తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Machine Guns | ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) తమ ఉత్పత్తులైన లైట్ మెషిన్ గన్స్ను భారత్కు సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 40,000 ఎల్ఎంజీల తొలి బ్యాచ్ భారత్ చేరుకునే అవకాశం ఉందని సంస్థ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపారు. గతేడాది కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ సరఫరా జరగనుంది. కాగా ఇందుకు సంబంధించి అన్ని పరీక్షలు, నాణ్యతా తనిఖీలు పూర్తయ్యాయి. ఉత్పత్తి అనుమతులు కూడా లభించిన నేపథ్యంలో తొలి బ్యాచ్ను వచ్చే ఏటి మొదటి త్రైమాసికంలో అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.
Machine Guns | త్వరలోనే ఒప్పందం
అదే సమయంలో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్ల కొనుగోలుకు సంబంధించిన మరో భారీ ఒప్పందం కూడా ఖరారు దశలో ఉంది. సుమారు 1.70 లక్షల కార్బైన్ల సరఫరాకు భారత్ ఫోర్జ్ ప్రధాన భాగస్వామిగా, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ద్వితీయ భాగస్వామిగా ఒప్పందం కుదరనుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2026 మొదట్లోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.
Machine Guns | 60 శాతం స్థానికంగా..
ఈ కార్బైన్లలో 60 శాతం భారత్ ఫోర్జ్ ద్వారా స్థానికంగా తయారు చేయనుండగా.. మిగిలిన 40 శాతం (సుమారు 1.70 లక్షలు) అదానీ గ్రూప్కు చెందిన పీఎల్ఆర్ సిస్టమ్స్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో పాటు పిస్టల్స్, అసాల్ట్ రైఫిల్స్, ఇతర చిన్న తరహా ఆయుధాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాలకు సరఫరా చేయడం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు షుకి స్క్వాట్జ్ తెలిపారు.
Machine Guns | ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ‘అర్బెల్’
ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ భారత్కు అందించబోయే మరో అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ‘అర్బెల్ టెక్నాలజీ’. ఇది ప్రపంచంలోనే తొలి పూర్తి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్గా పరిగణించబడుతోంది. అత్యంత కచ్చితమైన లక్ష్య సాధన, రియల్ టైమ్ బాలిస్టిక్ కాలిక్యులేషన్, అధునాతన సెన్సార్ల సాయంతో యుద్ధక్షేత్రంలో సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని సంస్థ పేర్కొంటోంది.
ఇది కూడా చదవండి..: RBI interest Rates | ఆర్బీఐ నుంచి మరో గుడ్న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai



