Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Category: Telugu News Today

  • Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    Laptop Charging |ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: నేటి ఆధునిక యుగంలో కాలేజీ స్టుడెంట్​ నుంచి సాఫ్ట్​వేర్​ ఉద్యోగి వరకు ల్యాప్​టాప్​ తప్పనిసరి అయిపోయింది. నిత్యం జీవితంలో ఇది కూడా ఓ భాగంగా మారిపోయింది. ఆఫీస్​ వర్క్​, ప్రాజెక్ట్స్​ ఇలా ఏదీ చేయాలన్నా దీని అవసరం తప్పదు. ఈ నేపథ్యంలో ల్యాప్​టాప్​ను భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వాడే డివైజ్​ ఏ కంపెనీకి చెందినదైనా సరే.. దానిని నిర్వహణ అనేది ఎంతో ముఖ్యం. కొన్ని జాగ్రత్‌తలు తీసుఉకుంటూ వాడితే సుదీర్ఘకాలం బాగుంటుంది. ల్యాప్​టాప్​ నిర్వహణలో ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించాలో తెలుసుకుందామా మరి..

    Laptop Charging |ఇలా ఓపెన్ చేయకండి..

    ల్యాప్​టాప్​ను కొందరు ఒక మూల నుంచి తెరుస్తుంటారు. ఈజీగా ఉంటుందని ఇలా ఓపెన్ చేస్తుంటారు. అయితే తరచూ ఇలా చేయడం వల్ల పైభాగంలోని డిస్​ప్లే ఒకవైపు వంగిపోతుంది. దీంతో ఇటీవల కొన్ని ల్యాప్​టాప్​లను ఓపెన్ చేసేందుకు స్పెషల్​గా ‘బంప్’ ఇస్తున్నారు. ల్యాప్​టాప్​ను ఎప్పుడైనా సరే మధ్యలో నుంచే తెరవాలి. అంతేకాకుండా ల్యాప్​టాప్​లను ఒకవైపు నుంచి ఇతరులకు ఇవ్వడం.. ఒంటి చేతితో పట్టుకెళ్లడం సురక్షితం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. మెటల్​ బాడీ ఉండే డివైజ్​లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా.. ప్లాస్టిక్​తో చేసిన బాడీ ఉన్నవయితే కొన్ని సార్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

    Laptop Charging |వెంటిలేషన్​ ఉండేలా చూసుకోవాలి..

    ల్యాప్​టాప్​లకు వెంటిలేషన్​ ఉండేలా చూసుకోవడం అవసరం. బయటి గాలి లోపలికి వెళ్లడం, లోపలి గాలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ల్యాప్​టాప్​లలో ఫ్యాన్లు కింది వైపు ఉంటాయి. మనం ల్యాప్​టాప్​ను సోఫా, బెడ్, తొడలు, మెత్త(దిండు)పై ఉంచి వాడినట్లయితే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. దీంతో అవి త్వరగా వేడెక్కుతాయి. ఈ కారణంగా వాటి పనితీరు మందగించి ‘హ్యాంగ్’ అవుతూ ఉంటుంది.‌

    Laptop Charging |దుమ్ము దూళి లోపలికి వెళ్లకుండా..

    చాలామంది సాధారణంగా ల్యాప్​టాప్​ను షట్​డౌన్ చేసిన అనంతరం దానిని మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. దీంతో దుమ్ము, ధూళి, చిన్నచిన్న అణువులు కీబోర్డు, స్పీకర్ల ద్వారా లోపలికి వెళ్తాయి. అవి హార్డ్​వేర్ కాంపోనెంట్లలోకి చేరడం మూలంగా పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ల్యాప్​టాప్​ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

    ఇలా క్లీన్​ చేయండి..
    చాలామంది ల్యాప్​టాప్​ కీబోర్డుల్లో చేరిన దుమ్మును క్లీన్ చేయడానికి టూత్​బ్రష్ లాంటివి వాడుతుంటారు. అయితే ఇలా చేయకుండా మార్కెట్​లో అందుబాటులో ఉన్న ‘ల్యాప్​టాప్ క్లీనింగ్ కిట్’ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కీబోర్డు పాడవకుండా, డస్ట్ లోనికి వెళ్లకుండా తెరలు సైతం అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే​ స్క్రీన్​లను శుభ్రం చేయడానికి వాటర్ స్ప్రేలను వాడుతుంటారు. అలా చేయకూడదు. నీరు ల్యాప్​టాప్​ లోపలికి వెళ్లి హార్డ్​వేర్ కాంపోనెంట్ల ద్వారా షార్ట్​సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది.
    ల్యాప్‌టాప్ ఛార్జింగ్

    బ్యాటరీ విషయంలో జాగ్రత్తలు..
    సాధారణంగా చాలా మంది ల్యాప్​టాప్​లను వంద శాతం ఛార్జింగ్ చేస్తుంటారు. అలాగే జీీరో అయ్యే వరకూ వాడుతుంటారు. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 20 – 80 శాతం ఛార్జింగ్ సురక్షితమని పేర్కొంటున్నారు. ల్యాప్​టాప్ కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఛార్జర్​ను వాడాలని సూచిస్తున్నారు. Laptop Charging :థర్డ్​పార్టీ సాఫ్ట్​వేర్​లు వినియోగించొద్దు..
    ​నెట్​లో కనిపించే థర్డ్​పార్టీ యాప్​లను చాలామంది ఇన్​స్టాల్ చేస్తుంటారు. అయితే ఇది వ్యక్తిగత గోప్యతతో పాటు ల్యాప్​టాప్​ పనితీరును దెబ్బతీస్తుంది. సంబంధిత మైక్రోసాఫ్ట్ స్టోర్, ప్లేస్టోర్​, యాప్​స్టోర్ ద్వారానే యాప్​లను ఇన్​స్టాల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్​వేర్​ ఇన్​స్టాలింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

    సమస్యలు వస్తే..
    ల్యాప్​టాప్​లలో సమస్యలు తలెత్తినసమయంలో దగ్గరలోని సర్వీస్ సెంటర్లకు వెళుతుంటారు. ఇలా చేయవద్దు. సంబంధిత కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే రిపేర్​కు ఇవ్వాలి. ముందు బయట రిపేర్ చేయించి.. అనంతరం ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్​కు వెళ్లడం వల్ల ఏడాది వరకు ఉండే వారంటీని సైతం నిరాకరిస్తారని నిపుణులు చెబుతున్నారు. (x.com/ze_rusty)

    Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • IRCTC Package |ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. సౌత్ ఇండియాలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు 10 రోజుల్లో చుట్టేయవచ్చు..

    IRCTC Package |ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. సౌత్ ఇండియాలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు 10 రోజుల్లో చుట్టేయవచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: IRCTC Package |ప్రయాణికుల సౌకర్యార్థ్యం ఇండియన్ రైల్వే కేటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) ప్రత్యేక టూర్​ ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో ప్యాకేజీని అందుబాటులో తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా 10 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు ఆధ్యాతిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. శ్రీ రామేశ్వరం – తిరుపతి దక్షిణ యాత్ర పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్​ కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించింది. దీని ద్వారా సౌత్​ ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. తిరుపతి నుంచి రామనాథస్వామి ఆలయం వరకు సందర్శించవచ్చు.

    IRCTC Package |టూర్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే..!

    ఈ టూర్​ మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు ఉండనుంది. ఈ టూర్​ ప్యాకేజీ నవంబర్‌ నెలలో ఉంటుంది. నవంబర్ 7 – నవంబర్ 16 యాత్ర సాగనుంది.

    IRCTC Package |దర్శించుకునే ప్రాంతాలివే..

    నవంబర్ 7న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉంటుంది. అనంతరం పద్మావతి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత రామేశ్వరంలో రంగనాథ స్వామి ఆలయం, ధనుష్కోడిలోని కోదండ రామాలయం దర్శనం కల్పిస్తారు. అనంతరం మధురై చేరుకున్న తర్వాత మీనాక్షి అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి దేవాలయం, గాంధీ మండపం సందర్శిస్తారు. ఇక చివరగా తిరువనంతపురం చేరుకుని అక్కడ పద్మనాభ స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే కోవాలమ్ బీచ్​ను చూడవచ్చు.

    IRCTC | ప్యాకేజీ వివరాలివే..
    పెద్దలు: రూ. 18,040 (స్లీపర్ క్లాస్), రూ. 30,370 (3 AC), రూ. 40,240 (2 AC) ఉంటుంది.
    పిల్లలు (5–11 సంవత్సరాలు) : రూ. 16,890 (స్లీపర్), రూ. 29,010 (3 AC), రూ. 38,610 (2 AC) ఉంటుంది.

    IRCTC | బస, భోజనం వివరాలివే..
    ప్రయాణికులు బడ్జెట్ హోటల్స్, ఏసీ-నాన్ ఏసీ రూంలలో ఉండవచ్చు. కేవలం శాఖాహార భోజనం మాత్రమే అందిస్తారు.

    Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Ujjwala Scheme | ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్.. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోండి..

    Ujjwala Scheme | ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్.. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోండి..

    తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు మహిళలు ఇళ్లలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. ఈ పొగ ఆరోగ్య సమస్యలకు దారితీసేది. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనుకుంది. ఇందుకోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు (Pradhan Mantri Ujjwala Yojana) శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2016 ఈ పథకాన్ని ప్రారంభించారు. యూపీలోని బలియాలో పథకాన్ని అంకురార్పణ చేశారు. ఈ పథకంలో భాగంగా పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. ఇందులో భాగంగా ఏడాదికి 12 సిలిండర్లు పొందవచ్చు. ఈ పథకానికి అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకుందాం..

    Ujjwala Scheme | రూ. 550కే గ్యాస్ సిలిండర్

    Ujjwala Scheme వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. గ్యాస్ వల్ల ముఖ్యంగా మహిళలకు కట్టెల పొయ్యి అవస్థలు తప్పాయి. అయితే వీటిని పేదలు కొనుగోలు చేయలేకపోయేవారు. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజనను ప్రవేశ పెట్టింది. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా.. రూ.550కే సిలిండర్ను అందిస్తున్నారు.

    కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్
    ఉజ్వల యోజన కింద తొలి దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. అలాగే రెండో దశలో (UJJWALA 2.0) డిసెంబర్ 2024 వరకు 2.34 కోట్ల కనెక్షన్లు ఉచితంగా అందించారు. ప్రస్తుతం నూతన దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

    పొగ కష్టాలు దూరం
    ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన మహిళల ఇబ్బందులను తొలగించింది. కట్టెలు, బొగ్గులు, పిడకలు ఉపయోగించి వంట చేసేటప్పుడు విషపూరితమైన పొగ వస్తుంది. నిత్యం ఈ పొగను పీల్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉజ్వల యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. అలాగే అనారోగ్యాల బారిన నుంచి బయట పడేలా చేసింది.

    Ujjwala Scheme : ప్రయోజనాలివే..


    ఉజ్వల యోజనలో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది.
    రూ. 550కే గ్యాస్ సిలిండర్ లభ్యమవుతుంది.
    కనెక్షన్ తీసుకున్న సమయంలో గ్యాస్ నింపిన సిలిండర్ ఇస్తారు.
    ఈ పథకం పేద ప్రజలకు వరంలా మారింది.

    అర్హతలివే..

    పథకం లబ్ధిదారు మహిళ అయి ఉండాలి.
    వయస్సు 18 ఏళ్లకు పైబడి ఉండాలి.
    షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు అయ్యి ఉండాలి.
    దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబం (BPL) ఉండాలి.
    ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావలసిన పత్రాలు..
    ఆధార్ కార్డు (aadhar card)
    నివాస ధృవీకరణ పత్రం
    పాస్‌పోర్ట్ సైజు ఫొటో
    ఆహార భద్రత కార్డు
    కుల ధ్రువీకరణ పత్రం

    Ujjwala Scheme కి ఈ–కేవైసీ (e-KYC) తప్పనిసరి..

    ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈ–కేవైసీ (e-KYC) చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ (IFSC code) అవసరం అవుతాయి. ఉజ్వల యోజన అధికారిక వెబ్‌సైట్‌లో (https://pmuy.gov.in/) దరఖాస్తు చేసుకోవచ్చు.


    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!
  • Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్​.. ధర ఎంతో తెలుసా..!

    Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్​.. ధర ఎంతో తెలుసా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Macbook pro m5 | దిగ్గజ మొబైల్​ సంస్థ ఆపిల్​ తన అభిమానులను ఆకట్టుకునేలా నూతన మ్యాక్‌బుక్ ప్రోను (Macbook pro m5) భారత్‌లో గ్రాండ్​గా లాంచ్ చేసింది. ఎమ్5 చిప్​తో అత్యాధునికమైన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో పాటు గ్రాఫిక్స్ వర్క్​ చేసేవారికి అద్భుతమైన వేగాన్ని అందించనుంది. దీని ధర రూ. 1,69,900ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రొఫెషనల్స్​తో పాటు క్రియేటర్లకు వారి పనిని మరింత సులభతరంగా మారుస్తుందని కంపెనీ పేర్కొంది.

    Macbook pro m5 | వేగవంతమైన పనితీరు.

    ఆపిల్ లాంచ్​ చేసిన ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా.. మ్యాక్‌బుక్ లైనప్‌ను మరింత శక్తివంతం చేసింది. గతంలోని ఎం4 చిప్‌తో పోలిస్తే.. ఈ ఎం 5 చిప్ ఏఐ పనుల్లో 3.5 రెట్లు వేగవంతమైన పనితీరు చూపిస్తుంది. గ్రాఫిక్స్‌లో 1.6 రెట్లు మెరుగైన ప్రదర్శనను కనబరుస్తుంది. దీనివల్ల క్రియేటివ్ యాప్‌లలో ఏఐ టూల్స్ మరింత సులభంగా వర్క్​ అవుతాయి. అంతేకాకుండా ఎస్‌ఎస్‌డీ పనితీరు 2 రెట్లు వేగవంతంగా పనిచేస్తుంది. బ్యాటరీ లైఫ్ 24 గంటల వరకు ఉంటుంది.

    Macbook pro m5 | స్పెసిఫికేషన్లు, ఫీచర్స్​ ఇవే..

    నూతన మ్యాక్‌బుక్ ప్రో 14 ఇంచ్ మోడల్‌తో వస్తోంది. ఇందులో 14.2 ఇంచ్ లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే రిజల్యూషన్ 3024×1964 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కంపెనీ తెచ్చింది. నానో – టెక్స్​చర్​ గ్లాస్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇది రిఫ్లెక్షన్లను తగ్గించి మెరుగైన వ్యూయింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇస్తుంది.

    ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఎం5 చిప్‌లో 10-కోర్ సీయూ (4 పర్​ఫార్మెన్స్​ కోర్​లు, 6 ఎఫిషియెన్సీ కోర్​లు), 10-కోర్ జీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్లు ఉన్నాయి. మెమరీ 16 జీబీ నుంచి 24 జీబీ వరకు లభ్యవమవుతున్నాయి. స్టోరేజ్ 512 జీబీ నుంచి వన్​ టీబీ వరకు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఇచ్చిన 12 ఎంపీ సెంటర్ స్టేజ్ కెమెరాతో పాటు సిక్స్-స్పీకర్ స్పెషల్ ఆడియో సిస్టమ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్​ మరింత సౌకర్యంగా మారనుంది. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, ఎస్‌డీ కార్డ్ స్లాట్, హెడ్‌ఫోన్ జ్యాక్, హెడ్‌ఎంఐ పోర్ట్‌లు సైతం ఇందులో ఉన్నాయి. కాగా.. ఈ ల్యాప్‌టాప్ macOS తాహో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఇందులో స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

    Macbook pro m5 | మ్యాక్‌బుక్ ప్రో ధరలు ఇలా..

    • 16జీబీ ర్యామ్ / 512జీబీ స్టోరేజ్: రూ. 1,69,900
    • 16జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్: రూ. 1,89,900
    • 24జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్: రూ. 2,09,900 వేరియంట్లు ఉన్నాయి.

    Macbook pro m5 | డిస్కౌంట్​ ఆఫర్లు ఇవే..

    అయితే స్టూడెంట్స్​ కోసం డిస్కౌంట్​ ఆఫర్లు ఉన్నాయి. స్టూడెంట్స్ ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ద్వారా రూ. 10,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రీ-ఆర్డర్ ఆపిల్ వెబ్‌సైట్, దేశంలోని నాలుగు ఆపిల్ స్టోర్లు, అథరైజ్డ్ రీసెల్లర్ల ద్వారా చేసుకోవచ్చు. ఇక అధికారిక సేల్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

    Read aslo : Gmail account | మీ జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!

  • Winter Health Care | చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ఆరోగ్యం సేఫ్..

    Winter Health Care | చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ఆరోగ్యం సేఫ్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Health Care : చలికాలం వచ్చిందంటే చాలు.. మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చలి కారణంగా చర్మ సంబంధిత సమస్యలతో ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే సీజన్​ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో చలి అంతగా లేదు. కానీ.. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు.

    Winter Health Care | శీతాకాలం.. వాధ్యుల కాలం..

    చలికాలం(Winter) అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. జలుబు, దగ్గు నుంచి మొదలు పెడితే ఆస్తమా వరకు అనేక సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడంతో పాటు విటమిన్ లోపాలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి.

    Winter Health Care | ఈ జాగ్రత్తలు పాటించండి..

    చలి కాలంలో కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన నియమాలు పాటించడం వల్ల చలికాలాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో దాహం ఎక్కువగా కాదు.. అయినా కూడా నీటి అధికంగా తీసుకోవాలి. దీని వల్ల అందంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. అందుకే చర్మానికి తేమ అవసరం.. కాబట్టి మాయిశ్చరైజర్లు (Moisturizers) వాడాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో పెదాలు కూడా పగిలే అవకాశం ఉంటుంది. లిప్ బామ్​లు వినియోగించడం వల్ల ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

    Winter Health Care | రోగనిరోధక శక్తిని పెంచుకోండి..

    పలు ఆహార నియమాలు పాటించడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చే. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు తీసుకోవడం వల్ల జలుబు(Cold), దగ్గు (Cough) నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. నారింజ, నిమ్మకాయలు వంటివి వాటిలో సి విటమిన్​ అధికంగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉన్న వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే ఎండలో వాకింగ్‌కు వెళ్లడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్‌ డి లభిస్తుంది.

    Winter Health Care | వెచ్చదనం కలిగించే దుస్తులు ధరించాలి

    చలికాలంలో మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తే.. వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు కాకుండా ఉన్నితో (Woolen cloths) రూపొందించనవి ఎంచుకోండి. అలాగే పాలీప్రొఫైలిన్ వంటి సింథటిక్ ఫాబ్రిక్‌ను కూడా ధరించవచ్చు. ఎందుకంటే ఇది తేమను దూరం చేసి వేడిని కలిగిస్తుంది.

    • చలికాలంలో వ్యాయామం, వాకింగ్​, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
    • అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయాలి.
    • వేడినీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.
    • స్నానం చేసిన 15 నిమిషాల అనంతరం మాయిశ్చరైజర్లు చర్మానికి రాసుకోవాలి.
    • బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, గ్లౌజులు, కోట్లు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

    గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

  • EV vehicles | ఈవీ కార్లు కొనాలనుకునే వారి గుడ్​న్యూస్​.. త్వరలో తగ్గనున్న ధరలు..!

    EV vehicles | ఈవీ కార్లు కొనాలనుకునే వారి గుడ్​న్యూస్​.. త్వరలో తగ్గనున్న ధరలు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: EV vehicles | గత కొంతకాలంగా ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా కూడా పెట్రోల్​ వాహనాలతో పోలిస్తే చాలా తక్కువగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ఛార్జీలు స్టేషన్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో పాటు వీటి ధరలు అధికంగా ఉండడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పెట్రోల్​ కార్లతో పోలిస్తే రేట్లు ఎక్కువ కావడంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపించడంలేదు. కాగా.. ఈ క్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలో ఈవీ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

    EV vehicles | ఎందుకు తగ్గనున్నాయంటే..

    ప్రస్తుతం పెట్రోల్‌ వెహికిల్స్​ రేట్ల కంటే ఎలక్ట్రికల్​ వెహికిల్స్​ ధరలు అధికంగా ఉంటున్నాయి. అయితే ఈవీల ప్రొడక్షన్​ పెరగడం.. వినియోగం సైతం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 4–6 నెల్లలో పెట్రోల్​, ఈవీ వాహనాల మధ్య అంతరం తగ్గిపోనుందని పేర్కొన్నారు. 20వ ఫిక్కీ హైయర్‌ ఎడ్యుకేషన్‌ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు.

    EV vehicles | మూడో అతిపెద్ద దేశంగా భారత్​

    భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుందని గడ్కరీ తెలిపారు. అమెరికా రూ.78 లక్షల కోట్లు, చైనా రూ.47 లక్షల కోట్లు తర్వాతి స్థానంలో రూ.14 లక్షల కోట్లుతో మనం మూడో ప్లేస్​లో ఉన్నాయని వివరించారు. అయితే రానున్న ఐదేళ్లలో భారత వాహన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

    EV vehicles | శిలాజ ఇంధనాలతో పర్యావరణానికి ముప్పు

    శిలాజ ఇంధనాలపై ఆధారపడడం మన దేశానికి ఆర్థిక భారమని గడ్కరీ వివరించారు. ప్రతియే పెట్రో ఉత్పతుల దిగుమతులపై రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికీ ముప్పు కలుగుతోందన్నారు. అందుకే దశ పురోగతి కోసం శుద్ధ ఇంధనాన్ని అందిపుచ్చుకోవడం కీలకమని చెప్పారు. ఇథనాల్​ను ఉత్పత్తి చేస్తుండడం వల్ల కొంత భారం తగ్గిందన్నారు. జొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని వివరించారు. 2027 నాటికి రహదారుల నిర్మాణంలో ఘన వ్యర్థాలను వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. తద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Gaza war | గాజా – ఇజ్రాయిల్ వార్​కు రెండేళ్లు.. ఈ యుద్ధం ముగిసేదెన్నడు..!

    Gaza war | గాజా – ఇజ్రాయిల్ వార్​కు రెండేళ్లు.. ఈ యుద్ధం ముగిసేదెన్నడు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Gaza war | సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ప్రపంచం ఉలిక్కిపడింది. 2023 అక్టోబర్ 7న హమాస్​ ముష్కరులు ఎవరూ ఊహించని రీతిలో ఇజ్రాయిలోకి చొచ్చుకొచ్చారు. ఓ ఈవెంట్​లో పాల్గొన్న వారిని పిట్టల్లా కాల్చారు. సుమారు 1200 మందిని హతమార్చారు. అంతేకాకుండా దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుని తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటన యావత్​ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. నాటి ఘటన ఇంకా కళ్లముందు కదలాడుతోంది.

    Gaza War | విరుచుకుపడ్డ ఇజ్రాయిల్​

    హమాస్​ దాడితో షాక్​కు గురైన ఇజ్రాయిల్​ వెంటనే తేరుకుంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది. దాడితో సంబంధం ఉన్న హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఇజ్రాయిల్​ సైన్యం పాలస్తీనాలోకి చొచ్చుకెళ్లి అడుగడుగు జల్లెడ పట్టి మరీ హమాస్​ ఉగ్రమూకలను హతమార్చింది. ఈ క్రమంలో చాలా మంది సామాన్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది.

    Gaza War | ఎటు చూసినా శవాలు.. కూలిన బంగ్లాలు..

    హమాస్​ ఉగ్రవాదులు మట్టుబెడతామని ప్రతిన బూనిన ఇజ్రాయిల్​ గత రెండేళ్లు పాలస్తీనాలో భీకర దాడులు చేస్తోంది. ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు చేస్తూ.. ఉగ్రవాదులను ఏరివేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఇజ్రాయిల్​ దాడులు (Gaza war) కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాలస్తీనా శవాల దిబ్బగా మారింది. అంతేకాకుండా ఎటువైపుచూసినా కూలిపోయిన బంగ్లాలతో కళావిహీనంగా మారిపోయింది. కాగా.. గత ఆరునెలల క్రితం మాత్రమే కొన్ని రోజుల పాటు కాల్పులకు బ్రేక్​ ఇచ్చింది. ఈ సమయంలో హమాస్​ – ఇజ్రాయిల్​ మధ్య జరిగిన ఒప్పదం ప్రకారం.. కొందరు బందీలను విడుదల చేశారు.

    Gaza War | శాంతికి 20 పాయింట్ల ప్రణాళిక

    మిడిల్​ ఈస్ట్​లో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ యత్నిస్తున్నారు. హమాస్​ – ఇజ్రాయిల్​ మధ్య శాంతి ఒప్పందం కోసం 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. కాగా.. దీనిని ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలను విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అంతేకాకుండా పాలస్తీనా ఖైదీలను సైతం విడుదల చేసేందుకు ఇజ్రాయిల్ కూడా అంగీకారం తెలిపింది. అయితే ట్రంప్​ రంగంలోకి దిగడంతో శాంతి చర్చలు సఫలమై యుద్ధం ముగుస్తుందా అనేది చూడాలి.

  • Gold price | ఆగని పసిడి పరుగులు.. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..

    Gold price | ఆగని పసిడి పరుగులు.. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Gold price | బంగారం ధరలు (Gold prices) గత కొద్ది రోజులు రాకెట్​ వేగంతో దూసుకుపోతున్నాయి. పట్టపగ్గాలు లేనట్లు పరుగులు పెడుతున్నాయి.

    Gold price | బంగారం పెరుగుదలకు కారణాలేమిటి..!

    చూస్తుండగానే ధరలు రికార్డులు బ్రేక్​ చేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, పలు దేశాలు బంగారం కొనుగోలును పెంచడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేట్ల పెరుగుదలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

    భారత మార్కెట్​లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.84వేలు ఉండగా.. నేడు రూ. లక్షా 2‌‌0వేలకు చేరింది. అంటే దాదాపు గత ఎనిమిది నెలల్లో రూ. 36వేలు ధర పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు అమెరికర: డాలర్ బలపడడం, అలాగే రూపాయి విలువ క్షీణించడం లాంటివి ధరల పెరుగుదలకు కారణాలుగా మారుతున్నాయి. పెట్టుబడి దారులు సురక్షితమైన ఇన్వెస్ట్​మెంట్​గా భావిస్తుండడంతో ధరలు రాకెట్​ వేగంతో దూసుకుపోతున్నాయి.

    Gold price | మరింత పెరగనుందా..

    అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ కొనసాగడం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు నిధులను లోహాలపైకి మళ్లిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుదల కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ. లక్షా 25 వేలకు వరకు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు సైతం పసిడితో పాటు పరుగులు పెడుతున్నాయి.

    Gold price | రూ.1,20,000కు చేరిన ధర

    బంగారం ధరలు మంగళవారం గరిష్టాన్ని తాకాయి. 24 క్యారెట్ల 1‌‌0 గ్రాముల బంగారం ధర రూ.1,20,780కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,10,710గా న‌మోదైంది. ఇక వెండి ధర కిలోకు రూ. 1,67,100 పలికింది.

  • Leh-Manali highway | ప్రపంచంలో అత్యంత సుందరమైన హైవే.. వైరల్​ అవుతున్న ఆనంద్​ మహీంద్రా ట్వీట్

    Leh-Manali highway | ప్రపంచంలో అత్యంత సుందరమైన హైవే.. వైరల్​ అవుతున్న ఆనంద్​ మహీంద్రా ట్వీట్

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​: Leh-Manali highway | ఆనంద్​ మహీంద్రా (Anand mahindra) తాజాగా పోస్ట్​ చేసిన ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. “లెహ్ – మనాలి హైవే ప్రపంచంలోని అత్యంత సుందరమైన వాటిల్లో ఒకటి. ఇది మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా.. భారత సహజ వైభవాన్ని పునరావిష్కరింపజేయాలని అనిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్​ మారింది. పోస్ట్​ చేసిన 24 గంటల్లోపే లక్షల మంది వీక్షించారు.

    Leh-Manali highway | ప్రకృతి రమణీయం లెహ్ – మనాలి హైవే..

    ప్రకృతి రమణీయత లేహ్–మనాలి హైవే సొంతం. 428 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉన్న ఈ రహదారిపై ప్రయాణించడం ఒక అద్భుతమైన ప్రయాణం ఎత్తయిన పర్వాతాలు, మధ్యలో లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, గడ్డకట్టిన నదుల అందాలు ప్రయాణికులను మంతముగ్ధులను చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి లద్దాఖ్​లోని లేహ్ వరకు సాగే ఈ రహదారి అందాలు కట్టిపడేస్తాయి. దేశంలోని నాలుగు అత్యధిక ఎత్తయిన మోటరబుల్ పాస్‌లను దాటి వెళ్తుంది. రోతాంగ్ లా, బరలాచా లా, లుంగలాచా లా, టాంగ్లాంగ్ లా పాస్​లు 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం విశేషం. కాగా.. ఈ మార్గాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్వహిస్తుంది.

    Leh-Manali highway | సాహసయాత్రికులకు స్పెషల్​

    ఈ రహదారి సాహసయాత్రికులకు ఎంతో స్పెషల్​. రైడర్స్​ తప్పకుండా టూర్​ వేయాల్సిన హైవే ఇది. కొండలు, లోయలు, హిమాలయాల్లోని హై-ఆల్టిట్యూడ్ సరస్సులు, మౌనంగా ఉండే గ్రామాలు ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది. అయితే గతంలో ఈ దారి ఏడాదిలో కేవలం ఆరు నెలలపాటు మాత్రమే తెరిచి ఉండేది. అది కూడా మంచు వర్షాల వల్ల ఎంతో క్లిష్టంగా ఉండేది. అయితే అటల్ టన్నెల్ నిర్మాణం చేపట్టడంతో ఈ మార్గం 45 కి.మీ. తగ్గిపోయింది. ప్రయాణం సులువుగా మారింది. కాగా.. ఈ రహదారిపై శింగో లా టెన్నల్​ నిర్మాణం కూడా చేపట్టారు. ఇది పూర్తయితే అన్ని కాలాల్లో ప్రయాణం చేయడానికి సులువుగా మారనుంది. అంతేకాకుండా ఈ రహదారి భారత సైన్యానికి కూడా వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన మార్గంగా చెబుతారు.

    https://twitter.com/anandmahindra/status/1974766448561328605

     

  • Government apps | ఈ రెండు ప్రభుత్వ యాప్స్​ మీకు తెలుసా.. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

    Government apps | ఈ రెండు ప్రభుత్వ యాప్స్​ మీకు తెలుసా.. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

    తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Government apps | కేంద్ర ప్రభుత్వం యువతలో స్కిల్స్​ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ యాప్స్​ను కూడా నడుపుతోంది. వీటిలో రెండు యాప్ప్​ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

    Government apps | మై గోవ్​ యాప్​..

    మై గోవ్​ యాప్​ (My gov app) అనేది పౌర భాగస్వామ్యానికి వేదికగా నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని 2014లో ప్రారంభించారు. ప్రజలు వివిధ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో పాలుపంచుకునేలా చేసేందుకు దీనిని తీసుకువచ్చారు. ప్రజల నుంచి పాలనాపరంగా మంచి ఆలోచనలను సేకరించేందుకు ఇది వేదికగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో వివిధ క్విజ్​లు, సర్వేలు, కాంపిటీషన్లు నిర్వహిస్తూ ఉంటారు. అంతే క్విజ్ ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోవాలి. అందులో చాలా క్విజ్​లు ఉంటాయి. మీకు నచ్చినది ఎంచుకుని పార్టిసిపేట్​ చేయవచ్చు. ఇందులో మీరు గెలిచినట్లయితే క్విజ్​ కాంపిటీషన్​ బట్టి రూ.5 వేల నుంచి రూ.లక్షల వరకు గెలుచుకోవచ్చు. అంతేకాకుండా గెలిచిన వారి వివరాలను ఇదే యాప్​లో నమోదు చేస్తారు.

    Government apps | స్కిల్​ ఇండియా యాప్

    స్కిల్​ ఇండియా యాప్ (Skill india) దేశంలోని ప్రజల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ​కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో చాలా రకాల కోర్సులను ఉచితంగా అందిస్తోంది. దీనిలోకి వెళ్లి ఉచితంగా లభించే సెలెక్ట్​ చేసుకుని నేర్చుకోవచ్చు. వీటిలో ఏఐకి సంబంధించిన కోర్సులను సైతం అందిస్తోంది. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్​ కూడా అందిస్తారు. అంతేకాకుండా ఇదే యాప్​లో జాబ్స్​ కూడా సెర్చ్​ చేసుకుని అప్లయ్​ చేసుకుని జాబ్​ పొందవచ్చు. ఇలా ఈ ప్రభుత్వ యాప్​లను సద్వినియోగం చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.