాటు కొవ్వు నిల్వలు ఏర్పడకుండా నిరోధిస్తుందట. అంతేకాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగించడం వల్ల అతిగా తినకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.

    Green chilli | షుగర్​ను అదుపులో ఉంచుతుంది..

    మిరపకాయల్లోని కార్బోహైడ్రేట్ల (Carbohydrates) వల్ల జీర్ణక్రియ నెమ్మదించడంతో పాటు ఇన్సులిన్ (Insulin) ఉపయోగాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటుందట. దీంతో రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. మిరపకాయలు ఒబెసిటీ, షుగర్​, గుండె సంబంధ రుగ్మతల చికిత్సకు సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని ఓ అధ్యయనంలో తెలిసింది.

    Green chilli | గుండె ఆరోగ్యానికి మంచిది..

    పచ్చి మిరపకాయలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను (Cholesterol level) నియంత్రించడం లాంటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి రక్తనాళాల్లో ఇన్​ఫ్లమేషన్​ను సైతం తగ్గిస్తాయట. దీంతో గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుందంటున్నారు. ఇలా మోతాదులో పచ్చి మిరపకాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటికి అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్‌.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!

    AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్‌.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: AI-powered video game | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. త్వరలో గేమింగ్​ రంగంలోనూ విస్తృతంగా ఉపయోగంలోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​లో ప్రముఖ సంస్థ అయిన ఎలన్​ మస్క్​కు చెందిన xAI.. 2026లో వినూత్నమైన ఏఐ ఆధారిత వీడియో గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించనున్న ఈ గేమింగ్స్​.. గేమర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

    xAIకి చెందిన ఈ నూతన ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ వీడియో గేమ్.. AI ఆధారిత డైనమిక్ స్టోరీలైన్‌లు, ఇంటరాక్టివ్ పాత్రలు, వినియోగదారుల ఆటతీరుకు అనుగుణంగా మారే గేమ్‌ప్లేను కలిగి ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. xAI గ్రోక్ (Grok) AI, ఇప్పటికే వివిధ రంగాల్లో వినియోగదారులకు సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ గేమింగ్​ ప్రాజెక్టు కోసం కూడా గ్రోక్ సామర్థ్యాలను ఉపయోగించునే అవకాశం ఉందని తెలుస్తోంది.

    AI-powered video game | టెక్​ పరిశ్రమలో ఆసక్తి

    xAI రూపొందించనున్న ఈ ఏఐ గేమింగ్​ ప్రాజెక్టు (AI-powered video game) పట్ల టెక్ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. గేమింగ్ పరిశ్రమలో AI పాత్ర గురించి చర్చలు ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే xAI ప్రవేశపెట్టనున్న గేమింగ్ విధానం.. ఆటగాళ్లలు, డెవలపర్లకు కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇవన్ని టెక్​ పరిశ్రమలో వస్తున్న ఊహాగానాలు.. వీటిపై xAI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • Crypto Market | ఎంత పనిచేవయ్యా​ ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్​ క్రాష్​ చేశావ్​గా..!

    Crypto Market | ఎంత పనిచేవయ్యా​ ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్​ క్రాష్​ చేశావ్​గా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Crypto Market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన క్రిప్టో కరెన్సీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. చైనాపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తానంటూ ఆయన ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ భారీగా క్రాష్ అయింది. బ్లూమ్‌బెర్గ్ (Bloom berg) నివేదిక ప్రకారం.. క్రిప్టో ట్రేడర్లు రూ.68 లక్షల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాయిన్​ గ్లాస్​ డేటా ఆధారంగా.. కేవలం గత 24 గంటల్లో 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్ అయినట్లు నివేదిక తెలిపింది. అనగా.. వారి ఇన్వెస్ట్​మెంట్లు ఆటోమేటిక్‌గా అమ్ముడైపోవడంతో నష్టపోయారు. అతిపెద్ద క్రిప్టో మార్కెట్​ క్రాష్​లలో ఇదీ ఒకటిగా మారింది.

    Crypto Market | బిట్‌కాయిన్, ఈథర్ నేల చూపులు

    క్రిప్టో మార్కెట్​లోని దాదాపు అన్ని కరెన్సీలు పడిపోయాయి. బిట్‌కాయిన్ (Bit coin) రూ.1,22,000 నుంచి రూ.1,07,000కు పడిపోయింది. ఇథేరియం (ethereum) రూ.3,700 కంటే దిగువకు వచ్చిఒంది. ఎక్స్​ఆర్​పీ (XRP), సొలన (Solana), డిజీ కాయిన్​ (Dogecoin) 20-30 శాతం వరకు క్షీణించాయి.

    Crypto Market | ట్రంప్​ ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు..

    చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో పాటు మరిన్ని కారణాలు క్రిప్టో మార్కెట్​ కుంగేలా చేశాయి. అలాగే 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్​ అయ్యాయి. ఇది కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. బిట్​ కాయిన్​ సైతం ఆల్​ టైం హైకి చేరుకోవడం వలన ప్రాఫిట్​ బుకింగ్​ చేసుకోవడం కూడా క్రిప్టో క్రాష్​కు కారణమైంది.

  • Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

    Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Trump tariffs on china | రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన డిసిషన్​ తీసుకున్నారు. ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై వంద శాతం టారిఫ్​లు (Trump tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు తన సోషల్​ మీడియా వేదిక ట్రూత్​లో పోస్టు చేశారు. ఇది ప్రస్తుత్తం విధిస్తున్న టారిఫ్​లకు అదనం.

    అంతేకాకుండా అమెరికాలో తయారైన కీలకమైన సాఫ్ట్​వేర్​లపై కఠినమైన ఎగుమతి నియంత్రణ అమలు చేస్తామంటూ పేర్కొన్నారు. ట్రంపు తాజా నిర్ణయంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరీ తీవ్రంగా మారే అవకాశం నెలకొంది.

    Trump tariffs on china | అందుకేనా ఈ నిర్ణయం..

    చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో (International trade) అసాధారణంగా దూసుకొస్తుందంటూ ట్రంప్​ పేర్కొన్నారు. “చైనా వాణిజ్యంలో అసాధారణంగా దూకుడుతో పాటు ప్రపంచానికి శత్రుత్వపూరితమైన లేఖ రాసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు వారు తయారు చేయని వాటిపై కూడా నవంబర్ నుంచి భారీగా ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ విధిస్తున్నారు. దీనికి ప్రతిస్పందంగానే అమెరికా ఆ దేశంపై 100 శాతం టారిఫ్ విధిస్తుంది. ఇవి ప్రస్తుతం అమలవుతున్న టారిఫ్‌లకు అదనం. అంతేకాకుండా అన్ని క్రిటికల్ సాఫ్ట్‌వేర్స్​పై ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ అమలు చేస్తాం.” అంటూ రాసుకొచ్చారు. చైనా తన రేర్​ ఎర్త్​ మినరల్స్​పై ఎగుమతి నియంత్రణలను పెంచడం సైతం ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైందని తెలుస్తోంది. తాజా టారిఫ్​లతో ఎలక్ట్రానిక్స్​ నుంచి ఎలక్ట్రిక్​ వాహనాల దాకా చాలా రంగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

    Trump tariffs on china | రేర్ ఎర్త్ మినరల్స్‌పై చైనా ఆంక్షలు

    చైనాలో లభించే రేర్​ ఎర్త్ మినరల్స్​ (), కీలక ఖనిజాల ఎక్స్‌పోర్ట్‌లపై కొత్త నియంత్రణలు ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలో ఉత్పత్తి చేసిన లేదా చైనా టెక్నాలజీతో తయారు చేసిన 0.1 శాతం కన్నా ఎక్కువ రేర్ ఎర్త్‌ మినరల్స్​ ఉన్న ఉత్పత్తుల ఎగుమతి కోసం విదేశీ సంస్థలకు లైసెన్స్ తప్పనిసరి చేసింది. ప్రపంచంలో 70 శాతం రేర్ ఎర్త్‌ మినరల్స్​ చైనా నియంత్రణలోనే ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రాడార్ సిస్టమ్‌లు, జెట్ ఇంజన్‌ల తయారీలో కీలకం. వీటిపై నియంత్రణ విధించడంతో అమెరికా ఈ చర్యకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

    Trump tariffs on china | వాణిజ్య యుద్ధం..

    అమెరికా – చైనా (US – China) మధ్య కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోసారి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభింస్తుందనే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సగటు టారిఫ్ రేటు 40 శాతంగా ఉంది. ఈ అదనపు టారిఫ్‌తో మొత్తం 140 శాతానికి చేరవచ్చు.

    కాగా.. ఈ పరిణామంతో ట్రంప్, జిన్‌పింగ్‌ మధ్య ఈ నెల చివరలో దక్షిణ కొరియాలో జరిగే ఏపెక్ సమ్మిట్​కు ముందు జరిగే సమావేశం రద్దు కావొచ్చనే సూచనలు వెలువడుతున్నాయి.

  • Credit cards | వామ్మో ఏం వాడకమయ్యా సామి..

    Credit cards | వామ్మో ఏం వాడకమయ్యా సామి..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్: Credit cards | నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

    సూపర్​మార్కెట్​కు (Super market) వెళ్లినా, షాపింగ్​ మాల్​కు (Shopping mall) వెళ్లినా, రెస్టారెంట్​కు (Restaurant) వెళ్లినా ఇలా అన్ని చోట్లా ప్రజలు క్రెడిట్​ కార్డులు వాడుతున్నారు.

    అంతలా అలవాటు పడిపోయారు. అయితే సాధారంగా ఓ వ్యక్తి ఐదు నుంచి పది కార్డులు ఉంటే ఎక్కువ. కానీ ఈ వ్యక్తి వద్ద ఉన్న క్రెడిట్​ కార్డులెన్నో తెలిస్తే నోరెళ్లబెడతారు.

    Credit cards | వందల కార్డులు

    హైదరాబాద్​కు చెందిన మనీష్ ధమేజా అనే వ్యక్తి దగ్గర ఏకంగా 1,638 క్రెడిట్​ కార్డులు ఉన్నాయి. ఏంటి నిజమేనా అనుకుంటున్నారా.. నిజ్జంగా నిజమేనండి.. ప్రపంచంలో ఇన్ని కార్డులు ఏకైక వ్యక్తి ఈయనే. ఇన్ని క్రెడిట్​ కార్డులు వాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (guinness world record) చోటు సంపాదించుకున్నాడు. ఈ ఘనత సాధించిన వ్యక్తి తెలంగాణ వాసి కావడం హాట్ టాపిక్​గా మారింది. అయితే మనీష్ అన్ని వందల కార్డులు ఎలా మెయింటెన్​ చేస్తున్నాడనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.

    Credit cards | అప్పటి నుంచి..

    2016లో నోట్లు రద్దు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది క్యాష్​ కోసం ఇబ్బందులు పడ్డారు. మనీష్​కు సైతం అందరిలాగే కరెన్సీ నోట్ల సమస్య రావడంతో క్రెడిట్​ కార్డుల వినియోగం మొదలు పెట్టాడు. కరెన్సీకి బదులుగా వీటితో చెల్లింపు చేయడం ప్రారంభించాడు. ఇలా అతడి క్రెడిట్​ కార్డుల ప్రయాణం మొదలైంది.  కార్డుల ద్వారా ఆర్థిక సౌలభ్యంతో పాటు రికార్డులు, క్యాష్​బాక్​లు, డిస్కౌంట్లు, మూవీ కూపన్లు వస్తుండడంతో విరివిరిగా వాడుతూ వచ్చాడు.

    Credit cards | మనీష్​ ఏమంటున్నారంటే..

    క్రెడిట్​ కార్డుల వినియోగంలో గిన్నిస్​ రికార్డు సాధించిన మనీష్​ ఏమంటున్నాడంటే.. ‘క్రెడిట్ కార్డులు నా జీవితంలో ఒక పెద్ద భాగమైపోయాయి. ఇవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. వీటి వల్ల నేను ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాను. హోటల్ బుకింగ్ డిస్కౌంట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్రీ మూవీ టిక్కెట్లు, స్పా వోచర్లు, గోల్ఫ్ సెషన్లు, ఫ్యుయల్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇవన్నీ ఈ కార్డుల వల్లే లభిస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

  • Heart diseases in youngers | యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. అందుకు కారణాలేమింటంటే..!

    Heart diseases in youngers | యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. అందుకు కారణాలేమింటంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Heart diseases in youngers | గుండె జబ్బులు ఒకప్పుడు 50 నుంచి 60 వయస్సు పైబడిన వారికే అత్యధికంగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యువతలో గుండెజబ్బు సమస్యలు గణనీయంగా పెరిగాయి. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు యువత సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోతున్నారు. చాలా మంది ముందస్తుగా హార్ట్​ఎటాక్​ లక్షణాలు కనిపించడం లేదు. గుండెపోటు లక్షణాలు ఇందుకు గల కారణలపై ‘India tv’ కథనం ప్రకారం..

    Heart diseases in youngers | మారిన జీవనశైలి

    నేటి ఆధునిక యుగంలో ప్రజల జీవనశైలి మారిపోయింది. జంక్​ ఫుడ్​కు (junk food) అలవాటు పడడం, పని ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చుని కంప్యూటర్లపై పనిచేయడం ఇలా వివిధ కారణాల వల్ల డయాబెటిస్ (Diabetes), అధిక కొలెస్ట్రాల్ (high cholesterol), ఊబకాయం (obesity) వంటివి వస్తున్నాయి. దీనివల్ల యువకులలో గుండె జబ్బుల ప్రాబల్యం పెరుగుతోంది. ఓ డయాగ్నోస్టిక్స్ డేటా ప్రకారం.. 25–35 సంవత్సరాల వయస్సు గల యువకుల్లో 13 శాతం మంది డయాబెటిక్, 25 శాతం మంది ప్రీ-డయాబెటిక్ స్టేజ్​ ఉన్నారు. అంతేకాకుండా 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు.

    Heart diseases in youngers | గంటల తరబడి కూర్చుని పనిచేయడం..

    గుండె జబ్బులు పెరగడానికి మన ప్రస్తుత జీవన విధానం ఎంతో ప్రభావం చూపిస్తోంది. యువత గంటల తరబడి డెస్క్‌ల వద్ద కూర్చుని పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో వండిన భోజనానికి బదులుగా.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్​ఫుడ్​, కూల్​డ్రింక్స్​​ లాంటివి అధికంగా తీసుకున్నారు. ఇలా ఆరోగ్యానికి హానీ చేసి ఫుడ్​ తీసుకోవడం వల్ల చిన్న వయస్సులో అధిక కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి.

    Heart diseases in youngers | ఒత్తిడి మరో సమస్య

    ప్రస్తుతం యువతలో పెరుగుతున్న ఒత్తిడి కూడా హార్ట్​ ప్రాబ్లమ్స్​ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఉద్యోగంతో పాటు ఇతర ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఎదుర్కోవడం అనేది రక్తపోటును పెంచుతుంది. ఇది కాలక్రమేణా గుండెకు హాని చేస్తుంది. దీనికి తోడు 20 నుంచి 30 ఏళ్ల వయస్సుల్లోనే డయాబెటిక్​ బారిన పడుతున్నారు.

    Heart diseases in youngers | నిద్ర లేమి, బయటి ఆహారం తీసుకోవడం వల్ల..

    యువత ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. సగటు మనిషి సరిపోయేంత నిద్ర పోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో రక్తపోటు, గుండె ఒత్తిడిని పెంచే హార్మోన్లను విడుదల చేస్తుంది. సుదీర్ఘమైన కార్యాలయ గంటలు, లేట్​ నైట్​ వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్ అనేవి నిద్రను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారం మరో కారణం. అధిక చక్కెర ఉంటే పానీయాలు, జంక్​ఫుడ్​, ఫాస్ట్ ఫుడ్‌లో చెడు కొవ్వులు, సోడియం, చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, ఊబకాయం, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారి తీస్తున్నాయి.

    Heart diseases in youngers | ఇలా చేయండి..

    • తక్కువ ప్రాసెస్ చేసిన, ఫ్రైడ్​ ఆహారాన్ని తీసుకోండి. ఇంట్లో వండిన భోజనానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వండి.
    • రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. వాకింగ్​, సైక్లింగ్​, యోగా లాంటివి చేయండి.
    • వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోండి. రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోండి.
    • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.
    • అలసట, ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  • EV vehicles | ఈవీ కార్లు కొనాలనుకునే వారి గుడ్​న్యూస్​.. త్వరలో తగ్గనున్న ధరలు..!

    EV vehicles | ఈవీ కార్లు కొనాలనుకునే వారి గుడ్​న్యూస్​.. త్వరలో తగ్గనున్న ధరలు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: EV vehicles | గత కొంతకాలంగా ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా కూడా పెట్రోల్​ వాహనాలతో పోలిస్తే చాలా తక్కువగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ఛార్జీలు స్టేషన్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో పాటు వీటి ధరలు అధికంగా ఉండడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పెట్రోల్​ కార్లతో పోలిస్తే రేట్లు ఎక్కువ కావడంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపించడంలేదు. కాగా.. ఈ క్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలో ఈవీ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

    EV vehicles | ఎందుకు తగ్గనున్నాయంటే..

    ప్రస్తుతం పెట్రోల్‌ వెహికిల్స్​ రేట్ల కంటే ఎలక్ట్రికల్​ వెహికిల్స్​ ధరలు అధికంగా ఉంటున్నాయి. అయితే ఈవీల ప్రొడక్షన్​ పెరగడం.. వినియోగం సైతం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 4–6 నెల్లలో పెట్రోల్​, ఈవీ వాహనాల మధ్య అంతరం తగ్గిపోనుందని పేర్కొన్నారు. 20వ ఫిక్కీ హైయర్‌ ఎడ్యుకేషన్‌ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు.

    EV vehicles | మూడో అతిపెద్ద దేశంగా భారత్​

    భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుందని గడ్కరీ తెలిపారు. అమెరికా రూ.78 లక్షల కోట్లు, చైనా రూ.47 లక్షల కోట్లు తర్వాతి స్థానంలో రూ.14 లక్షల కోట్లుతో మనం మూడో ప్లేస్​లో ఉన్నాయని వివరించారు. అయితే రానున్న ఐదేళ్లలో భారత వాహన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

    EV vehicles | శిలాజ ఇంధనాలతో పర్యావరణానికి ముప్పు

    శిలాజ ఇంధనాలపై ఆధారపడడం మన దేశానికి ఆర్థిక భారమని గడ్కరీ వివరించారు. ప్రతియే పెట్రో ఉత్పతుల దిగుమతులపై రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికీ ముప్పు కలుగుతోందన్నారు. అందుకే దశ పురోగతి కోసం శుద్ధ ఇంధనాన్ని అందిపుచ్చుకోవడం కీలకమని చెప్పారు. ఇథనాల్​ను ఉత్పత్తి చేస్తుండడం వల్ల కొంత భారం తగ్గిందన్నారు. జొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని వివరించారు. 2027 నాటికి రహదారుల నిర్మాణంలో ఘన వ్యర్థాలను వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. తద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు.