తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Akhanda 2 postponed Reason | ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై తొలిసారి నోరు విప్పారు. హీరో శ్రీనందు నటించిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రం వాయిదా గురించి స్పష్టత ఇచ్చారు.
“నేను కూడా ఉదయం నుంచి అఖండ 2కి సంబంధించిన ఆర్థిక ఇష్యూను క్లియర్ చేయడానికే బయట తిరిగాను. అందుకే ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చాను” చెప్పారు.

Akhanda 2 postponed Reason | ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు..
“అఖండ 2 సమస్య కేవలం కొన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవే. అవి బయటకు చెప్పకూడని విషయాలు. కానీ ఇప్పుడు ఎవరి మనసు వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు.. ఇది చాలా దురదృష్టకరం. ‘ఎన్ని కోట్లు ఇవ్వలేదు’, ‘ఎవరికి డబ్బులు ఆపారు’ అని రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. అవన్నీ పూర్తిగా అనవసరమైన, పుకార్లు మాత్రమే. ప్రేక్షకులు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. Akhanda 2 postponed Reason త్వరలోనే ఈ ఆటంకం తొలగిపోతుంది, చిత్రం రిలీజ్ అవుతుంది. గతంలో కూడా అనేక సినిమాలు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని విజయవంతంగా విడుదలయ్యాయి” అని ఆయన చెప్పారు.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సిన నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ 2: ది తాండవం’ చిత్రం ఆఖరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత సురేశ్ బాబు ఇచ్చిన ఈ హామీ అభిమానులకు కొంత ఊరటనిచ్చే వార్తగా నిలుస్తోంది. త్వరలోనే అధికారిక కొత్త రిలీజ్ తేదీ ప్రకటన రానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Producer Suresh Babu speaks about #Akhanda2 financial issues 🎬💰 pic.twitter.com/OVqWGgmXAm
— 123telugu (@123telugu) December 5, 2025
ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్ఎన్ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్.. అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai



