telugu news today
Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..
Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి.
Delhi Car Blast |సాయంత్రం సమయంలో..
పేలుడు సాయంత్రం 6:55 గంటల సమయంలో అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేశాయి. పేలుడు ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ఈ-రిక్షాలు, ఆటోరిక్షాలు కాలి బూడిదయ్యాయి. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి.
కాగా.. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్, క్లూస్ టీంలతో పాటు ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం కావడంతో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటాయి. దీంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సింఘు, టిక్రీ, బదర్పూర్ వంటి కీలక పాయింట్లలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఇతర సున్నిత ప్రదేశాల్లో నిఘా పెంచారు.
Delhi Car Blast |ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కేంద్ర హొం మంత్రి అమిత్ షా చేరుకున్నారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Health benefits of dried fish | ఎండు చేపలు ఒకప్పుడు చాలా మంది రెగ్యులర్గా తినేవారు. కానీ ఇటీవల తగ్గించారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా..
Health benefits of dried fish | ఆరోగ్య ప్రయోజనాలు..
ఎండు చేపలు ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్ వంటి పోషకాలతో ఉంటాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె మంటను తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. అంతేకాకుండా పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ఎండు చేపల్లో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థతో పాటు కండరాలు, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఎండు చేపలు గర్భిణులకు మంచిదని చెబుతుంటారు. వీటిలో పాస్పరస్ పుష్కలంగా ఉండడంతో శరీరంలో ఎముకలు పుష్టిగా మారతాయి. అంతే కాకుండా దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిలోని విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎండు చేపల్లో పుష్కలంగా ఉంటాయి.
Health benefits of dried fish | వీరు తీసుకోకూడదు..
గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, షుగర్ ఉన్నవారు ఎండు చేపలు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తినే ముందు నీటిలో నానబెట్టి ఉప్పును కడిగివేయాలి. కొన్ని రకాల ఎండు చేపల్లో పాదరసం లేదా పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నాణ్యమైన చేపలనే ఎంచుకోవాలి.
గమనిక: మేం అందించిన ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో లభ్యమైన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ande Sri | సాహితీ శిఖరం నేలకొరిగింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీ (64) (Ande sri) కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7.25 గంటలకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
Ande Sri | అందెశ్రీ ప్రస్థానం
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో పుట్టారు. గొర్రెల కాపరిగా తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్న వాడు..’ గీతంతో పేరు తెచ్చుకున్నారు. కాకతీయ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర గీతంగా గుర్తించింది. అంతే కాకుండా ఇటీవల ఆయనకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.
Ande Sri | దక్కిన పురస్కారాలు
అందెశ్రీ దిట్ట 2006 సంవత్సరంలో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం దక్కింది. ఇక 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం వరించింది. అలాగే రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం దక్కించుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ లోక్నాయక్ పురస్కారాన్ని పొందారు.
Ande Sri | దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్రెడ్డి
అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచించిన అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన గేయం కోట్ల మంది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. అందెశ్రీకి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహింంచాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి..: Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
credit card payment | క్రెడిట్ కార్డు బిల్లో మినిమమ్ డ్యూ కడుతున్నారా.. ఇలా చేయడం మంచిదేనా? సిబిల్ స్కోర్ పడిపోతుందా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: credit card payment | ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. మాల్స్, షోరూంలు, సూపర్ మార్కెట్స్ ఎక్కడికి వెళ్లినా క్రెడిట్ కార్డుల ద్వారానే ప్రజలు బిల్లులు చెల్లింపులు చేస్తున్నారు. అయితే బిల్లు జనరేట్ అయ్యాక చాలా మంది ఫుల్ పేమెంట్ చేస్తున్నా.. కొందరు మినిమమ్ డ్యూ కడుతుంటారు. అయితే ఇలా మినిమమ్ డ్యూ కట్టడం మంచిదేనా? దీని వలన సిబిల్ స్కోర్ పడిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం..
నేటి కాలంలో చేతిలో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు ఉండడంతో ఏ వస్తువులైనా కొనుగోలు చేస్తున్నాయి. అయితే చాలా మంది సకాలంలో బిల్ పేమంట్ చేయలేక మినిమమ్ డ్యూ చెల్లిస్తుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని, అలాగే మీరు కట్టే అమౌంట్ ఇంట్రస్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
credit card payment | మినిమమ్ డ్యూ అంటే..
క్రెడిట్ కార్డు బిల్ పూర్తి పేమెంట్ చేయలేని వారికి వివిధ పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. మినిమమ్ పేమెంట్, పూర్తి అమౌంట్ కట్టడం, అదర్ అమౌంట్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. అయితే సకాలంలో బిల్ పే చేయలేని వారు మినిమమ్ డ్యూ కడుతుంటారు. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అసలు బిల్లులో 5 శాతాన్ని, మినిమమ్ డ్యూ గా చెల్లించేందుకు అనుమతిస్తాయి. బ్యాంకును బట్టి వీటిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
credit card payment | లేట్ ఫీ, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట
క్రెడిట్ కార్డు యూజర్లు కొందరు మినిమమ్ డ్యూ కట్టడం వల్ల ఏ ఇబ్బంది ఉండదని భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. మినిమమ్ అమౌంట్ పేమెంట్ చేయడం వలన కేవలం లేట్ ఫీజు, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట కలుగుతుంది. అయితే మీరు చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీని పడుతుంది.
credit card payment | సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా?
మినిమమ్ డ్యూ ఎక్కువ సార్లు పేమెంట్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అధిక వడ్డీలు, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా మీ అప్పు అనేది కూడా పెరిగిపోతుంది. అందుకే మినిమమ్ డ్యూ కట్టకపోవడం మంచిదంటులున్నారు. అదనపు ఛార్జీలు పడకుండా ఉండాలంటే మొత్తం బిల్ ఒకేసారి చెల్లించడం సరైందని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా ఉండడం మూలంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోపై ప్రభావం చూపింది. దీని వలన సిబిల్ స్కోర్పై ప్రభావం ఉంటుంది. మినిమమ్ డ్యూ చాలా కాలంగా ఉంచడం వల్ల అప్పు పెరగడం, అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. దీంతో సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది.
ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Smartphone Charging Tips | మీ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Smartphone Charging Tips | నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ కామన్. ఫోన్ లేకపోతే ఏ పని కాని పరిస్థితులు రోజులు వచ్చాయి. అయితే నిత్యం వాడే ఫోన్ ఛార్జింగ్ విషయంలో అనేక మంది పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఫోన్ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ జాగ్రత్తలను పాటిస్తే ఫోన్ను ఎక్కువ రోజుల పాటు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Smartphone Charging Tips | ఇలా చేయకండి..
మనం చేసే చిన్నచిన్న పొరపాట్లు ఫోన్ బ్యాటరీని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు రాత్రంతా ఫోన్ ప్లగ్చేసి ఉంచడం.. చీప్ కేబుళ్లను వాడడం వల్ల బ్యాటరీ పనితీరును తగ్గించి.. లైఫ్టైంను తగ్గిస్తాయి. అయితే బ్యాటరీలు సహజంగానే కాలక్రమేణా వాడుకతో దిగజారుతుంటాయి. కానీ కొన్ని తప్పులు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.
ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేయడం, పూర్తిగా డిశ్చార్జ్ చేయడం మానుకోవాలి. బ్యాటరీ పర్సెంటేజీ పూర్తిగా అయిపోయే వరకు చాలామంది ఛార్జింగ్ పెట్టరు. అలాగే ఛార్జింగ్ పెట్టాక 100 శాతం వరకు తొలగించారు. ఇది పాత నికెల్ బ్యాటరీల కాలం నాటి పద్ధతి. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లలో లిథియం అయాన్ లేదా సిలికాన్ కార్బన్ బ్యాటరీలు ఉంటాయి. వీటికి పూర్తిగా ఛార్జ్ చేయడం లేదా పూర్తిగా డిశ్చార్జ్ చేయడం హానికరంగా మారుతుంది. అయితే 20 శాతం నుంచి 80 శాతం బ్యాటరీ మెయింటెయిన్ చేయడం మంది. ఫోన్ ఛార్జింగ్ 20 శాతంలోపు పడిపోతే తక్కువ వోల్టేజ్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే 20 శాతం రాగానే ఛార్జింగ్ పెట్టాలి. అంతేకాకుండా బ్యాటరీ 90 శాతం –100 శాతం వద్ద అధిక వోల్టేజ్ వల్ల దెబ్బ తింటుంది. అందుకే 20–80 శాతం బ్యాటరీ మెయింటెన్ చేయాలి.
Smartphone Charging Tips | రాత్రంతా ఫోన్ను ఛార్జింగ్ పెట్టొద్దు..
రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేయడం సౌకర్యంగా ఉన్నా.. బ్యాటరీ ఆయుష్షు దెబ్బతీస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ 100 శాతానికి చేరిన తర్వాత కూడా చిన్నచిన్న పవర్ డ్రా జరుగుతుంది. ఇది వేడిని పెంచి సెల్లను దెబ్బతీస్తుంది. అయితే iPhoneలో Optimised Battery Charging, ఆండ్రాయిడ్ అయితే Adaptive Charging ఆప్షన్ను ఆన్చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఛార్జింగ్ను 80 శాతం వద్ద ఆపి, మీరు నిద్రలేచే సమయానికి పూర్తిచేస్తాయి.
Smartphone Charging Tips | ఛార్జింగ్ సమయంలో గేమింగ్, స్ట్రీమింగ్ వద్దు..
ఫోన్ ఛార్జ్ అవుతున్న సమయంలో గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం లేదా హై-పర్ఫార్మెన్స్ యాప్లు వాడడం మూలంగా బ్యాటరీపై పారాసిటిక్ లోడ్ (Parasitic Load) పడుతుంది. దీంతో వేడి పెరిగి బ్యాటరీ సైకిళ్లు అస్థిరంగా మారుతాయి. కాబట్టి ఛార్జింగ్ టైంలో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి నిలిపివేయడం ఉత్తమం.
Smartphone Charging Tips | ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి..
బ్యాటరీకి వేడి అనేది శత్రువు లాంటిది. అధిక ఉష్ణోగ్రతల్లో బ్యాటరీ కెపాసిటీ వేగంగా తగ్గిపోతుంది. అందుకే ఛార్జింగ్ సమయంలో ఫోన్ను బెడ్పై, దిండు కింద ఉంచకూడదు. అలాగే నేరుగా సూర్యకాంతి తగిలేలా పెట్టకూడదు.
Smartphone Charging Tips | ఫాస్ట్ ఛార్జింగ్ను ఎక్కువగా వాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యమైనదే.. అయినా దీర్ఘకాలంలో వేడి పెంచి బ్యాటరీకి హాని చేస్తుంది. ప్రతి రోజూ వాడడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అవసరమైన సమయంలో మాత్రమే వాడండి. రోజువారీగా నార్మల్ ఛార్జర్ను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Dak Sewa App | పోస్టల్ సేవలను తపాల శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్ సేవలను స్మార్ట్ఫోన్ ద్వారా కూడా వినియోగించుకునేలా ‘డాక్ సేవ’ పేరిట యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకోవచ్చు.
Dak Sewa App | యాప్ను డౌన్లోడ్ చేసుకోండిలా..
డాక్ సేవక్ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో (Dak Sewa App) అందుబాటులో ఉంది. అధికారిక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసి మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి సేవలను వినియోగించుకోవచ్చు.
Dak Sewa App | ఈ సౌకర్యాలు పొందవచ్చు..
డాక్ సేవ యాప్ ద్వారా వివిధ సేవలను పొందవచ్చు. పార్సిల్ ట్రాకింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెమెంట్, స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్, పోస్టేజ్ కాలిక్యులేషన్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్, ట్రాకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా మీకు దగ్గరలోని పోస్టాఫీసుల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారులు రియల్ టైమ్లో పార్సిళ్లు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్లను సైతం ట్రాక్ చేయవచ్చు. వినియోగదారులు ఎక్కువ క్యూలలో నిలబడకుండా మెయిల్ ఐటెమ్లు, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్శిల్లను బుక్ చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా డాక్ సేవక్ యాప్ ద్వారా వివిధ సేవలను మొబైల్ ద్వారానే వినియోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రెగ్యులర్ రైళ్ల బుకింగ్స్ ఫుల్ కావడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రెయిన్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ, నాందేడ్, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి.
Sabarimala special Trains | కొనసాగుతున్న బుకింగ్స్
ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లకు దక్షిణ మధ్య రైల్వే శనివారం నుంచి అవకాశం కల్పించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 20 వరకు రాకపోకలు సాగించనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కేరళలోని కొల్లాం, కొట్టాయం వైపు మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్ నుంచి ట్రైన్ అందుబాటులో ఉండనుంది.
Sabarimala special Trains | చర్లపల్లి – కొల్లాం స్పెషల్ రైలు (ట్రైన్ నెంబర్ 07113/07114)
చర్లపల్లి – కొల్లాం (07113) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 13వ తేదీ వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి స్టేషన్ నుంచి వెళ్లనుంది. కొల్లాం – చర్లపల్లి (07114) ట్రైన్ నవంబర్ 20 నుంచి జనవరి 15 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఈ రైలు సేవలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల భక్తులకు ఉపయోగకరం కానున్నాయి.
Sabarimala special Trains | కాకినాడ టౌన్ – కొట్టాయం రైలు ( ట్రైన్ నంబర్ 07109/07110)
సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలో కాకినాడ టౌన్ – కొట్టాయం (07109) ట్రైన్ నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 19 వరకు ప్రతి సోమవారం నడవనుంది. అలాగే కొట్టాయం – కాకినాడ టౌన్ (07110) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 20 వరకు ప్రతి మంగళవారం తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.
Sabarimala special Trains | నాందేడ్ – కొల్లాం రైలు ( ట్రైన్ నంబర్ 07111/07112)
భక్తుల రద్దీ దృష్ట్యా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్ను ప్రకటించారు. హజర్ సాహెబ్ నాందేడ్ – కొల్లాం (07111), కొల్లాం-హెచ్ఎస్ నాందేడ్ (07112) మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఈ రైళ్లు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంత భక్తులకు సౌకర్యంగా మారనున్నాయి.
ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్ఫోన్ ఫ్లైట్ మోడ్తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్ మరిన్ని ఫీచర్స్ తీసుకువచ్చింది. కొత్త AI ఫీచర్లతో మరిన్ని అప్డేట్స్ తెచ్చింది. ప్రత్యేకంగా భారతీయ యూజర్స్ కోసం రూపొందించిన ఫీచర్స్ ఇవి. కొత్త అప్డేట్స్ ఏంటో తెలుసుకుందామా మరి..
Google Maps | జెమినీ నావిగేషన్..
జెమినీ నావిగేషన్ అనేది డ్రైవింగ్ చేసే సమయంలో హ్యాండ్ఫ్రీ, సంభాషణాత్మక అనుభవాన్ని ఇస్తుంది. “దగ్గరలోని పెట్రోల్ పంప్ ఎక్కడ?” అని అడగడం వల్ల.. మనం వెళ్లే దారిలో పార్కింగ్ ఉందా అని తెలుసుకోవచ్చు. లేదంటే ఒక రెస్టారెంట్ వెతికి “సరే, అక్కడ వెళ్దాం” అని చెప్పొచ్చు. దీని మనను అక్కడకు తీసుకెళ్తుంది.
Google Maps | సూచనలు కూడా ఇస్తుంది..
కొత్త అప్డేట్స్ జెమినీ మ్యాప్స్ రివ్యూలు, వెబ్ కంటెంట్ను విశ్లేషిస్తుంది. అంతేకాకుండా ప్రాక్టికల్, స్పష్టమైన సూచనలు ఇస్తుంది. ఉదాహరణకు, హైదరాబాద్లో ఏదైనా మార్కెట్ గురించి చూసినట్లయితే.. “అక్కడ బేరం ఆడొచ్చు” అని సూచిస్తుంది. లేదంటే ఆ ప్రాంతంలోని అత్యుత్తమ స్టాల్స్ను సైతం చెబుతుంది.
Google Maps | మ్యాప్స్ని ప్రశ్నలు అడగొచ్చు..
మ్యాప్స్ యూజర్స్ ఇక నుంచి ఒక ప్రాంతం గురించి ప్రశ్నలు అడగవచ్చు. జెమినీ ఏఐ ఫీచర్ రివ్యూలు, ఫొటోలు, వెబ్ డేటాను పరిశీలించి చెబుతుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశాలతో పాటు పార్కింగ్ వివరాలను సైతం సూచిస్తుంది.
Google Maps | స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ అలర్ట్స్..
కొత్త ఫీచర్స్ మనం ప్రయాణించే దారిలో స్పీడ్ లిమిట్స్ను సైతం చెబుతుంది. స్థానిక ట్రాఫిక్ అధికారుల డేటా ఆధారంగా రోడ్లపై స్పీడ్ లిమిట్ను చూపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి ముంబై, హైదరాబాద్, కోల్కతా వంటి 9 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. అలాగే ప్రధాన రోడ్లలో డిజర్ప్షన్ లేదా డిలేల గురించి ఆటోమాటిక్ నోటిఫికేషన్లు అందిస్తుంది. నావిగేషన్ యూజ్చేయకపోయినా సమాచారం వస్తుంది. ఇది కూడా ప్రస్తుతానికి ప్రధాన నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫీచర్ అందుబాటులో ఉంది.
Google Maps | NHAIతో భాగస్వామ్యం..
గూగుల్ మ్యాప్స్ హైవేపై రోడ్ క్లోజర్స్తో పాటు రిపేర్ల గురించి రియల్ టైమ్ డేటా అందిస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో భాగస్వామ్యం ద్వారా ఈ వివరాలను ఇవ్వనుంది. అంతేకాకుండా రోడ్డు పక్కన రెస్ట్ రూమ్స్, పెట్రోల్ స్టేషన్ల సమాచారం కూడా అందిస్తుంది.
ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్ఫోన్ ఫ్లైట్ మోడ్తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Pickles storage | వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కాసింత నెయ్యి వేసి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటే.. ఆహా రుచే అమోఘం. చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా.. అదే మరి ఊరగాయ స్పెషాలిటీ. తెలుగు వారింట పచ్చడి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట పచ్చళ్లు వాడుతుంటారు.
అయితే పచ్చళ్లను భద్రపరిచే విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. వీటిని చాలా మంది ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం వల్ల ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేయవద్దని సూచిస్తున్నారు.

Pickles storage | ప్లాస్టిక్ డబ్బాల్లో భద్రపరిస్తే ఏమవుతుందంటే..
పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చళ్లలో ఉండే ఆమ్లాలు ప్లాస్టిక్తో చర్య జరిపి, హానికర రసాయనాలను ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందంటున్నారు. ప్లాస్టిక్ డబ్బాల నుంచి రసాయనాలు ఆహారంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరంలోని హార్మోన్స్ను డిస్ట్రబ్ చేయవచ్చు. దీనివల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. క్యాన్సర్కు సంబంధించిన రిస్క్ను పెంచే అవకాశం ఉంటుంది.

Pickles storage | ఎలా స్టోర్ చేయాలంటే..
ఒకప్పుడు మన పెద్దలుపచ్చళ్లను స్టోర్ చేసేందుకు వాడిన పద్ధతి అనేది ఉత్తమం. పచ్చళ్లను నిల్వ చేయడానికి గాలి చొరబడకుండా ఉండే గాజు డబ్బాలు ఉపయోగించవచ్చు. అలాగే పింగాణీతో చేసిన డబ్బాలు కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసినా ఇబ్బంది లేకపోయినా.. పచ్చళ్లలోని ఆమ్లాలు ప్లాస్టిక్లోని రసాయనాలను గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో నిల్వ చేయకపోవడమే ఉత్తమం. మరో విషయం ఏమిటంటే.. లోహపు డబ్బాల్లో పచ్చళ్లను నిల్వ చేయరాదు. ఎందుకంటే పచ్చళ్లలోని ఆమ్లాలు లోహంతో చర్య జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చళ్లను నిల్వ చేసే విషయం జాగ్రత్తలు తీసుకోండి.
ఇది కూడా చదవండి..: Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
